Health Tips: పొట్టలో ఏమీ లేనప్పుడు ఇవి తింటే చాలా ప్రమాదం..అవేంటంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనేక రకాల పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యాన్ని మరింత పెంచుతాయి. మనలో చాలామంది రోజు ఏదో ఒక పండు ని ఖచ్చితంగా తింటారు. కొందరు ఉదయాన్నే ఏదో ఒక పండు తినడం లేదా మరికొందరేమో ఉపవాసం చేశాక ఖాళీ కడుపుతో ఏదో ఒక పండు తో తమ ఉపవాసాన్ని విరమిస్తారు. అయితే ఎప్పుడు తింటే ఏంటి? పండ్లే కదా .. ఆరోగ్యానికి మంచివే కదా అని వాటిని ఎప్పుడుపడితే అప్పుడే తింటాం. అయితే వాటిని ఎప్పడుబడితే అప్పుడు తినకూడదు. వాటిలో షుగర్, కేలరీలు, యాసిడ్లు ఉంటాయి. ఖాళీ పొట్టతో వాటిని తింటే రకరకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఉదాహరణకు తియ్యటి పండ్లను ఖాళీ పొట్టతో తింటే ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి. దీని ద్వారా పాంక్రియాస్పై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
కొన్ని రకాల పండ్లైతే పొట్టలోకి వెళ్లాక వాంతులు వచ్చేలా చేస్తాయి. దీని ద్వారా అల్సర్లకు దారి తీసే అవకాశం ఉంది. ఆ తర్వాత టాబ్లెట్లు వాడటం వల్ల సమస్య పరిష్కారమైనా.. అది దీర్ఘకాలిక సమస్యగా మారే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఖాళీ పొట్టతో ఏం తినకూడదో తెలుసుకుందాం. ముఖ్యంగా ఉదయానే ఏమీ తినకుండా ఈ పండ్లను తినకండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read
- Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
1. అరటిపండు: చాలా మంది ఉదయాన్నే వర్కవుట్ చేస్తూ… ఎనర్జీ కోసం అరటిపండ్లను తింటారు. ఫలితంగా వెంటనే ఎనర్జీ వస్తుంది కానీ… అవి రక్తంలో మెగ్నీషియంను పెంచేసి గుండెకు కీడు చెయ్యగలవు. అందువల్ల ఖాళీ పొట్ట ఉన్నప్పుడు అరటి తినకూడదు.
2. పుల్లటి పండ్లు: పుల్లటి పండ్లు అన్నింటిలోనూ గ్యాస్ ఉంటుంది. ద్రాక్ష, ఉసిరి, ఆరెంజ్ వంటివి. ఇవి పొట్టలోకి వెళ్లి గ్యాస్ని ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. గుండె మంట కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఏదైనా ఆహారం తిన్న తర్వాతే వీటిని తినాలి. అది కూడా కొద్దికొద్దిగానే.
3. పియర్ ఫ్రూట్ : పియర్ ఫ్రూట్లో ఫైబర్ ఉంటుంది. ఖాళీ పొట్టతో ఈ పండును తింటే మూత్రనాళం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
4. లిచి: లిచి పండ్లు తినేటప్పుడు పెద్దగా తియ్యగా ఉన్నట్లు అనిపించవు. కానీ పొట్టలోకి వెళ్లాక మాత్రం షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెంచేస్తాయి. కడుపు నొప్పి వచ్చేలా కూడా చేస్తాయి.
5. మామిడి పండు: మామిడిని ఉదయాన్నే తినకపోవడం మేలు. ఇందులో షుగర్ చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరగడం, బాగా తగ్గడం లాంటి సమస్యలు తెస్తాయి.
6. నల్లటి ఖర్జురా: నల్లటి ఖర్జూరాల్లో పెక్టిన్, టాన్నిక్ అనే యాసిడ్లు ఉంటాయి. అవి గ్యాస్ట్రిక్ యాసిడ్తో కలుస్తాయి. పొట్టంతా ఉబ్బేలా చేస్తాయి. అందువల్ల ఖాళీ కడుపుతో ఎట్టి పరిస్థితుల్లో వీటిని తినకూడదు. దీర్ఘ కాలికంగా గ్యాస్ సమస్యలతో బాధపడేవారు వీటిని తినకూడదు.
7. టమాటా: టమాటాల్లో కూడా టాన్నిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది పొట్టలో యాసీడీటీ (acidity)ని పెంచుతుంది. దీర్ఘకాలంలో గ్యాస్ట్రిక్ అల్సర్లకు కూడా కారణమవుతుంది.
8. దోసకాయ: దోసకాయల్లో అమైనో యాసిడ్లు ఎక్కువ. వీటిని ఖాళీ కడుపుతో తింటే కడుపు నొప్పి వచ్చేలా, గుండె మంట కలిగేలా చేస్తాయి.
చూశారు కదా .. ఇకనుండైనా ఖాళీ కడుపుతో ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్త వహిస్తే మంచిది.
తాజావార్తలు
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!