COVID: కరోనా మళ్ళీ వస్తుందా? సింగపూర్, హాంకాంగ్లలో పెరుగుతున్న కేసులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియాలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు మళ్లీ పెరుగుతున్నాయి. సింగపూర్, హాంకాంగ్ వంటి జనసాంద్రత కలిగిన ఆర్థిక కేంద్రాలలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం, బూస్టర్ డోస్లు తీసుకునే వృద్ధుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఈ పెరుగుదల సంభవిస్తుందని ఆరోగ్య అధికారులు భావిస్తున్నారు. సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. మే 3 నాటికి COVID-19 కేసుల సంఖ్య 14,200 కు చేరుకుంది. ఇది గత వారం కంటే దాదాపు 28% ఎక్కువ.
READ MORE: Asaduddin Owaisi: హిందూ ఓట్ల ఏకీకరణ, విపక్షాల వైఫల్యమే బీజేపీ గెలుపుకు కారణం..
Also Read
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
ఆసుపత్రిలో చేరిన రోగుల సంఖ్య కూడా దాదాపు 30% పెరిగింది. అయితే, మహమ్మారి సమయంలో కనుగొనబడిన వేరియంట్ల కంటే ఈ వేరియంట్లు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. వాస్తవానికి.. NB.1.8, LF.7 రకాలు వైరస్లు ఇక్కడ వ్యాప్తి చెందుతున్నాయి. ఇవి JN.1 కరోనావైరస్ యొక్క రకాలు. హాంకాంగ్లోని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ ప్రకారం.. కోవిడ్ ఇన్ఫెక్షన్లు భారీ స్థాయికి చేరుకున్నాయి. శ్వాసకోశ నమూనాల పాజిటివిటీ రేటు నాలుగు వారాల క్రితం 6.21% నుంచి 13.66%కి చేరుకుంది. మే మొదటి వారంలో, హాంకాంగ్లో కరోనా కారణంగా 31 మంది మరణించారు.
READ MORE: RR vs PBKS: ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం.. మళ్లీ ఓడిన రాజస్థాన్
ఈ అంశంపై భారతీయ వైరాలజిస్టులు, ఆరోగ్య నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో తీవ్రమైన వైరస్ విజృంభణకు అవకాశం లేదని, ఎందుకంటే.. ఇప్పటికే జనాభా కోవిడ్ తర్వాత రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు. ఈ వ్యాధి మరోసారి మన దేశంలోకి ప్రవేశిస్తే.. సాధారణ జలుబు లేదా ఫ్లూ వంటి లక్షణాలతో తేలికపాటి ఇన్ఫెక్షన్లు సంభవించవచ్చని హెచ్చరించారు. పిల్లలు, వృద్ధులు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచించారు. ఇప్పటి నుంచే మాస్క్లు ధరించడం, చేతులు కడుక్కోవడం, జనసమూహానికి దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచించారు.
తాజావార్తలు
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..