భారీ బడ్జెట్ చిత్రాలకు ఏపీ ప్రభుత్వం షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్లు, ఆటల ప్రదర్శనపై ఓ క్లారిటీకి వచ్చింది. దానికి తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ చట్టం సవరణల బిల్లును రాష్ట్ర మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఇక మీదట రోజుకు నాలుగు ఆటలు మాత్రమే థియేటర్లలో ప్రదర్శించాలని; పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు ఒకే టిక్కెట్ రేట్ ఉంటుందని నాని చెప్పారు. పెద్ద సినిమాల విడుదల సమయంలో అత్యధిక షోస్ ప్రదర్శిస్తున్నారని, అలానే టిక్కెట్ రేట్లను తమ ఇష్టానుసారంగా పెంచేసి అమ్ముతున్నారని, దానికి జీఎస్టీ ని కూడా వారు చెల్లించడం లేదని నాని అసెంబ్లీలో ఆరోపించారు. వీటన్నింటికీ చెక్ పెట్టడం కోసమే ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థను తీసుకురాబోతోందని చెప్పారు. ఈ విధానాన్ని ఏ నిర్మాత విమర్శించడంలేదని, కేవలం కొన్ని రాజకీయ పార్టీలే దీనిపై బురద చల్లుతున్నాయని అన్నారు. బీద వారికి ఏకైక వినోదసాధనంగా ఉన్న సినిమాను సరసమైన ధరకు అందించడమే ప్రభుత్వం కర్తవ్యమని, గతంలో థియేటర్ కౌంటర్ల దగ్గర కొద్ది టిక్కెట్లు అమ్మి, హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టి, ఆ పైన బ్లాక్ లో టిక్కెట్లు అమ్మేవారని, అలాంటి వాటికి ఈ ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంతో చెక్ పెడతామని తెలిపారు.
పెద్ద సినిమాలకు ఇక కష్టమే!
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలకు షాక్ తగిలినట్టే. ఎందుకంటే కోట్ల పెట్టుబడి పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు తొలి వారం రోజులలోనే తమ పెట్టుబడి తిరిగి రావాలని కోరుకుంటారు. అలా జరగని పక్షంలో సినిమా పైరసీకి గురై, ధియేటర్లకు జనం రాని పరిస్థితి ఏర్పడుతుంది. అలానే మూవీ రిలీజ్ అయిన తర్వాత నెగెటివ్ టాక్ వచ్చినా… జనం థియేటర్లకు రారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే భారీ చిత్రాల నిర్మాతలు అత్యధిక థియేటర్లలో సినిమాను విడుదల చేయడం, తమ బడ్జెట్ కు తగ్గట్టుగా టిక్కెట్ రేట్లను పెంచి అమ్మడం చేస్తుంటారు. అయితే ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు విక్రయిస్తూ కూడా ఆటలపై ఆంక్షలు పెట్టడం, టిక్కెట్ రేట్లను నియంత్రించాలని అనుకోవడం సమజసం కాదని కొందరు అంటున్నారు.
సినిమా టిక్కెటింగ్ వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకున్న తర్వాత కూడా ఇలా ఆటలపై, టిక్కెట్ రేట్లపై ఆకాంక్షలు విధిస్తే పెద్ద సినిమా నిర్మాతలకు తీరని నష్టం వాటిల్లుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ దెబ్బ డిసెంబర్ 2న విడుదల కాబోతున్న నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ మీద మొదట పడబోతోంది. ఇదే పద్థతిని అనుసరిస్తే, సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యే పెద్ద సినిమాలకు భారీ నష్టం వాటిల్లే ఆస్కారం ఉంది. మరి ప్రభుత్వం ఆటలు, టిక్కెట్ రేట్ల విషయంలో పునరాలోచన చేస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
-
PM Modi: 2035లో భారత్ కల నెరవేరుతుంది.. 2040లో మాత్రం చంద్రుడిపై జరిగేది ఇదే!
-
Russia Aircraft Deal: భారత్కు రష్యా బిగ్ ఆఫర్.. 105 విమానాలు, దేశంలోనే SJ-100 తయారీ!
-
Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
-
UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?