‘దురంధర్’ సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఆదిత్య ధర్, ఈ సినిమాలు పూర్తయిన తర్వాత ‘దురంధర్’ పార్ట్-3 చేస్తాడేమో అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు, ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆదిత్య ధర్ ‘అశ్వత్థామ’ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాని విక్కీ కౌశల్ హీరోగా ఆదిత్య ధర్ గతంలోనే పట్టాలెక్కించాడు. కానీ భారీ ఎత్తున విఎఫ్ఎక్స్ (VFX) రిక్వైర్మెంట్స్ ఉండటం, లాజిస్టికల్ ఇష్యూస్ ఉండటంతో ఈ సినిమాని అప్పట్లో నిలిపివేశారు.
Also Read:Dhurandhar 2 Telugu: ఎంత ఆలస్యమైతే అంత లాభం?
కానీ ఇప్పుడు ‘దురంధర్’, ‘దురంధర్ పార్ట్-2’ రిజల్ట్స్ తర్వాత, ఆ సినిమాకి నిర్మాతలు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఇండియన్ మైథాలజీలో ‘అశ్వత్థామ’ క్యారెక్టర్ ను ఆధారంగా చేసుకుని రాసుకున్న సినిమా అని అంటున్నారు. అయితే ప్రారంభించిన సమయంలో అప్పటి మార్కెట్ మెకానిక్స్ ప్రకారం ఈ సినిమా వర్కౌట్ అవ్వదని అప్పటి నిర్మాతలు వెనకడుగు వేశారు. 2021లో ఈ సినిమాని ప్లాన్ చేశారు, కానీ అప్పట్లో కరోనా పరిస్థితుల కారణంగా నిలిపివేయడం జరిగింది. నిజానికి ‘ఉరి’ లాంటి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆదిత్య ధర్, తన రెండవ సినిమాగానే ఈ ‘అశ్వత్థామ’ ప్రాజెక్టు పట్టాలెక్కించే ప్రయత్నం చేశాడు. అయితే అంతా ఒప్పుకుని ముందుకు వచ్చిన నిర్మాతలు కరోనా పరిస్థితుల కారణంగా వెనకడుగు వేశారు. ఇప్పటి పరిస్థితుల్లో ఈ సినిమా నిర్మించేందుకు పలు బడా సంస్థలు సైతం ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘దురంధర్-3’ కన్నా ముందు ఈ ‘అశ్వత్థామ’ ప్రాజెక్టు పట్టాలెక్కించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.