Brain Tumor Risk: బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో బ్రెయిన్ ట్యూమర్ కూడా ఓ కారణం. మెదడులోని కణాలు నియంత్రించలేని విధంగా పెరిగినప్పుడే ఇది వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా న్యూరో సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ , డిమెన్షియా, అల్జీమర్స్, బ్రెయిన్ ట్యూమర్ వంటి మెదడు వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మెదడు మన మొత్తం శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఇలాంటి పరిస్థితుల్లో మెదడుకు సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా తేలిగ్గా తీసుకోకూడదు. రోగికి తలలో నిరంతరం నొప్పి, జ్ఞాపకశక్తి కోల్పోవడం, తల పరిమాణం పెరగడం, ఏదైనా ప్రమాదంలో తలకు గాయాలు లేదా గందరగోళ స్థితి ఉంటే ఇవన్నీ మెదడు వ్యాధుల లక్షణాలే. ఈ సందర్భంలో, వెంటనే చికిత్స చేయాలి. అయితే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎవరిలో ఎక్కువగా ఉందో తెలుసుకుందాం..
READ MORE: Shashi Tharoor: నాకు పార్టీ కన్నా దేశం ముఖ్యం.. కాంగ్రెస్కు థరూర్ షాక్..
Also Read
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే "మసాలా గుత్తివంకాయ" చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
వాస్తవానికి.. కుటుంబంలో ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ ఉంటే.. వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే.. చాలా కాలంగా రేడియేషన్ థెరపీ తీసుకున్న వారిలో, క్యాన్సర్ చికిత్స పొందిన వ్యక్తులలో మెదడు కణాలు అసాధారణంగా పెరుగుతాయి. వీరికి కూడా వచ్చే ప్రమాదం ఎక్కువ. రసాయనాలు, విష పదార్థాలకు ఎక్కువగా గురయ్యే పారిశ్రామిక ప్రాంతాలలో పనిచేసే వారు కూడా ప్రమాద ప్రాంతంలోకి వస్తారు. పురుగుమందులు, రబ్బరు లేదా వినైల్ క్లోరైడ్, చమురు ఉత్పత్తులు, ఇతర పారిశ్రామిక సమ్మేళనాలు వంటి రసాయన పదార్థాలతో సంబంధాలు తెంచుకోవాలి. రసాయనాలు, విష పదార్థాలకు ఎక్కువగా గురయ్యే పారిశ్రామిక ప్రాంతాలలో పనిచేసే వారికీ ఈ ప్రమాదం తప్పదు. అధిక సంతృప్త కొవ్వు ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం కూడా బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం.. చెడు ఆహార ఆహారం, చెడు దినచర్య, ధూమపానం లేదా వ్యాయామం చేయకపోవడం వంటి జీవనశైలి కూడా మెదడు కణితి ప్రమాదాన్ని పెంచుతాయి. దీనితో పాటు, లి-ఫ్రామిని సిండ్రోమ్, న్యూరోఫైబ్రోమాటోసిస్, ట్యూబరస్ స్క్లెరోసిస్ వంటి కొన్ని జన్యుపరమైన రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు కూడా దీని బారిన పడవచ్చు. అంతేకాకుండా, పురుషులకు మహిళల కంటే మెదడు కణితులు వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రమాదం వయస్సుతో పాటు పెరుగుతుంది. సాధారణంగా 15 నుంచి 39 వయసు మధ్య శరీరంలో అనేక ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి, క్యాన్సర్ సోకే ప్రమాదమూ ఎక్కువేనని నిపుణులు అంటున్నారు. అయితే వయసు బట్టి క్యాన్సర్ వచ్చే అవకాశాలు భిన్నంగా ఉంటాయి.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!