ఆన్లైన్ టిక్కెటింగ్ జీవో రద్దుపై బాలయ్య రియాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“అఖండ” భారీ విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ‘అఖండ’ హీరో బాలకృష్ణ సినిమా దర్శకుడు బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డితో కలిసి తాజాగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలయ్య ఆన్లైన్ టిక్కెటింగ్ జీవోను రద్దు చేస్తూ ఏపీ హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలపై స్పందించారు.
Read also : దుర్గమ్మ సేవలో బాలయ్య… ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు
Also Read
- IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
- KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
- Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
- Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
బాలయ్య ఆన్లైన్ టిక్కెటింగ్ విధానంపై మాట్లాడుతూ “ఆ రోజు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, ‘అఖండ’ టీం, మేము చాలా చర్చించుకున్నాము. టికెటింగ్ విధానం ఉన్నప్పటికీ సినిమా బాగుందన్న ధైర్యంతో ధైర్యంగా ముందుకు వెళ్ళాము. ఈరోజు ఏపీ హైకోర్ట్ ఆ జీవోను రద్దు చేసినప్పటికీ ప్రభుత్వం మళ్ళీ అప్పీల్ కు వెళ్తుంది. అది అలాగే నడుస్తుంది. అన్నింటికీ ప్రిపేర్ అయ్యి , సినిమా మీద, ప్రేక్షకుల మీద నమ్మకంతో, అమ్మవారి ఆశీస్సులతో సినిమాను విడుదల చేశాము. ప్రేక్షకులు సినిమాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో… వాళ్లొస్తే మేము వస్తాం అంటూ మేకర్స్ వెనుకా ముందు అవుతున్న తరుణంలో మేము ధైర్యం చేసి ముందుకు వచ్చాము. ఆ దేవుడు న్యాయనిర్ణేత. ఒక్కొక్క శబ్దంలో ఒక పవర్ ఉంటుంది. దేవుడు కరోనా నుంచి కాపాడుతున్నాడు. అలాగే ప్రేక్షక దేవుళ్ళు సినిమాకు ‘అఖండ’ విజయం అందించారు. వారికి ధన్యవాదాలు” తెలిపారు.
చిత్రపరిశ్రమ తరపున తమవంతు కృషిగా ఏం చేయదలచుకున్నారు ? అనే ప్రశ్నకు సమాధానంగా “నేనూ టికెట్ రేట్ల గురించి మాట్లాడాను. నా ప్రయత్నం నేను చేశాను. ఇప్పుడు ఏం జరుగుతుంది ? అనేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇప్పుడు హైకోర్ట్ ఇచ్చిన తీర్పుకు ప్రభుత్వం మళ్ళీ అప్పీల్ కు వెళ్తుంది. ముందుముందు ఏం జరుగుతుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాము. ఇప్పుడు సినిమా కాపాడింది… మేము సినిమా ఇండస్ట్రీని కాపాడతాం” అంటూ చెప్పకొచ్చారు బాలయ్య.
తాజావార్తలు
-
Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
-
Bhojshala Case: “భోజ్శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..