Home Remedies For Fever : శీతాకాలంలో జ్వరంతో ఇబ్బంది పడుతున్నారా? ఇదిగో హోమ్ రెమెడీ
- చలికాలంలో తగ్గుతున్న రోగనిరోధక శక్తి
- మారుతున్న వాతావరణంతో జలుబు, జ్వరం
- వాటిని తగ్గించేందుకు హోమ్ రెమెడీ
చలికాలంలో రోగనిరోధక పెరుగుతోంది. మారుతున్న వాతావరణంతో జలుబు, జ్వరం రావడం సాధారణ విషయం. చలికాలంలో చాలా మంది జలుబు, జ్వరంతో బాధపడుతుంటారు. జ్వరానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాతావరణంలో మార్పు, విపరీతమైన చలి కారణంగా ఫీవర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. జ్వరం ఎక్కువ కాలం కొనసాగితే వైద్యులను సంప్రదించి అనేక రకాల మందులు వాడుతున్నారు. అయితే కొన్ని హోం రెమెడీస్ సహాయంతో మీరు జ్వరం నుంచి ఉపశమనం పొందవచ్చట. అవేంటో ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు..
50 గ్రాముల శొంఠి చూర్ణం
50 గ్రాముల మిరియాల చూర్ణం
50 గ్రాముల ధనియాల చూర్ణం
50 గ్రాముల పసుపు
50 గ్రాముల తులసి చూర్ణం
Also Read
- Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
- AC Health Risks: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా..? ఈ వ్యాధులకు కారణం కావచ్చు..! ఏం చేయాలి..
- Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
- Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
తయారీ విధానం
ముందుగా స్టౌ వెలిగించుకుని ఓ గిన్నెలో 100 మిల్లీ లీటర్లు నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇవి వేడయ్యే లోపు మరో గిన్నెలో శొంఠి చూర్ణం, మిరియాలు, ధనియాలు, పసుపు, తులసి చూర్ణం వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం కలిపిన చూర్ణాన్ని ఒక చెంచాడు తీసుకుని ఈ నీటిలో వేసుకుని మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి వడబెట్టుకుంటే ఆయుర్వేద ఔషధం రెడీ అయినట్లే..
ఎంత మోతాదులో తీసుకోవాలి?
చలికాలంలో జ్వరం వచ్చినప్పుడు తగ్గడానికి సుమారుగా 40-50 మిల్లీ లీటర్ల పరిమాణంలో మూడు పూటాల తీసుకోవాలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇంకా జ్వరం రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా వాడుకోవచ్చని అంటున్నారు. ఇలాంటి వారు ఉదయం, సాయంత్రం 30 మిల్లీ లీటర్ల పరిమాణంలో తీసుకోవాలని వివరించారు.
ఈ కషాయం చేసుకుని తాగితే కలిగే ప్రమోజనాలు..
చలికాలంలో వచ్చే కఫాన్ని తగ్గించడంలో శొంఠి ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంకా జీర్ణశక్తిని మెరుగుపరిచి అజీర్తి సమస్యను తగ్గిస్తుందట. ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు తగ్గడానికి, శరీరంలోని మలినాలు బయటకు వెళ్లడానికి మిరియాలు ఉపయోగపడుతుందన్నారు. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లు, వైరస్లను తగ్గించడానికి పసుపు బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఆయుర్వేద ఔషధాల తయారీలో తులసి మొక్కను అనేక రకాలుగా వాడుతుంటారు. వైరల్ ఇన్ఫెక్షన్, జ్వరాలు తగ్గడానికి తులసి చాలా సహాయపడుతుందని అంటున్నారు. జరాన్ని తగ్గించడంలో ధనియాలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. జ్వరం వచ్చినప్పుడు ధనియాల కషాయం చేసుకుని తాగితే సరిపోతుందని అంటున్నారు.
తాజావార్తలు
-
Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!
-
Kyle Jamieson IPL Penalty: బిగ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..
-
Axar Patel: ఎందుకు అతడిని లెజెండ్ అంటారో ఇప్పుడు అర్థమైంది.. ఆ ఆనందమే వేరప్ప!
-
Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
-
New LPG Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!