Varalakshmi: ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజులకే వరలక్ష్మీకి షాక్… ఆ కేసులో అరెస్ట్ తప్పదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Sarathkumar Merges Party in BJP Amid Notices to Varalakshmi: నటుడు శరత్కుమార్ అకస్మాత్తుగా తన పాలిటికల్ పార్టీని బిజెపిలో ఎందుకు విలీనం చేశారు? అని రాజకీయ వర్గాలు చురుగ్గా విశ్లేషిస్తున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోనని, మతతత్వ రాజకీయాలకు ఎప్పటికీ మద్దతివ్వబోనని చెబుతూ వచ్చిన శరత్కుమార్ గత కొన్ని నెలలుగా బీజేపీతో పొత్తుపై చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఇటీవల ఆయనతో సమావేశమై.. పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీతో పొత్తు ఖాయమైందని ప్రకటించారు. మరోపక్క ఆ వార్తలు మరువక ముందే మరికొద్ది రోజుల్లో తన సమత్వ పీపుల్స్ పార్టీని బీజేపీలో విలీనం చేసినట్లు ప్రకటించారు. దీనిపై శరత్కుమార్ వివరణ ఇస్తూ.. పార్టీ కార్యవర్గంతో చర్చించి దేశాభివృద్ధికి, భావి యువతకు మేలు జరిగేలా ఈ నిర్ణయం తీసుకున్నామని అంటూనే ప్రధాని మోదీ పాలనపై కూడా ప్రశంసలు కురిపించారు. అయితే దీని వెనుక వేరే కారణం ఉందనే వాదన వినిపిస్తోంది. శరత్కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్కుమార్కు ఎన్ఐఏ నోటీసులు పంపింది. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో వరలక్ష్మి శరత్కుమార్ మాజీ అసిస్టెంట్ ఆదిలింగం అరెస్టయ్యాడు. అతనికి డ్రగ్స్, ఆయుధాల సరఫరాలో అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికర్లతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది.
Ananya Nagalla : రక్తం అమ్ముకుంటున్న అనన్య నాగళ్ల.. వైరల్ అవుతున్న వీడియో..
Also Read
- Shruti Haasan: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ ..
- Akkineni Nagarjuna: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ 'మనం' మ్యాజిక్ రిపీట్? నాగార్జున మాస్టర్..
- Tom Cruise: గుర్తుపట్టలేనంతగా మారిన టామ్ క్రూజ్.. 'డిగ్గర్' ట్రైలర్లో షాకిచ్చిన లుక్!
- JR NTR Office : 'RAW NTR' సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆఫీస్
ఆదిలింగం నుంచి రూ.300 కేజీల హెరాయిన్, ఏకే 47 రైఫిల్, 9 ఎంఎం తుపాకులు, రూ.2,100 కోట్ల విలువైన మందు గుండు సామగ్రిని ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించగా.. డ్రగ్స్ సరఫరా ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆదిలింగం సినీ పరిశ్రమలో పెట్టుబడిగా పెడుతున్నారని గుర్తించారు. అందుకే ఆదిలింగం గతంలో పీఏగా పనిచేసిన నటి వరలక్ష్మి శరత్కుమార్ను కూడా విచారించాలని ఎన్ఐఏ నిర్ణయించింది. ఈ విచారణకు వరలక్ష్మి శరత్కుమార్కు కూడా సమన్లు అందాయని, ఎన్ఐఏ విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని ఆమె కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నటుడు శరత్కుమార్ తన పార్టీని బీజేపీలో విలీనం చేశారని అంటున్నారు. ఈ విషయంలో వరలక్ష్మి శరత్కుమార్కు చిక్కులు వచ్చే అవకాశం ఉందని భావించి శరత్కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి శరత్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైన వరలక్ష్మి.. తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. తెలుగులో తెనాలి రామకృష్ణ బీఏ బి ఎల్, క్రాక్, నాంది, వీర సింహారెడ్డి, హనుమాన్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించగా తమిళ్ ఇండస్ట్రీలో కూడా నటిగా సత్తా చాటుతోంది. ఆమె ఈ మధ్యనే రీసెంట్గా ఆమె ఎంగేజ్మెంట్ జరగగా త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్న క్రమంలో వరలక్ష్మికి ఇలా నోటీసులు అందడం హాట్ టాపిక్ అవుతోంది. కేసులో ఆమె పాత్ర ఉందని తెలిస్తే ఆమె అరెస్ట్ కి కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ విలీనం జరిగిందని అంటున్నారు.
తాజావార్తలు
-
Hafiz Saeed: పహల్గామ్ ఉగ్రదాడి.. హఫీజ్ సయీద్పై నాన్-బెయిలబుల్ వారెంట్..
-
Shruti Haasan: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ ..
-
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
-
Weather News: ఎండా, ఉక్కపోత, చికాకు.. తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదా?
-
Akkineni Nagarjuna: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ ‘మనం’ మ్యాజిక్ రిపీట్? నాగార్జున మాస్టర్..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!