Home Remedies For Fever : శీతాకాలంలో జ్వరంతో ఇబ్బంది పడుతున్నారా? ఇదిగో హోమ్ రెమెడీ
- చలికాలంలో తగ్గుతున్న రోగనిరోధక శక్తి
- మారుతున్న వాతావరణంతో జలుబు, జ్వరం
- వాటిని తగ్గించేందుకు హోమ్ రెమెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలికాలంలో రోగనిరోధక పెరుగుతోంది. మారుతున్న వాతావరణంతో జలుబు, జ్వరం రావడం సాధారణ విషయం. చలికాలంలో చాలా మంది జలుబు, జ్వరంతో బాధపడుతుంటారు. జ్వరానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాతావరణంలో మార్పు, విపరీతమైన చలి కారణంగా ఫీవర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. జ్వరం ఎక్కువ కాలం కొనసాగితే వైద్యులను సంప్రదించి అనేక రకాల మందులు వాడుతున్నారు. అయితే కొన్ని హోం రెమెడీస్ సహాయంతో మీరు జ్వరం నుంచి ఉపశమనం పొందవచ్చట. అవేంటో ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు..
50 గ్రాముల శొంఠి చూర్ణం
50 గ్రాముల మిరియాల చూర్ణం
50 గ్రాముల ధనియాల చూర్ణం
50 గ్రాముల పసుపు
50 గ్రాముల తులసి చూర్ణం
Also Read
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
- Health Benefits of Silver : వెండి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది? కంగనా అలవాటు వైరల్.!
- Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
తయారీ విధానం
ముందుగా స్టౌ వెలిగించుకుని ఓ గిన్నెలో 100 మిల్లీ లీటర్లు నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇవి వేడయ్యే లోపు మరో గిన్నెలో శొంఠి చూర్ణం, మిరియాలు, ధనియాలు, పసుపు, తులసి చూర్ణం వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం కలిపిన చూర్ణాన్ని ఒక చెంచాడు తీసుకుని ఈ నీటిలో వేసుకుని మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి వడబెట్టుకుంటే ఆయుర్వేద ఔషధం రెడీ అయినట్లే..
ఎంత మోతాదులో తీసుకోవాలి?
చలికాలంలో జ్వరం వచ్చినప్పుడు తగ్గడానికి సుమారుగా 40-50 మిల్లీ లీటర్ల పరిమాణంలో మూడు పూటాల తీసుకోవాలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇంకా జ్వరం రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా వాడుకోవచ్చని అంటున్నారు. ఇలాంటి వారు ఉదయం, సాయంత్రం 30 మిల్లీ లీటర్ల పరిమాణంలో తీసుకోవాలని వివరించారు.
ఈ కషాయం చేసుకుని తాగితే కలిగే ప్రమోజనాలు..
చలికాలంలో వచ్చే కఫాన్ని తగ్గించడంలో శొంఠి ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంకా జీర్ణశక్తిని మెరుగుపరిచి అజీర్తి సమస్యను తగ్గిస్తుందట. ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు తగ్గడానికి, శరీరంలోని మలినాలు బయటకు వెళ్లడానికి మిరియాలు ఉపయోగపడుతుందన్నారు. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లు, వైరస్లను తగ్గించడానికి పసుపు బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఆయుర్వేద ఔషధాల తయారీలో తులసి మొక్కను అనేక రకాలుగా వాడుతుంటారు. వైరల్ ఇన్ఫెక్షన్, జ్వరాలు తగ్గడానికి తులసి చాలా సహాయపడుతుందని అంటున్నారు. జరాన్ని తగ్గించడంలో ధనియాలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. జ్వరం వచ్చినప్పుడు ధనియాల కషాయం చేసుకుని తాగితే సరిపోతుందని అంటున్నారు.
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!