భారత చిత్రసీమలో కొంతకాలం నుంచి సౌత్ vs నార్త్ పోరు జరుగుతున్న విషయం తెలిసిందే! ముఖ్యంగా.. జాన్ అబ్రహం బాలీవుడ్ ఎప్పటికీ నం. 1 అని చేసిన వ్యాఖ్యలు, ఈ వార్కి బీజం పోసింది. అప్పట్నుంచి సెలెబ్రిటీలు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అక్షయ్ కుమార్ మాత్రం చిత్ర పరిశ్రమలన్నీ ఒక్కటేనన్న నినాదానికి తెరలేపాడు. ప్రస్తుతం తన పృథ్వీరాజ్ సినిమా ప్రమోషన్స్లో ఉన్న ఈ స్టార్ హీరో.. బాలీవుడ్ & సౌత్ అంటూ లేవని, దయచేసి సౌత్ vs నార్త్ పోరుని సృష్టించొద్దని కోరాడు. మనమంతా భారతీయులమని, ఇండియన్ సినిమా అనే ఇండస్ట్రీ ఒక్కటే ఉందని అక్షయ్ చెప్పుకొచ్చాడు.
ఇక ఇదే సమయంలో పుష్ప సినిమా బాలీవుడ్పై చేసిన దండయాత్ర గురించి మాట్లాడుతూ.. మన ఇండస్ట్రీకి ఆ సినిమా రూపంలో ఓ పెద్ద విజయం దక్కిందన్నాడు. అలాగే.. బన్నీతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయడానికి కూడా తాను సిద్ధంగానే ఉన్నానని తెలిపాడు. మంచి కథతో ఓ దర్శకుడు ముందుకొస్తే.. బన్నీతో కలిసి సినిమా చేస్తానన్నాడు. కేవలం బన్నీతోనే కాదు.. సినీ ప్రియుల్ని అలరించడం కోసం తాను ఏ సౌత్ స్టార్ హీరోతోనైనా సినిమా చేసేందుకు రెడీ అన్నాడు.
ఈమధ్య సౌత్ సినిమాలు జాతీయంగా సత్తా చాటుతున్న తరుణంలో.. బాలీవుడ్ బడా హీరోలందరూ దక్షిణాది సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆల్రెడీ సల్మాన్ ఖాన్.. మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ఫాదర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే! మరి, తానూ నటించేందుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు కాబట్టి, అక్షయ్ కోసం మన ఫిల్మ్ మేకర్స్ ఏదైనా కథ సిద్ధం చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ!