Brain Tumor Risk: బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో బ్రెయిన్ ట్యూమర్ కూడా ఓ కారణం. మెదడులోని కణాలు నియంత్రించలేని విధంగా పెరిగినప్పుడే ఇది వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా న్యూరో సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ , డిమెన్షియా, అల్జీమర్స్, బ్రెయిన్ ట్యూమర్ వంటి మెదడు వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మెదడు మన మొత్తం శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఇలాంటి పరిస్థితుల్లో మెదడుకు సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా తేలిగ్గా తీసుకోకూడదు. రోగికి తలలో నిరంతరం నొప్పి, జ్ఞాపకశక్తి కోల్పోవడం, తల పరిమాణం పెరగడం, ఏదైనా ప్రమాదంలో తలకు గాయాలు లేదా గందరగోళ స్థితి ఉంటే ఇవన్నీ మెదడు వ్యాధుల లక్షణాలే. ఈ సందర్భంలో, వెంటనే చికిత్స చేయాలి. అయితే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎవరిలో ఎక్కువగా ఉందో తెలుసుకుందాం..
READ MORE: Shashi Tharoor: నాకు పార్టీ కన్నా దేశం ముఖ్యం.. కాంగ్రెస్కు థరూర్ షాక్..
Also Read
- Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
- Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
- Mouth Ulcer Causes: నోటి పూత తగ్గడం లేదా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. డాక్టర్ల హెచ్చరిక
- Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే "బీట్రూట్ హల్వా" ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
వాస్తవానికి.. కుటుంబంలో ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ ఉంటే.. వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే.. చాలా కాలంగా రేడియేషన్ థెరపీ తీసుకున్న వారిలో, క్యాన్సర్ చికిత్స పొందిన వ్యక్తులలో మెదడు కణాలు అసాధారణంగా పెరుగుతాయి. వీరికి కూడా వచ్చే ప్రమాదం ఎక్కువ. రసాయనాలు, విష పదార్థాలకు ఎక్కువగా గురయ్యే పారిశ్రామిక ప్రాంతాలలో పనిచేసే వారు కూడా ప్రమాద ప్రాంతంలోకి వస్తారు. పురుగుమందులు, రబ్బరు లేదా వినైల్ క్లోరైడ్, చమురు ఉత్పత్తులు, ఇతర పారిశ్రామిక సమ్మేళనాలు వంటి రసాయన పదార్థాలతో సంబంధాలు తెంచుకోవాలి. రసాయనాలు, విష పదార్థాలకు ఎక్కువగా గురయ్యే పారిశ్రామిక ప్రాంతాలలో పనిచేసే వారికీ ఈ ప్రమాదం తప్పదు. అధిక సంతృప్త కొవ్వు ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం కూడా బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం.. చెడు ఆహార ఆహారం, చెడు దినచర్య, ధూమపానం లేదా వ్యాయామం చేయకపోవడం వంటి జీవనశైలి కూడా మెదడు కణితి ప్రమాదాన్ని పెంచుతాయి. దీనితో పాటు, లి-ఫ్రామిని సిండ్రోమ్, న్యూరోఫైబ్రోమాటోసిస్, ట్యూబరస్ స్క్లెరోసిస్ వంటి కొన్ని జన్యుపరమైన రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు కూడా దీని బారిన పడవచ్చు. అంతేకాకుండా, పురుషులకు మహిళల కంటే మెదడు కణితులు వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రమాదం వయస్సుతో పాటు పెరుగుతుంది. సాధారణంగా 15 నుంచి 39 వయసు మధ్య శరీరంలో అనేక ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి, క్యాన్సర్ సోకే ప్రమాదమూ ఎక్కువేనని నిపుణులు అంటున్నారు. అయితే వయసు బట్టి క్యాన్సర్ వచ్చే అవకాశాలు భిన్నంగా ఉంటాయి.
తాజావార్తలు
-
Brahmastra 2: ‘రామాయణం’ తర్వాత రణబీర్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?.. ద్విపాత్రాభినయంతో సిద్ధమవుతున్నాడా?
-
Myanmar Airstrike: బౌద్ధ మఠంపై మయన్మార్ సైన్యం వైమానిక దాడి.. 14 మంది మృతి
-
WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!