25 Years Of Paradesh: పాతికేళ్ల షారుఖ్ ఖాన్ ‘పర్ దేశ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాతికేళ్ళ క్రితం షారుఖ్ ఖాన్ హవా విశేషంగా వీస్తోంది. షారుఖ్ నటించిన సినిమా వస్తే చాలు, కలెక్షన్ల వర్షం కురుస్తుందని అందరూ భావించేవారు. దక్షిణాదిన సైతం షారుఖ్ చిత్రాలు వసూళ్ళు విశేషంగా సాధించేవి. పాతికేళ్ళ క్రితం షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన ‘పర్ దేశ్’ సినిమా సైతం విజయపథంలో సాగింది. సుభాష్ ఘయ్ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘పర్ దేశ్’ సినిమా 1997 ఆగస్టు 8న విడుదల విజయభేరీ మోగించింది.
‘పర్ దేశ్’ కథ ఏమిటంటే – కిశోరీలాల్ తన కొడుకు రాజీవ్ కు తన మిత్రుని కూతురు గంగను ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. అందుకు కిశోరీలాల్ పెంచి పెద్ద చేసిన అర్జున్ ఏర్పాట్లు చేస్తుంటాడు. అయితే అతను చేసే పనులు పెళ్ళికూతురు గంగకు, ఆమె ఇంట్లోవాళ్లకు నచ్చవు. గొడవ మొదలవుతుంది.
Also Read
- Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
- Dharman: ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టిన రజనీకాంత్.. 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!
- Wamika Gabbi : 'DC'తో తమిళ్లో మొదటి సూపర్ హిట్ అందుకున్న వామికా
- Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
తరువాత అర్జున్, గంగ మధ్య స్నేహం పెరుగుతుంది. రాజీవ్ వచ్చాక అతని పాశ్చాత్య పోకడలు చూసి గంగ ఆశ్చర్యపోతుంది. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన గంగకు రాజీవ్ చేష్టలు ఏ మాత్రం నచ్చవు. రాజీవ్ తనతో గంగను లాస్ వెగాస్ తీసుకు పోతాడు. అక్కడే పెళ్ళికి ముందే ఒక్కటవుదామని గంగను బలవంత పెడతాడు రాజీవ్. చీదరించుకొని వెళ్ళిపోతుంది గంగ. రాజీవ్ ఆమెను వద్దనుకుంటాడు. ఆమె పరిస్థితి చూసి అర్థం చేసుకున్న అర్జున్ సహాయపడతాడు. దాంతో గంగ, అర్జున్ తో లేచిపోయిందనీ రాజీవ్ గంగ కుటుంబసభ్యులకు చెబుతాడు.
తన తండ్రి పెంచి పెద్ద చేసిన అర్జున్, గంగకు సహకరించడం రాజీవ్ కు ఏ మాత్రం నచ్చదు. గంగను అర్జున్ వారి కుటుంబసభ్యుల దగ్గరకు చేరుస్తాడు. అర్జున్ ను చంపడానికి గూండాలనూ నియమిస్తాడు రాజీవ్. అర్జున్, రాజీవ్ కొట్టుకుంటారు. కిషన్ లాల్ కు అసలు విషయం తెలుస్తుంది. తాను గంగను ప్రేమించినా, ఏ రోజూ ఆ మాట చెప్పలేదన్న నిజాన్ని అర్జున్ చెబుతాడు. కిశోరీలాల్ కూడా గంగ తన కోడలు కావాలనుకున్నానని, అయితే రాజీవ్ భార్యగా కాదు, అర్జున్ కు ఆమెను ఇచ్చి పెళ్ళి చేయాలని అంటాడు. అర్జున్, గంగ ఒకటి కావడంతో కథ సుఖాంతమవుతుంది.
నటి మహిమాచౌధురి తొలిసారి తెరపై కనిపించిన చిత్రం ‘పర్ దేశ్’. ఇందులో అమ్రిష్ పురి, అపూర్వ అగ్నిహోత్రి, అలోక్ నాథ్, పద్మావతీ రావ్, దినా పాథక్, హిమానీ శివ్ పురి, మాధురీ భాటియా, స్మితా జయకర్, పవన్ మల్హోత్రా, ప్రాచీ సావే,ఆదిత్య నారాయణ్, సమతా సాగర్ నటించారు. ఓ పాటలో పాడుతూ సుభాష్ ఘయ్ కూడా కనిపిస్తారు. నదీమ్ -శ్రవణ్ స్వరకల్పనకు ఆనంద్ బక్షీ పాటలు రాశారు. ఇందులోని “నహీ హోనా థా…”, “మేరీ మెహబూబా…”, “యే దిల్ దీవానా…”,”ఐ లవ్ మై ఇండియా…”, “దో దిల్ మిల్ రహే హై…”, “జహా పియా వహా మై…” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. 1997 బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా ‘పర్ దేశ్’ నిలచింది. ఈ సినిమా తరువాత మహిమా ఛౌదురి తెలుగులో ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ‘మనసులో మాట’లో నాయికగా నటించింది.
(ఆగస్టు 8న ‘పర్ దేశ్’కు 25 ఏళ్ళు)
తాజావార్తలు
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. ‘అడ్వాన్స్ టిప్’ విధానానికి కేంద్రం చెక్
-
CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
-
Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
-
Dharman: ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టిన రజనీకాంత్.. 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!
ట్రెండింగ్
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!