Shashi Tharoor: నాకు పార్టీ కన్నా దేశం ముఖ్యం.. కాంగ్రెస్కు థరూర్ షాక్..
- నాకు పార్టీ కన్నా దేశం ముఖ్యం..
- కాంగ్రెస్కు షాక్ ఇచ్చిన శశిథరూర్ కామెంట్స్..
- హస్తం పార్టీలో సంచలనంగా మారిన కేరళ ఎంపీ వ్యవహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ నేత శశిథరూర్ వ్యవహారం ఆ పార్టీలో సంచలనంగా మారుతోంది. క్రమక్రమంగా పార్టీకి థరూర్కి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా, ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. శనివారం ఆయన మాట్లాడుతూ.. జాతీయ భద్రత దృష్ట్యా రాజకీయ పార్టీలు ఒకదానితో ఒకటి సహకరించుకోవాలని అన్నారు. ‘శాంతి, సామరస్యం, జాతీయ అభివృద్ధి’ అనే అంశంపై కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీల కన్నా దేశం ముఖ్యమని చెప్పారు. ఎవరికైనా దేశం ముందు ఉంటుందని, పార్టీలు కేవలం దేశాన్ని నిర్మించే సాధానాలు మాత్రమే అని చెప్పారు.
Read Also: Sajjala: చంద్రబాబు హయాంలో జరిగింది లిక్కర్ స్కాం.. మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమం!
Also Read
- India Iran Travel Advisory: ఇరాన్కు అనవసర ప్రయాణాలు వద్దు.. పౌరులకు హెచ్చరిక జారీ చేసిన భారత రాయబార కార్యాలయం
- Ketan Agarwal Murder Case: అప్పుడు ‘సోనమ్’.. ఇప్పుడు ‘సియా’.. పెళ్లి అంటేనే భయపడుతున్న అబ్బాయిలు..
- Delhi: తెల్లవారుజామున కలకలం.. కార్మికుల గుడిసెల్లో భారీ అగ్నిప్రమాదం.!
- Pune Woman and Lover Arrested: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. నిందితులు సియా, చేతన్లకు 7 రోజుల పోలీసు కస్టడీ!
‘‘ముందుగా మీ విధేయత ఏమిటి..? నా దృష్టిలో దేశం ముందు వస్తుంది. పార్టీలు దేశాన్ని మెరుగుపరిచే సాధనం. కాబట్టి నా దృష్టిలో ఏ పార్టీకి చెందిన వారైనా దేశానికి మొదటి ప్రాధాన్యత. ’’ అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశ రక్షణకు సంబంధించిన విషయాలపై ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ప్రభుత్వానికి శశిథరూర్ మద్దతు పలకడంపై కాంగ్రెస్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ విమర్శలను కూడా ఆయన ప్రస్తావించారు.
‘‘నేను తీసుకున్న వైఖరి మన సాయుధ దళాలు, మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం. ఇటీవల మన దేశంలో, మన సరిహద్దుల్లో జరిగిన దాని కారణంగా చాలా మంది నన్ను తీవ్రంగా విమర్శించారు. కానీ నేను నా వైఖరిలో నిలబడతాను, ఎందుకంటే ఇది దేశానికి సరైన విషయం అని నేను నమ్ముతున్నాను’’ అని అన్నారు. జాతీయ భద్రత దృష్ట్యా కొన్నిసార్లు ఇతర పార్టీలకు సహకరించాలి, అయితే కొన్నిసార్లు పార్టీలు దీనిని నమ్మకద్రోహంగా భావిస్తాయని, అది పెద్ద సమస్య అవుతుందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో తప్పనిసరిగా పోటీ ఉంటుందని, కానీ క్లిష్ట సమయాల్లో కలిసి పనిచేయడానికి అవి అడ్డురాకూడదని చెప్పారు.
తాజావార్తలు
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Rajnikanth : నేను మాట్లాడినా సమస్యే.. మాట్లాడకపోయినా సమస్యే
-
India Iran Travel Advisory: ఇరాన్కు అనవసర ప్రయాణాలు వద్దు.. పౌరులకు హెచ్చరిక జారీ చేసిన భారత రాయబార కార్యాలయం
-
Sachin Tendulkar-ICC: హ్యాట్సాఫ్.. ఐసీసీపై సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు!
ట్రెండింగ్
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!