Ashwini Dutt: అశ్వినీదత్ యూటర్న్.. వాళ్ల నిర్ణయమే నా నిర్ణయమని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashwini Dutt: టాలీవుడ్లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ అంశంపై వివాదం నడుస్తోంది. తాజాగా ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ప్రొడ్యూసర్స్ గిల్డ్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో నిర్మాతల శ్రేయస్సు కోసమే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పాటైంది కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎందుకు వచ్చిందో తెలియట్లేదని అశ్వినీదత్ ఆరోపించారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్లోని కొందరు నిర్మాతలే కారణమని.. వాళ్లకు ఇష్టం వచ్చినప్పుడు టిక్కెట్ రేట్లు పెంచి.. కష్టం వచ్చినప్పుడు తగ్గించాలని కోరడంతోనే అసలు సమస్య వచ్చిందని మండిపడ్డారు. వీళ్ల వైఖరి వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని అశ్వినీదత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కు, ఇప్పుడు పనిచేస్తున్న గిల్డ్కు అసలు పోలిక లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also: Ramarao On Duty: రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్విట్టర్ టాక్ ఏంటి?
Also Read
- Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
- The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
- Dhanush - Anirudh : ధనుష్ - అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
- AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
అయితే అశ్వినీదత్ సడెన్గా యూటర్న్ తీసుకున్నారు. నిర్మాతల నిర్ణయమే తన నిర్ణయం అంటూ మీడియాకు ప్రెస్నోట్ విడుదల చేశారు. యాభై ఏళ్లుగా చిత్రసీమలో నిర్మాతగా కొనసాగుతున్నానని.. తన తోటి నిర్మాతలందరితోనూ చాలా సన్నిహితంగా, సోదర భావంగా మెలిగానని తెలిపారు. ఏ నిర్మాతపైనా తనకు అగౌరవం లేదన్నారు. గిల్డ్ అయినా, కౌన్సిల్ అయినా… నిర్మాతలు, చిత్రసీమ శ్రేయస్సు కోసమే ఉద్భవించాయన్నారు. పరిశ్రమ కోసం అందరూ ఒక్క తాటిపై నడిచి మంచి నిర్ణయాలు తీసుకొంటే బాగుంటుందని తన అభిప్రాయం అన్నారు. నిర్మాతలంతా కలిసి చిత్రసీమ గురించి ఏ మంచి నిర్ణయం తీసుకొన్నా తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ప్రస్తుతం అశ్వనీదత్ నిర్మించిన సీతారామం మూవీ ఆగస్టు 5న థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!