Allu Aravind: అల్లు అరవింద్ అన్నది మహేష్ బాబు డైరెక్టర్ నేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Aravind: టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటి గీతా ఆర్ట్స్. ప్రస్తుతం వస్తున్న స్టార్ హీరోల సినిమాల్లో చాలావరకు గీతా ఆర్ట్స్ వారివే ఉన్నాయి. ఇక దాని అధినేత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి సినిమా అని తెలియడం ఆలస్యం.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెలుగువారికి అందించడానికి రెడీ అయిపోతారు. గతంలో కాంతార లాంటి రా అండ్ రస్టిక్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించింది అల్లు అరవింద్ యే. ఇక ఇప్పుడు మళయాలంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన 2018 సినిమాను తెలుగు ప్రేక్షకులకు గీతా ఆర్ట్స్ నే అందించింది. ఇక ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకొని భారీ కలక్షన్స్ ను రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే నేడు థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ థాంక్స్ మీట్ కు కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ మీట్ లో అల్లు అరవింద మాట్లాడిన కొన్ని మాటలు.. డైరెక్టర్ పరుశురామ్ పెట్ల ను ఉద్దేశించే అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.
Mohan Babu: మోహన్ బాబు వంద కోట్ల సినిమా.. ప్రొడ్యూసర్ ఎవరంటే..?
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్ఫ్లిక్స్ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్గా టాప్-3!
గీతా గోవిందం లాంటి సినిమాను నిర్మించి.. పరుశురామ్ ను స్టార్ డైరెక్టర్ గా చేసింది గీతా ఆర్ట్స్.. ఒక విధంగా చెప్పాలంటే అల్లు అరవింద్. ఇక ఈ సినిమా తరువాత మరో సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చినా పరుశురామ్.. మధ్యలోనే వారిని వదిలేసి.. మరో సినిమాకు సైన్ చేశాడు. ఆ విషయమై అల్లు అరవింద్ ఎప్పుడు మాట్లాడింది లేదు. ఇక తాజాగా ఈ థాంక్స్ మీట్ లో ఇన్ డైరెక్ట్ గా చురకలు వేశాడు.. ” చందు మొండేటి.. కార్తికేయ 2 వచ్చి ఏడాది దాటిపోయింది. కార్తికేయ కన్నా ముందే ఆయనతో రెండు సినిమాలు కమిట్ అయ్యాం. ఈ కారణంగా ఆ తర్వాత అతడికి ఎన్నో ఆఫర్లు వచ్చినా మా గురించి దేన్ని కూడా ఒప్పుకోలేదు. ఇప్పటికి ఆయన ఆ సినిమాల కోసమే ఎదురుచూస్తున్నాడు. కానీ, నా ద్వారా పైకి వచ్చిన కొందరు దర్శకులు పేర్లు చెప్పను కానీ.. వాళ్లు గీత దాటి వెళ్లి పని చేసుకున్నారు. కానీ ఈయన నిలబడిపోయి ఉన్నాడు” అని చెప్పుకొచ్చాడు.ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు అది పరుశురామ్ నే అన్నాడు అన్న విషయం తెలియకుండా పోదు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే పరుశురామ్.. చివరగా మహేష్ బాబుతో సర్కారువారి పాట సినిమాకు దర్శకత్వం వహించాడు. మరి ఈ డ్యామేజ్ వలన ఈ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది.
సినిమా బాగుంది కాబట్టే అన్ని కోట్లు వచ్చాయి.. Allu Aravind At 2018 Movie Thank You Meet
Watch Video>>>https://t.co/Xgq7RTAbhz#ChandooMondeti #BunnyVasu #AlluAravind #2018TheMovie #TovinoThomas #NTVENT
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) June 1, 2023
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..