Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Drinking Water By Standing Is A Problem

Drinking Water: నిలబడి నీళ్లు తాగుతున్నారా..? అయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ పక్కా వస్తాయి..!

Published Date :September 24, 2023 , 9:42 am
By NTV WebDesk
Drinking Water: నిలబడి నీళ్లు తాగుతున్నారా..? అయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ పక్కా వస్తాయి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Drinking Water: ప్రతిరోజూ తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం. కానీ చాలా మందికి తాగునీటి విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. సరైన పద్ధతిలో నీటిని తాగడం వల్ల మేలు జరుగుతుందని ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రం చెబుతోంది. శరీరం ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉండాలంటే నీరు చాలా అవసరం. శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి, కణాలను నిర్వహించడానికి, శరీరంలోని వివిధ భాగాలకు పోషకాలను తీసుకువెళ్లడానికి నీరు అవసరం. ఈ ముఖ్యమైన నీటిని ప్రతిరోజూ తగినంతగా పొందడం ముఖ్యం. కానీ చాలా మందికి తాగునీటి విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. భోజన సమయంలో నీరు త్రాగవచ్చా? భోజనం చేసిన తర్వాత ఎంతసేపు నీరు తాగాలి? మీరు రోజుకు ఎంత నీరు త్రాగాలి? దాని గురించి చాలా ప్రశ్నలు ఉన్నాయి. తక్కువ నీరు త్రాగేవారిలో ఆరోగ్య సంబంధిత సమస్యలు సర్వసాధారణం. అంతేకాదు నీటిని సరైన పద్ధతిలో తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నీరు త్రాగుటలో పొరపాట్లు జీర్ణ సమస్యలకు దారితీస్తాయి.

నిలబడి నీళ్లు తాగడం మంచిది కాదు..

మనం రోజూ ఎంత నీరు తాగుతున్నామో, ఎలా తాగుతున్నామో కూడా చాలా ముఖ్యం. నీళ్లు నిలబడి తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అనే సామెతను మనం తరచుగా వింటుంటాం. ఇది సామెతకు సరైనదే కానీ.. అయితే నిలబడి నీళ్లు తాగితే చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగితే మంచిదని చాలా మందికి తెలుసు కానీ, నిలబడి నీళ్లు తాగకూడదనే విషయం చాలా మందికి తెలియదు. ఇలా నిలబడి నీళ్లు తాగితే ఆరోగ్య పరంగా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంటున్నారు. నిలబడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీలకు నీరు అందదని, తద్వారా కిడ్నీ, మూత్రాశయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అవి అలిమెంటరీ కెనాల్ ద్వారా జీర్ణవ్యవస్థలోకి ప్రవేశిస్తాయి. తద్వారా నీరు ఒక్కసారిగా జీర్ణాశయ గోడలపై చిమ్ముతుంది. ఇది జీర్ణవ్యవస్థ యొక్క చాలా సున్నితమైన గోడలను దెబ్బతీస్తుంది. జీర్ణాశయం గోడలు దెబ్బతింటే ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి నిలబడి నీళ్లు తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు… చాలా మంది బఫే సిస్టం వాడుతూ నిలబడి భోజనం చేస్తున్నారు. ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. రెండూ కూర్చొని చేయాలని ఆయుర్వేదం సూచిస్తోంది. కానీ ఈ రోజుల్లో చాలామంది నిలబడి నీళ్లు, ఆహారం తెచ్చుకుంటున్నారు. ఈ అలవాటును మార్చుకుని కూర్చోవడం రెండూ చేయడం ఆరోగ్యకరం.

భోజనం మధ్య నీరు త్రాగడం మంచిది కాదు..

శరీరం పోషకాలను గ్రహించడానికి ఆహారం సరిగ్గా జీర్ణం కావడం ముఖ్యం. భోజనం ప్రారంభించడానికి ముందు లేదా భోజనం మధ్య నీరు త్రాగవద్దు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయని ఆయుర్వేదం సూచిస్తోంది. ఆయుర్వేదం ప్రకారం, భోజన సమయంలో నీరు త్రాగడం కడుపులోని ఆహారంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. నీరు సాధారణంగా శీతలీకరణ స్వభావం కలిగి ఉంటుంది, ఇది కడుపులోని కఠినమైన రసాయనాలతో చర్య జరిపి జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. అలాగే మధ్యలో నీళ్లు తాగడం వల్ల ఊబకాయం వస్తుంది.

నీరు త్రాగడానికి సరైన మార్గం..

ఒక్కసారిగా గ్లాసు నీళ్లు తాగకూడదు. నెమ్మదిగా సిప్ బై సిప్ త్రాగండి. ఆహారం తినే ముందు లేదా తర్వాత ఎప్పుడూ నీరు త్రాగకూడదు. ఇది జీర్ణ రసాలను పలుచన చేస్తుంది. ఇది ఆహారం నుండి పోషకాలను గ్రహించడం శరీరానికి కష్టతరం చేస్తుంది. కాబట్టి భోజనానికి 30 నిమిషాల ముందు, భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత నీళ్లు తాగకండి. మీరు తినేటప్పుడు దాహం వేస్తే 1-2 సిప్స్ నీరు తీసుకోండి. ఆహారం బాగా జీర్ణం కావడానికి గోరువెచ్చని నీటిని కూడా తాగండి.
Rakshit Shetty: మొదటి రోజే బ్రేక్ ఈవెన్… ఆల్ షోస్ హౌజ్ ఫుల్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Acidity
  • Drinking Water
  • Health
  • Health Care
  • Health News

తాజావార్తలు

  • Oscar Awards: ఆస్కార్ వేడుకలో నటుడు ‘యుద్ధం’ ప్రస్తావన.. ప్రియాంక చోప్రా రియాక్షన్ వైరల్

  • MP Putta Mahesh Kumar: తప్పు చేయలేదు.. నిర్దోషిగా నిరూపించుకుంటా..

  • Whats App Chat: వాట్సాప్ చాట్ ప్రాణాల మీదకు తెచ్చింది.. ఏఆర్ కానిస్టేబుల్ దారుణ హత్య..

  • ONLINE GAMES : అప్పులు తీర్చే దారి లేక బలవన్మరణానికి పాల్పడ్డ అరుణ్

  • Trump: ట్రంప్ చైనా టూర్‌‌పై సందిగ్ధం.. కారణమిదేనా?

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions