COVID: కరోనా మళ్ళీ వస్తుందా? సింగపూర్, హాంకాంగ్లలో పెరుగుతున్న కేసులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియాలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు మళ్లీ పెరుగుతున్నాయి. సింగపూర్, హాంకాంగ్ వంటి జనసాంద్రత కలిగిన ఆర్థిక కేంద్రాలలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం, బూస్టర్ డోస్లు తీసుకునే వృద్ధుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఈ పెరుగుదల సంభవిస్తుందని ఆరోగ్య అధికారులు భావిస్తున్నారు. సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. మే 3 నాటికి COVID-19 కేసుల సంఖ్య 14,200 కు చేరుకుంది. ఇది గత వారం కంటే దాదాపు 28% ఎక్కువ.
READ MORE: Asaduddin Owaisi: హిందూ ఓట్ల ఏకీకరణ, విపక్షాల వైఫల్యమే బీజేపీ గెలుపుకు కారణం..
Also Read
- Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
- Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
- Arthritis Pain in Monsoon: వర్షాకాలంలో కీళ్ల నొప్పితో ఇబ్బందా..? నిపుణులు సూచించిన 5 చిట్కాలు మీ కోసం..
- Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ "పన్నీర్ టిక్కా"ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
ఆసుపత్రిలో చేరిన రోగుల సంఖ్య కూడా దాదాపు 30% పెరిగింది. అయితే, మహమ్మారి సమయంలో కనుగొనబడిన వేరియంట్ల కంటే ఈ వేరియంట్లు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. వాస్తవానికి.. NB.1.8, LF.7 రకాలు వైరస్లు ఇక్కడ వ్యాప్తి చెందుతున్నాయి. ఇవి JN.1 కరోనావైరస్ యొక్క రకాలు. హాంకాంగ్లోని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ ప్రకారం.. కోవిడ్ ఇన్ఫెక్షన్లు భారీ స్థాయికి చేరుకున్నాయి. శ్వాసకోశ నమూనాల పాజిటివిటీ రేటు నాలుగు వారాల క్రితం 6.21% నుంచి 13.66%కి చేరుకుంది. మే మొదటి వారంలో, హాంకాంగ్లో కరోనా కారణంగా 31 మంది మరణించారు.
READ MORE: RR vs PBKS: ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం.. మళ్లీ ఓడిన రాజస్థాన్
ఈ అంశంపై భారతీయ వైరాలజిస్టులు, ఆరోగ్య నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో తీవ్రమైన వైరస్ విజృంభణకు అవకాశం లేదని, ఎందుకంటే.. ఇప్పటికే జనాభా కోవిడ్ తర్వాత రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు. ఈ వ్యాధి మరోసారి మన దేశంలోకి ప్రవేశిస్తే.. సాధారణ జలుబు లేదా ఫ్లూ వంటి లక్షణాలతో తేలికపాటి ఇన్ఫెక్షన్లు సంభవించవచ్చని హెచ్చరించారు. పిల్లలు, వృద్ధులు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచించారు. ఇప్పటి నుంచే మాస్క్లు ధరించడం, చేతులు కడుక్కోవడం, జనసమూహానికి దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచించారు.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!