Fraud: తాజ్ డెక్కన్ పార్కింగ్లో ‘కోటి’ కొట్టేశారు.!
- క్రిప్టో కరెన్సీ ముసుగులో భారీ మోసం
- తాజ్ డెక్కన్ పార్కింగ్లో కోటి నగదు దోపిడి
- అధిక లాభాల ఆశతో మోసపోయిన బాధితుడు
- సీసీటీవీ ఫుటేజీతో పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fraud: హైదరాబాద్ లో క్రిప్టో కరెన్సీ ముసుగులో మరో భారీ ఆర్థిక నేరం వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్లోని ప్రముఖ హోటల్ ‘తాజ్ డెక్కన్’ పార్కింగ్ లో సినిమా ఫక్కీలో ఒక వ్యక్తి నుండి ఏకంగా కోటి రూపాయల నగదును కాజేసి కేటుగాడు ఉడాయించాడు. అధిక లాభాల ఆశ చూపి నమ్మక ద్రోహానికి పాల్పడిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే..? బాధితుడు అత్తాపూర్కు చెందిన వ్యక్తి. అయితే.. తనకు తెలిసిన ఒక స్నేహితుడి ద్వారా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయన్న సమాచారంతో సదరు బాధితుడు ఈ వ్యవహారంలోకి దిగాడు. ఈ క్రమంలో ఒక మీడియేటర్ ద్వారా నిందితుడిని పరిచయం చేసుకున్నాడు. పెట్టుబడి పెడితే ఊహించని రీతిలో లాభాలు ఇప్పిస్తామని నమ్మించిన నిందితుడు, నగదుతో బంజారాహిల్స్లోని తాజ్ డెక్కన్ హోటల్ వద్దకు రావాలని బాధితుడికి సూచించాడు.
Also Read
- High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
అతని మాటలు నమ్మిన బాధితుడు కోటి రూపాయల నగదును సిద్ధం చేసుకుని హోటల్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ హోటల్ పార్కింగ్ ప్లేస్లో నగదును అందుకున్న సదరు కేటుగాడు, బాధితుడి కళ్లుగప్పి ఆ భారీ మొత్తంతో క్షణాల్లో అక్కడి నుండి పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి పంజాగుట్ట పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హోటల్ ప్రాంగణంలోని, పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం. తెలిసిన వారే కదా అని నమ్మి భారీ మొత్తంలో నగదును అపరిచితుల చేతిలో పెట్టవద్దని, ఇటువంటి క్రిప్టో కరెన్సీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Bhatti Vikramakra : విద్యుత్ ఉద్యోగులకు భట్టి కానుక.. 17.651 శాతం డీఏ ఖరారు..
తాజావార్తలు
-
Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
-
Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!