Fraud: తాజ్ డెక్కన్ పార్కింగ్లో ‘కోటి’ కొట్టేశారు.!
- క్రిప్టో కరెన్సీ ముసుగులో భారీ మోసం
- తాజ్ డెక్కన్ పార్కింగ్లో కోటి నగదు దోపిడి
- అధిక లాభాల ఆశతో మోసపోయిన బాధితుడు
- సీసీటీవీ ఫుటేజీతో పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fraud: హైదరాబాద్ లో క్రిప్టో కరెన్సీ ముసుగులో మరో భారీ ఆర్థిక నేరం వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్లోని ప్రముఖ హోటల్ ‘తాజ్ డెక్కన్’ పార్కింగ్ లో సినిమా ఫక్కీలో ఒక వ్యక్తి నుండి ఏకంగా కోటి రూపాయల నగదును కాజేసి కేటుగాడు ఉడాయించాడు. అధిక లాభాల ఆశ చూపి నమ్మక ద్రోహానికి పాల్పడిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే..? బాధితుడు అత్తాపూర్కు చెందిన వ్యక్తి. అయితే.. తనకు తెలిసిన ఒక స్నేహితుడి ద్వారా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయన్న సమాచారంతో సదరు బాధితుడు ఈ వ్యవహారంలోకి దిగాడు. ఈ క్రమంలో ఒక మీడియేటర్ ద్వారా నిందితుడిని పరిచయం చేసుకున్నాడు. పెట్టుబడి పెడితే ఊహించని రీతిలో లాభాలు ఇప్పిస్తామని నమ్మించిన నిందితుడు, నగదుతో బంజారాహిల్స్లోని తాజ్ డెక్కన్ హోటల్ వద్దకు రావాలని బాధితుడికి సూచించాడు.
Also Read
- TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
- Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
- Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
- YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
అతని మాటలు నమ్మిన బాధితుడు కోటి రూపాయల నగదును సిద్ధం చేసుకుని హోటల్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ హోటల్ పార్కింగ్ ప్లేస్లో నగదును అందుకున్న సదరు కేటుగాడు, బాధితుడి కళ్లుగప్పి ఆ భారీ మొత్తంతో క్షణాల్లో అక్కడి నుండి పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి పంజాగుట్ట పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హోటల్ ప్రాంగణంలోని, పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం. తెలిసిన వారే కదా అని నమ్మి భారీ మొత్తంలో నగదును అపరిచితుల చేతిలో పెట్టవద్దని, ఇటువంటి క్రిప్టో కరెన్సీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Bhatti Vikramakra : విద్యుత్ ఉద్యోగులకు భట్టి కానుక.. 17.651 శాతం డీఏ ఖరారు..
తాజావార్తలు
-
Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
-
CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
-
India vs Sri Lanka Test: 10 వికెట్ల సుతార్, సారాంశ్ జైన్ రాక.. కొలంబో టెస్ట్ తుది 11పై ఉత్కంఠ
-
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!