Ajay Devgan: హానికరం అయితే ఎందుకు అమ్ముతున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం బాలీవుడ్ లో పాన్ మసాలా యాడ్ పెద్ద చిచ్చే పెట్టింది. హానికరమైన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారని అక్షయ్ కుమార్ పై నెటిజన్స్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అభిమానుల ఆగ్రహానికి ఒక మెట్టు దిగిన అక్షయ్ వారికి సారీ చెప్పి, ఇకపై అలాంటి యాడ్స్ లో నటించనని మాట ఇచ్చాడు. ఇక తాజాగా ఈ వివాదంపై మరో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ స్పందించాడు. మొదటి నుంచి పాన్ మసాలా యాడ్స్ కి అజయ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్న విషయం తెలిసిందే.
ఇటీవల తన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అజయ్ ఈ వివాదంపై మాట్లాడుతూ ” నిజం చెప్పాలంటే ఈ వివాదంపై నేను మాట్లాడనుకోవడంలేదు.. ఎందుకంటే ప్రకటనలను ఎంపిక చేసుకోవడం స్టార్ల వ్యక్తిగత విషయం. వారు కావాలనుకుంటే చేస్తారు.. వద్దు అంటే మానేస్తారు. అయితే ఆ ప్రకటన చేసేటప్పు అది హానికరమా.. ? లేదా అనేది కూడా చూసుకోవాలి. కొన్ని ప్రొడక్ట్స్ లో హానికరమైన పదార్దాలు ఉండొచ్చు..? లేకపోవచ్చు. కానీ.. దీనికన్నా ఎన్నో హానికరమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిని నా నోటితో చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే వాటిని చెప్పి మళ్లీ వాటి ప్రమోషన్స్ నేను చేయలేను. అస్సలు ప్రకటనలు నా దృష్టిలో పెద్ద విషయమే కాదు.. ఒకవేళ హానికరమైన ప్రొడక్ట్స్ అయితే వినియోగదారులు ఎందుకు విక్రయిస్తున్నారు.. ప్రజలకు ఎందుకు అమ్మాలి. హానికరమైన ఉత్పతులను ఎందుకు అమ్ముతున్నారు..? అది వారిని అడగాల్సిన ప్రశ్న” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అజయ్ దేవగన్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి అజయ్ వ్యాఖ్యలపై నెటిజన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
తాజావార్తలు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?