Chiranjeevi: ఒకే రోజున చిరంజీవి రెండు చిత్రాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: ఓ హీరో నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల కావడం ఖచ్చితంగా విశేషమే! అలా రెండు పర్యాయాలు ఓ హీరోకు ఒకే యేడాది జరగడం నిజంగా మరింత విశేషం కదా! చిరంజీవి వర్ధమాన కథానాయకునిగా సాగుతున్న రోజులవి. 1982లో రెండు సార్లు ఆయన నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. 1982 జూలై 30న చిరంజీవి హీరోగా రూపొందిన ‘సీతాదేవి’, ఆయన స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన ‘రాధా మై డార్లింగ్’ చిత్రాలు విడుదలయ్యాయి. ఆ తరువాత అక్టోబర్ 1న ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘టింగురంగడు’ జనం ముందు నిలిచాయి.
‘పట్నం వచ్చిన పతివ్రతలు’ చిత్రానికి కన్నడలో రూపొందిన ‘పట్టణక్కె బంద పత్నియరు’ ఆధారం. తెలుగులో ఈ సినిమాకు మౌళి దర్శకత్వం వహించారు. ఇందులో చిరంజీవి, మోహన్ బాబు నాయకులు కాగా, వారి సరసన రాధిక, గీత నటించారు. ఇందులో హీరోలిద్దరూ అన్నదమ్ములు. తమ బామ్మతో కలసి జీవిస్తుంటారు. వారిద్దరికీ పెళ్ళయ్యాక వారి భార్యలకు పట్నంలో నివసించాలన్న కోరిక కలుగుతుంది. భర్తలకు తెలియకుండా పట్నవాసం చేయాలని ఇద్దరమ్మాయిలు వెళతారు. అక్కడ పలు పాట్లు పడతారు. వారిని వెదకుతూ పోయిన భర్తలకు వారిని గంగాదేవి అనే ఆమె నిర్బంధించిందని తెలుసుకుంటారు. ఆమె బారి నుండి తమ భార్యలను రక్షించుకోవడమే కాకుండా, గంగాదేవిని పోలీసులు అరెస్ట్ చేసేలా చేస్తారు అన్నదమ్ములు. అదీ ఈ సినిమా కథ!
Also Read
- Akkineni Nagarjuna : అఖిల్కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
- Double Occupancy OTT: పగలు అమ్మాయి.. రాత్రి అబ్బాయి.. ఓటీటీలోకి షాకింగ్ కాన్సెప్ట్ మూవీ
- Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. 'జైలర్' విలన్ వినాయకన్పై మరో కేసు
- Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా 'శ్రీశ్రీ'.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
ఇక చిరంజీవి సోలో హీరోగా రూపొందిన ‘టింగు రంగడు’లో ఆయన జోడీగా గీత నటించారు. అంటే ‘పట్నం వచ్చిన పతివ్రతలు’లో చిరుకు వదినగా నటించిన గీతతోనే ఇందులో ఆయన రొమాన్స్ చేయవలసి వచ్చిందన్న మాట! ఇందులో రంగడు తన మామ్మతో కలసి జీవిస్తుంటాడు. రంగడు ఇంట్లోంచి పారిపోయి, పట్నంలో రామచంద్రరావు, జానకి దంపతుల దగ్గరకు వెళతాడు. తాను రామచంద్రరావు అక్రమ సంతానాన్ని అని చెబుతాడు. రామచంద్రరావు అంగీకరించడు. కానీ, జానకి రంగడిని ఇంట్లో ఉండనిస్తుంది. అయితే జానకి సోదరుడి వరస అయిన భూషణం పిల్లలు లేని రామచంద్రరావు దంపతులు తన కొడుకును దత్తత తీసుకోవాలని ఆశిస్తూ ఉంటాడు. దాంతో భూషణం, రంగడిని ఎలాగైనా ఇంటి నుండి గెంటేయించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రతీసారి అతని ఎత్తుకు పైఎత్తు వేస్తూ సాగుతుంటాడు రంగడు. రామచంద్రరావు అన్న కొడుకే రంగడు అన్న నిజాన్ని రంగడి మామ్మ వచ్చి చెబుతుంది. ఎలాగైనా ఆస్తి కోసం అందరినీ నాశనం చేయాలని చూసిన భూషణానికి తగిన శాస్తి చేస్తాడు రంగడు. దాంతో కథ సుఖాంతమవుతుంది. ‘టింగురంగడు’కు టి.ఎల్.వి.ప్రసాద్ దర్శకుడు.
ఈ రెండు చిత్రాలలో ‘టింగురంగడు’ మాస్ జనాన్ని ఆకట్టుకోగా, ‘పట్నం వచ్చిన పతివ్రతలు’లోని వినోదం అందరినీ అలరించింది. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’కు సత్యం సంగీతం సమకూర్చగా, ‘టింగురంగడు’ చక్రవర్తి బాణీలతో రూపొందింది.
తాజావార్తలు
-
Bhagyasri Borse : ఏడ్చేసిన ‘లెనిన్’ హీరోయిన్.. అండగా నిలబడ్డారంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
-
Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
-
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!