Drinking Water: నిలబడి నీళ్లు తాగుతున్నారా..? అయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ పక్కా వస్తాయి..!
Drinking Water: ప్రతిరోజూ తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం. కానీ చాలా మందికి తాగునీటి విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. సరైన పద్ధతిలో నీటిని తాగడం వల్ల మేలు జరుగుతుందని ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రం చెబుతోంది. శరీరం ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉండాలంటే నీరు చాలా అవసరం. శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి, కణాలను నిర్వహించడానికి, శరీరంలోని వివిధ భాగాలకు పోషకాలను తీసుకువెళ్లడానికి నీరు అవసరం. ఈ ముఖ్యమైన నీటిని ప్రతిరోజూ తగినంతగా పొందడం ముఖ్యం. కానీ చాలా మందికి తాగునీటి విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. భోజన సమయంలో నీరు త్రాగవచ్చా? భోజనం చేసిన తర్వాత ఎంతసేపు నీరు తాగాలి? మీరు రోజుకు ఎంత నీరు త్రాగాలి? దాని గురించి చాలా ప్రశ్నలు ఉన్నాయి. తక్కువ నీరు త్రాగేవారిలో ఆరోగ్య సంబంధిత సమస్యలు సర్వసాధారణం. అంతేకాదు నీటిని సరైన పద్ధతిలో తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నీరు త్రాగుటలో పొరపాట్లు జీర్ణ సమస్యలకు దారితీస్తాయి.
నిలబడి నీళ్లు తాగడం మంచిది కాదు..
Also Read
- Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
- Thyroid Control Diet: థైరాయిడ్కు చెక్ పెట్టే మ్యాజిక్ డైట్..! మందులు వద్దు.. ఈ ఆహారం ముద్దు.!
- KIMS Cuddles : మెడికల్ మిరాకిల్.. మృత్యువుతో పోరాడి గెలిచిన 9 నెలల పసికందు.. కిమ్స్ కడల్స్ అద్భుతం..
- Cool Water Without Fridge: ఫ్రిడ్జ్ అవసరం లేదు.. ఈ ఒక్క గోనె సంచి చిట్కాతో కూల్ కూల్ వాటర్ తాగొచ్చు..
మనం రోజూ ఎంత నీరు తాగుతున్నామో, ఎలా తాగుతున్నామో కూడా చాలా ముఖ్యం. నీళ్లు నిలబడి తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అనే సామెతను మనం తరచుగా వింటుంటాం. ఇది సామెతకు సరైనదే కానీ.. అయితే నిలబడి నీళ్లు తాగితే చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగితే మంచిదని చాలా మందికి తెలుసు కానీ, నిలబడి నీళ్లు తాగకూడదనే విషయం చాలా మందికి తెలియదు. ఇలా నిలబడి నీళ్లు తాగితే ఆరోగ్య పరంగా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంటున్నారు. నిలబడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీలకు నీరు అందదని, తద్వారా కిడ్నీ, మూత్రాశయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అవి అలిమెంటరీ కెనాల్ ద్వారా జీర్ణవ్యవస్థలోకి ప్రవేశిస్తాయి. తద్వారా నీరు ఒక్కసారిగా జీర్ణాశయ గోడలపై చిమ్ముతుంది. ఇది జీర్ణవ్యవస్థ యొక్క చాలా సున్నితమైన గోడలను దెబ్బతీస్తుంది. జీర్ణాశయం గోడలు దెబ్బతింటే ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి నిలబడి నీళ్లు తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు… చాలా మంది బఫే సిస్టం వాడుతూ నిలబడి భోజనం చేస్తున్నారు. ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. రెండూ కూర్చొని చేయాలని ఆయుర్వేదం సూచిస్తోంది. కానీ ఈ రోజుల్లో చాలామంది నిలబడి నీళ్లు, ఆహారం తెచ్చుకుంటున్నారు. ఈ అలవాటును మార్చుకుని కూర్చోవడం రెండూ చేయడం ఆరోగ్యకరం.
భోజనం మధ్య నీరు త్రాగడం మంచిది కాదు..
శరీరం పోషకాలను గ్రహించడానికి ఆహారం సరిగ్గా జీర్ణం కావడం ముఖ్యం. భోజనం ప్రారంభించడానికి ముందు లేదా భోజనం మధ్య నీరు త్రాగవద్దు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయని ఆయుర్వేదం సూచిస్తోంది. ఆయుర్వేదం ప్రకారం, భోజన సమయంలో నీరు త్రాగడం కడుపులోని ఆహారంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. నీరు సాధారణంగా శీతలీకరణ స్వభావం కలిగి ఉంటుంది, ఇది కడుపులోని కఠినమైన రసాయనాలతో చర్య జరిపి జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. అలాగే మధ్యలో నీళ్లు తాగడం వల్ల ఊబకాయం వస్తుంది.
నీరు త్రాగడానికి సరైన మార్గం..
ఒక్కసారిగా గ్లాసు నీళ్లు తాగకూడదు. నెమ్మదిగా సిప్ బై సిప్ త్రాగండి. ఆహారం తినే ముందు లేదా తర్వాత ఎప్పుడూ నీరు త్రాగకూడదు. ఇది జీర్ణ రసాలను పలుచన చేస్తుంది. ఇది ఆహారం నుండి పోషకాలను గ్రహించడం శరీరానికి కష్టతరం చేస్తుంది. కాబట్టి భోజనానికి 30 నిమిషాల ముందు, భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత నీళ్లు తాగకండి. మీరు తినేటప్పుడు దాహం వేస్తే 1-2 సిప్స్ నీరు తీసుకోండి. ఆహారం బాగా జీర్ణం కావడానికి గోరువెచ్చని నీటిని కూడా తాగండి.
Rakshit Shetty: మొదటి రోజే బ్రేక్ ఈవెన్… ఆల్ షోస్ హౌజ్ ఫుల్
తాజావార్తలు
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?