Chiranjeevi: ఒకే రోజున చిరంజీవి రెండు చిత్రాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: ఓ హీరో నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల కావడం ఖచ్చితంగా విశేషమే! అలా రెండు పర్యాయాలు ఓ హీరోకు ఒకే యేడాది జరగడం నిజంగా మరింత విశేషం కదా! చిరంజీవి వర్ధమాన కథానాయకునిగా సాగుతున్న రోజులవి. 1982లో రెండు సార్లు ఆయన నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. 1982 జూలై 30న చిరంజీవి హీరోగా రూపొందిన ‘సీతాదేవి’, ఆయన స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన ‘రాధా మై డార్లింగ్’ చిత్రాలు విడుదలయ్యాయి. ఆ తరువాత అక్టోబర్ 1న ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘టింగురంగడు’ జనం ముందు నిలిచాయి.
‘పట్నం వచ్చిన పతివ్రతలు’ చిత్రానికి కన్నడలో రూపొందిన ‘పట్టణక్కె బంద పత్నియరు’ ఆధారం. తెలుగులో ఈ సినిమాకు మౌళి దర్శకత్వం వహించారు. ఇందులో చిరంజీవి, మోహన్ బాబు నాయకులు కాగా, వారి సరసన రాధిక, గీత నటించారు. ఇందులో హీరోలిద్దరూ అన్నదమ్ములు. తమ బామ్మతో కలసి జీవిస్తుంటారు. వారిద్దరికీ పెళ్ళయ్యాక వారి భార్యలకు పట్నంలో నివసించాలన్న కోరిక కలుగుతుంది. భర్తలకు తెలియకుండా పట్నవాసం చేయాలని ఇద్దరమ్మాయిలు వెళతారు. అక్కడ పలు పాట్లు పడతారు. వారిని వెదకుతూ పోయిన భర్తలకు వారిని గంగాదేవి అనే ఆమె నిర్బంధించిందని తెలుసుకుంటారు. ఆమె బారి నుండి తమ భార్యలను రక్షించుకోవడమే కాకుండా, గంగాదేవిని పోలీసులు అరెస్ట్ చేసేలా చేస్తారు అన్నదమ్ములు. అదీ ఈ సినిమా కథ!
Also Read
ఇక చిరంజీవి సోలో హీరోగా రూపొందిన ‘టింగు రంగడు’లో ఆయన జోడీగా గీత నటించారు. అంటే ‘పట్నం వచ్చిన పతివ్రతలు’లో చిరుకు వదినగా నటించిన గీతతోనే ఇందులో ఆయన రొమాన్స్ చేయవలసి వచ్చిందన్న మాట! ఇందులో రంగడు తన మామ్మతో కలసి జీవిస్తుంటాడు. రంగడు ఇంట్లోంచి పారిపోయి, పట్నంలో రామచంద్రరావు, జానకి దంపతుల దగ్గరకు వెళతాడు. తాను రామచంద్రరావు అక్రమ సంతానాన్ని అని చెబుతాడు. రామచంద్రరావు అంగీకరించడు. కానీ, జానకి రంగడిని ఇంట్లో ఉండనిస్తుంది. అయితే జానకి సోదరుడి వరస అయిన భూషణం పిల్లలు లేని రామచంద్రరావు దంపతులు తన కొడుకును దత్తత తీసుకోవాలని ఆశిస్తూ ఉంటాడు. దాంతో భూషణం, రంగడిని ఎలాగైనా ఇంటి నుండి గెంటేయించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రతీసారి అతని ఎత్తుకు పైఎత్తు వేస్తూ సాగుతుంటాడు రంగడు. రామచంద్రరావు అన్న కొడుకే రంగడు అన్న నిజాన్ని రంగడి మామ్మ వచ్చి చెబుతుంది. ఎలాగైనా ఆస్తి కోసం అందరినీ నాశనం చేయాలని చూసిన భూషణానికి తగిన శాస్తి చేస్తాడు రంగడు. దాంతో కథ సుఖాంతమవుతుంది. ‘టింగురంగడు’కు టి.ఎల్.వి.ప్రసాద్ దర్శకుడు.
ఈ రెండు చిత్రాలలో ‘టింగురంగడు’ మాస్ జనాన్ని ఆకట్టుకోగా, ‘పట్నం వచ్చిన పతివ్రతలు’లోని వినోదం అందరినీ అలరించింది. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’కు సత్యం సంగీతం సమకూర్చగా, ‘టింగురంగడు’ చక్రవర్తి బాణీలతో రూపొందింది.
తాజావార్తలు
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
-
Vijay Jana Nayagan : విజయ్ CM అయినా కూడా రిలీజ్ పై క్లారిటీ రాని జననాయగన్
-
Jayam Ravi: జయం రవి వ్యక్తిగత వివాదం ఎఫెక్ట్..నిర్మాతల్లో పెరిగిన ఆందోళన
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..