Aishwarya Rajinikanth: విడాకుల తర్వాత తొలిసారి ధనుష్ పేరు ప్రస్తావిస్తూ ఐశ్వర్య కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aishwarya Rajinikanth Talks About Actor Dhanush for the first Time After Divorce: తమిళ స్టార్ హీరో ధనుష్ – దర్శకుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య 2004లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత, ఐశ్వర్య – ధనుష్ ఇద్దరూ తాను విడిపోవడం గురించి పెదవి విప్పలేదు. అయితే ఐశ్వర్య రజనీకాంత్ తొలిసారిగా తన మాజీ భర్త గురించి మాట్లాడింది. అసలు విషయం ఏమిటంటే ఆమె డైరెక్ట్ చేసిన లాల్ సలామ్ సినిమా పెద్ద హిట్ అవుతుందని అభిమానుల్లో అంచనాలు నెలకొని ఉండగా, ఆ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇదిలా ఉంటే ఐశ్వర్య సినిమాకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఆ ఇంటర్వ్యూలో, ఇంటర్వ్యూయర్ ఆమెతో, “మీరు పరిచయం చేసిన అనిరుధ్ ఇప్పుడు భారతదేశంలో పెద్ద స్థానంలో ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు” అని అదిగితే అందుకు కారణం నేను కాదు ధనుష్ అని ఐశ్వర్య సమాధానమిచ్చింది. ఇంకా మాట్లాడుతూ.. అనిరుధ్ను విదేశాలకు పంపించి చదివించాలని అతని తల్లిదండ్రులు భావించారు, అయితే ధనుష్ వారి మనసు మార్చి అనిరుధ్కి కీబోర్డు కొనిచ్చాడని అన్నారు.
Ajith Kumar: ఆసుపత్రి పాలైన హీరో అజిత్ లేటెస్ట్ ఫోటో చూశారా?
Also Read
- Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్... స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Tollywood : తెలుగులో అప్పట్లో హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా వరుస ఛాన్సులు
- NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
- Jagapathi Babu : 'పెద్ది'ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
ఇక అనిరుధ్ 3 సినిమాకి కంపోజ్ చేయాలి అని ధనుషే భావించాడని, అనిరుధ్ ఎదుగుదల చూస్తుంటే ఆనందంగా ఉందని అన్నారు. నిజానికి ధనుష్-ఐశ్వర్య విడిపోయినట్లు ప్రకటించినప్పటి నుండి, ఇద్దరూ తమ గురించి బయట ఎక్కడా మాట్లాడలేద్దు. ధనుష్ ఇప్పుడు కూడా తన మాజీ భార్య గురించి ఏ ఇంటర్వ్యూలో మాట్లాడడు. అయితే అందుకు భిన్నంగా కెమెరా ముందు ధనుష్ పేరు ఐశ్వర్య మాట్లాడడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. నటుడు ధనుష్ నటించిన తొలి చిత్రం ‘కాదల్ కొండేన్’. ఈ సినిమా 2003లో విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా పరిచయమైన ఐశ్వర్య, ధనుష్లు స్నేహితులయ్యారని, ఆ తర్వాత వారి మధ్య ప్రేమ చిగురించిందని చెబుతున్నారు. వారు 1 సంవత్సరం పాటు ప్రేమలో ఉండి ఇరు కుటుంబాల అంగీకారంతో 18 నవంబర్ 2004న వివాహం చేసుకున్నారు. ధనుష్-ఐశ్వర్యలకు యాత్ర – లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరినీ ధనుష్ – ఐశ్వర్య కో-పేరెంటింగ్ మోడ్లో పెంచుతున్నారు.
తాజావార్తలు
-
YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..