భారీ బడ్జెట్ చిత్రాలకు ఏపీ ప్రభుత్వం షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్లు, ఆటల ప్రదర్శనపై ఓ క్లారిటీకి వచ్చింది. దానికి తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ చట్టం సవరణల బిల్లును రాష్ట్ర మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఇక మీదట రోజుకు నాలుగు ఆటలు మాత్రమే థియేటర్లలో ప్రదర్శించాలని; పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు ఒకే టిక్కెట్ రేట్ ఉంటుందని నాని చెప్పారు. పెద్ద సినిమాల విడుదల సమయంలో అత్యధిక షోస్ ప్రదర్శిస్తున్నారని, అలానే టిక్కెట్ రేట్లను తమ ఇష్టానుసారంగా పెంచేసి అమ్ముతున్నారని, దానికి జీఎస్టీ ని కూడా వారు చెల్లించడం లేదని నాని అసెంబ్లీలో ఆరోపించారు. వీటన్నింటికీ చెక్ పెట్టడం కోసమే ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థను తీసుకురాబోతోందని చెప్పారు. ఈ విధానాన్ని ఏ నిర్మాత విమర్శించడంలేదని, కేవలం కొన్ని రాజకీయ పార్టీలే దీనిపై బురద చల్లుతున్నాయని అన్నారు. బీద వారికి ఏకైక వినోదసాధనంగా ఉన్న సినిమాను సరసమైన ధరకు అందించడమే ప్రభుత్వం కర్తవ్యమని, గతంలో థియేటర్ కౌంటర్ల దగ్గర కొద్ది టిక్కెట్లు అమ్మి, హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టి, ఆ పైన బ్లాక్ లో టిక్కెట్లు అమ్మేవారని, అలాంటి వాటికి ఈ ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంతో చెక్ పెడతామని తెలిపారు.
పెద్ద సినిమాలకు ఇక కష్టమే!
Also Read
- Anushka Sharma: RCB ఫైనల్ చేరడంలో అనుష్క శర్మ పాత్ర కూడా.. ఆ రింగ్ స్పెషాలిటీ ఏంటంటే..?
- Leader Movie OTT : దేశాన్ని కాపాడే స్పై యాక్షన్ ఏజెంట్ గా 'లెజెండ్' శరవణన్... ఈ సారి రచ్చ రచ్చే.!
- Kara Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ హీస్ట్ ఇంటెన్స్ థ్రిల్లర్... ఐయండిబిలో 8.2 రేటింగ్
- Peddi: 'నాకు, చరణ్కు మధ్య కూడా ఒక లవ్ స్టోరీ ఉంది..' పెద్ది మూవీపై దివ్యేందు శర్మ సెన్సేషనల్ కామెంట్స్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలకు షాక్ తగిలినట్టే. ఎందుకంటే కోట్ల పెట్టుబడి పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు తొలి వారం రోజులలోనే తమ పెట్టుబడి తిరిగి రావాలని కోరుకుంటారు. అలా జరగని పక్షంలో సినిమా పైరసీకి గురై, ధియేటర్లకు జనం రాని పరిస్థితి ఏర్పడుతుంది. అలానే మూవీ రిలీజ్ అయిన తర్వాత నెగెటివ్ టాక్ వచ్చినా… జనం థియేటర్లకు రారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే భారీ చిత్రాల నిర్మాతలు అత్యధిక థియేటర్లలో సినిమాను విడుదల చేయడం, తమ బడ్జెట్ కు తగ్గట్టుగా టిక్కెట్ రేట్లను పెంచి అమ్మడం చేస్తుంటారు. అయితే ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు విక్రయిస్తూ కూడా ఆటలపై ఆంక్షలు పెట్టడం, టిక్కెట్ రేట్లను నియంత్రించాలని అనుకోవడం సమజసం కాదని కొందరు అంటున్నారు.
సినిమా టిక్కెటింగ్ వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకున్న తర్వాత కూడా ఇలా ఆటలపై, టిక్కెట్ రేట్లపై ఆకాంక్షలు విధిస్తే పెద్ద సినిమా నిర్మాతలకు తీరని నష్టం వాటిల్లుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ దెబ్బ డిసెంబర్ 2న విడుదల కాబోతున్న నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ మీద మొదట పడబోతోంది. ఇదే పద్థతిని అనుసరిస్తే, సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యే పెద్ద సినిమాలకు భారీ నష్టం వాటిల్లే ఆస్కారం ఉంది. మరి ప్రభుత్వం ఆటలు, టిక్కెట్ రేట్ల విషయంలో పునరాలోచన చేస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Dal Ki Dulhan : రొటీన్ గా రొట్టెలు తిని విసిగిపోయారా ? అయితే నోరూరించే నార్త్ స్పెషల్ ‘దాల్ కీ దుల్హన్’ ట్రై చేయండి.
-
Anushka Sharma: RCB ఫైనల్ చేరడంలో అనుష్క శర్మ పాత్ర కూడా.. ఆ రింగ్ స్పెషాలిటీ ఏంటంటే..?
-
CM Chandrababu : విజయాలకు కారణమైన కార్యకర్తలకు శాశ్వతంగా రుణపడి ఉంటా
-
Heatwave : అలసట, చిరాకు, నిద్రలేమి, ఒత్తిడి, చర్మ సమస్యలు.. ఇది ఎండాకాలం కాదు బాబోయ్.. రోగాల కాలం!
-
CM Chandrababu : ఎన్టీఆర్కు ‘భారతరత్న’ డిమాండ్.. మహానాడులో చారిత్రాత్మక తీర్మానం!
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!