Healthy Recipes: రాగితో రుచికరమైన వంటలు..
రాగుల్లో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయో అందరికి తెలుసు.. రోజూ ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.. ఈరోజు మీకోసం రాగితో చేసే రుచికరమైన వంటల గురించి చెప్పబోతున్నాం.. ఏం వాడాలి.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రాగి అట్లు..
Also Read
- Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
- Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
- Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్లా కూల్గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
ఈ పేరు కొత్తగా ఉంది కదూ.. కొత్తగానే కాదు.. రుచిగా కూడా ఉంటుంది.. ఎలా తయారు చెయ్యాలంటే..
కావలసిన పదార్థాలు :
రాగిపిండి : 500 గ్రాములు
బెల్లం : 25 గ్రాములు
నీళ్ళు : తగినంత
నూనె : తగినంత
ఉప్పు : తగినంత
తయారీ విధానం :
ముందుగా బెల్లం ను నీటిలో కరిగించాలి..ఈ నీటిలో రాగి పిండి కలిపి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమం పలుచగా ఉండేటట్లు సరిచూసుకోవాలి. పొయ్యిమీద పెట్టిన పెనంపై గరిటతో కలిపి ఉంచిన పిండిని దోసలా వేయ్యాలి. అట్టును రెండువైపులా కాల్చాలి..అంతే రాగి అట్టు రెడీ.. ఎంతో సింపుల్ గా అయ్యింది కదా.. మీరు కూడా ట్రై చెయ్యండి.. తియ్యగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు..
రాగి పూరి..
రాగి పూరి మామూలు పూరిలాగే ఉంటుంది.. అంతేకాదు ఆరోగ్యానికి మంచిది కూడా.. ఎలా తయారు చెయ్యాలంటే..
కావలసిన పదార్థాలు :
రాగి పిండి : 100 గ్రాములు
మైదా : 25 గ్రాములు
నూనె : 120 గ్రాములు
ఉప్పు : తగినంత
నీళ్లు : తగినంత
తయారీ విధానం :
ఒక గిన్నె తీసుకోని మైదా, రాగి పిండిలో ఉప్పు, తగినన్ని నీళ్ళుపోసి పూరి పిండిలాగా కలుపుకుని, 20 నిమిషాలు ప్రక్కన ఉంచాలి. ఉండల్లా చుట్టుకొని పూరీల్లా చేసుకోవాలి. ఈ పూరీలను బాగా మరిగిన నూనెలో వేయించుకోవాలి.. కాంబినేషన్ గా పుదీనా చట్నీని తీసుకోవడం వల్ల టెస్ట్ మరింత పెరుగుతుంది..
రాగి ఇడ్లీ..
రాగిపిండి తో ఇడ్లీ కూడా చాలా మంచిదే.. ఆవిరి మీద ఉడుకుతుంది కదా పోషకాలు పుష్కలంగా ఉంటాయి..ఎలా తయారు చెయ్యాలంటే..
కావలసిన పదార్థాలు :
రాగి పిండి : 60 గ్రాములు
మినపపిండి : 20 గ్రాములు
ఉప్పు : తగినంత
నీళ్లు : తగినంత
తయారీ విధానం :
మినప పప్పుని నానబెట్టుకొని రుబ్బుకోవాలి. దీనికి రాగి పిండిని కలిపి సమపాళ్ళలో నీటిని కలిపి ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. దీనిని ఒక రాత్రి వరకు నాననివ్వాలి. తరువాత రోజు ఇడ్లీ పాత్రలో ఇడ్లీలవలె పోసి 15 నిమిషాలు పాటు ఉడక నివ్వాలి. వేరుశనగ, అల్లం చెట్నీలతో తింటే బాగుటుంది.. మీ ఇష్టం మీ చట్నీ ఏదైనా బాగానే ఉంటుంది.. ట్రై చెయ్యండి..
ఇవే కాదు రాగి సంగటి, రాగి జావా, రాగి చపాతీ లను కూడా తయారు చేసుకోవచ్చు,..
తాజావార్తలు
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!