Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidney Stones Rising in Summer: వేసవి కాలం మొదలవడంతో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలో వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో పాటు కిడ్నీ రాళ్ల కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన వేడిలో శరీరం చెమట రూపంలో ఎక్కువ నీటిని కోల్పోతుంది. తగినంత నీరు తాగకపోతే మూత్రం చిక్కగా మారి, అందులోని ఖనిజాలు పేరుకుపోయి క్రమంగా రాళ్లుగా మారే ప్రమాదం పెరుగుతుంది. అందుకే వేసవిలో కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని నిపుణులు చెబుతున్నారు.
డీహైడ్రేషన్ వల్లే ప్రధాన ప్రమాదం
వైద్యుల ప్రకారం వేసవిలో కిడ్నీ రాళ్లకు ప్రధాన కారణం డీహైడ్రేషన్. అధికంగా చెమట పట్టినప్పుడు శరీరం నీటిని కోల్పోతుంది. ఈ పరిస్థితిలో కిడ్నీలు తక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. దాంతో మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్ వంటి పదార్థాల సాంద్రత పెరిగి అవి స్ఫటికాలుగా మారతాయి. ఇవే తర్వాత కిడ్నీ రాళ్లుగా మారుతాయి.
Also Read
- Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
- Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే 'ఫ్లఫీ ఆమ్లెట్' చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
- Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
- Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ 'బ్రెడ్ పకోడా'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ఈ ఆహారపు పొరపాట్లు ప్రమాదకరం
వేసవిలో చాలామంది చల్లని పానీయాలు, సాఫ్ట్ డ్రింక్స్, ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్ ఎక్కువగా తీసుకుంటారు. అయితే అధిక సోడియం శరీరంలో కాల్షియం విసర్జనను పెంచి రాళ్లు ఏర్పడే అవకాశాన్ని పెంచుతుంది. అలాగే ఎర్ర మాంసం, అధిక చక్కెర కలిగిన పానీయాలు, తగినంత నీరు తాగకుండా ఎక్కువ వ్యాయామం చేయడం కూడా కిడ్నీ రాళ్ల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయి.
ఎలా నివారించాలి?
కిడ్నీ రాళ్లను నివారించడానికి సులభమైన మార్గం తగినంత నీరు తాగడం. రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో బయట ఎక్కువగా తిరిగేవారు ఇంకా ఎక్కువ నీరు తీసుకోవడం మంచిది. నిమ్మరసం కలిపిన నీరు కూడా ఎంతో ఉపయోగకరం. ఇందులో ఉండే సిట్రేట్ పదార్థం రాళ్లు ఏర్పడకుండా సహాయపడుతుంది.
ఆహారంలో జాగ్రత్తలు
ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, కోల్డ్ డ్రింక్స్ తగ్గించాలి. నీరు ఎక్కువగా ఉన్న పుచ్చకాయ, దోసకాయ వంటి పండ్లు తీసుకోవడం మంచిది. అయితే, మూత్రం ముదురు పసుపు రంగులో రావడం, మూత్ర విసర్జనలో మంట, నడుము నొప్పి, కడుపు పక్క భాగంలో నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా వేసవిలో చిన్న నిర్లక్ష్యమే కిడ్నీ రాళ్లకు కారణమవుతుంది. కాబట్టి తగినంత నీరు తాగడం, సరైన ఆహారం తీసుకోవడం, శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు నివారించవచ్చు అని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.. అయితే, ఇది అవగాహన కోసమే.. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడ ఎంతో అవసరం..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!