జేమ్స్ కెమెరూన్ సినిమాలు హాలీవుడ్ తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా భారీ కలెక్షన్స్ రాబడతాయి. టెర్మినేటర్, టైటానిక్, అవతార్ చిత్రాలతో భారతీయ బాక్సాఫీసును షేక్ చేశాడు. ఆయన నుండి సినిమాలు వస్తున్నాయంటే ఇక్కడ ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా దుకాణం సర్దుకోవాల్సిందే.. ఇది జేమ్స్ కెమెరూన్ క్రేజ్ అంటే. అవతార్ తర్వాత అవతార్ 2 తీసుకోవడానికి 13 ఏళ్లు తీసుకున్నప్పటికీ వర్త్ ఫుల్ మూవీ అందించాడు. అవతార్ ద వే ఆఫ్ వాటర్ భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు అవతార్ ఫ్రాంచైజీ నుండి టూ ఫిల్మ్స్ రాగా, ఇప్పుడు థర్డ్ మూవీ రాబోతుంది.
Also Read : Exclusive : రాజాసాబ్ ఈ ఏడాది లేనట్టే..?
అవతార్ ఫైర్ అండ్ యాష్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. లాస్ట్ టూ మూవీస్ లాగానే ఇది కూడా డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతుంది. రీసెంట్లీ సినీమాకాన్ లో జరిగిన ఈవెంట్లో యాక్ట్రెస్ జో సల్దానా రివీల్ చేశారు. జేమ్స్ కెమెరాన్ రికార్డ్ వీడియో ప్రదర్శింస్తూ ప్రజెంట్ న్యూజిలాండ్లో అవతార్ షూటింగ్ జరుగుతున్నట్లు చెప్పారు డైరెక్టర్. అవతార్ 3లో కొత్త రోల్స్ ఉండబోతున్నాయి. అలాగే మునుపెన్నడి చూడని పండోరాను చూడబోతున్నారు అనిఅన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మరో రెండు సీక్వెల్స్ కూడా తెరకెక్కబోతున్నాయి. 2029లో, 2031లో ఆ టూ ఫిల్మ్స్ రాబోతున్నాయి. పంచ భూతాల కాన్సెప్టుతోనే జేమ్స్ కెమెరాన్ తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటి వరకు నేల, నీరు, ఇప్పుడు నిప్పును తీసుకు వస్తున్నాడు. ఇంత హైప్ క్రియేట్ చేస్తున్న అవతార్ 3 క్రిస్మస్ బరిలో దిగితే డిసెంబర్ 15 తర్వాత రిజర్వ్ చేసుకున్న భారతీయ చిత్రాలు రిలీజ్ డేట్స్ మార్చుకోవాల్సిందే.