Health Tips: పొట్టలో ఏమీ లేనప్పుడు ఇవి తింటే చాలా ప్రమాదం..అవేంటంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనేక రకాల పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యాన్ని మరింత పెంచుతాయి. మనలో చాలామంది రోజు ఏదో ఒక పండు ని ఖచ్చితంగా తింటారు. కొందరు ఉదయాన్నే ఏదో ఒక పండు తినడం లేదా మరికొందరేమో ఉపవాసం చేశాక ఖాళీ కడుపుతో ఏదో ఒక పండు తో తమ ఉపవాసాన్ని విరమిస్తారు. అయితే ఎప్పుడు తింటే ఏంటి? పండ్లే కదా .. ఆరోగ్యానికి మంచివే కదా అని వాటిని ఎప్పుడుపడితే అప్పుడే తింటాం. అయితే వాటిని ఎప్పడుబడితే అప్పుడు తినకూడదు. వాటిలో షుగర్, కేలరీలు, యాసిడ్లు ఉంటాయి. ఖాళీ పొట్టతో వాటిని తింటే రకరకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఉదాహరణకు తియ్యటి పండ్లను ఖాళీ పొట్టతో తింటే ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి. దీని ద్వారా పాంక్రియాస్పై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
కొన్ని రకాల పండ్లైతే పొట్టలోకి వెళ్లాక వాంతులు వచ్చేలా చేస్తాయి. దీని ద్వారా అల్సర్లకు దారి తీసే అవకాశం ఉంది. ఆ తర్వాత టాబ్లెట్లు వాడటం వల్ల సమస్య పరిష్కారమైనా.. అది దీర్ఘకాలిక సమస్యగా మారే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఖాళీ పొట్టతో ఏం తినకూడదో తెలుసుకుందాం. ముఖ్యంగా ఉదయానే ఏమీ తినకుండా ఈ పండ్లను తినకండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read
- Health Tips : రాత్రి పిండి.. ఉదయం రొట్టె..? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
- Ragi Vadiyalu: అమ్మమ్మల కాలం నాటి టేస్ట్.. హెల్తీ రాగి వడియాలను సింపుల్గా ఇలా చేసుకోండి!
- Japanese Skin Care : మెరిసే చర్మం కోసం జపనీస్ రహస్యం.. ఇంట్లోనే మీ ముఖాన్ని యవ్వనంగా మార్చుకోండి.!
- Health Tips : పార్టీ చేసుకున్న మరుసటి రోజే జిమ్కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
1. అరటిపండు: చాలా మంది ఉదయాన్నే వర్కవుట్ చేస్తూ… ఎనర్జీ కోసం అరటిపండ్లను తింటారు. ఫలితంగా వెంటనే ఎనర్జీ వస్తుంది కానీ… అవి రక్తంలో మెగ్నీషియంను పెంచేసి గుండెకు కీడు చెయ్యగలవు. అందువల్ల ఖాళీ పొట్ట ఉన్నప్పుడు అరటి తినకూడదు.
2. పుల్లటి పండ్లు: పుల్లటి పండ్లు అన్నింటిలోనూ గ్యాస్ ఉంటుంది. ద్రాక్ష, ఉసిరి, ఆరెంజ్ వంటివి. ఇవి పొట్టలోకి వెళ్లి గ్యాస్ని ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. గుండె మంట కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఏదైనా ఆహారం తిన్న తర్వాతే వీటిని తినాలి. అది కూడా కొద్దికొద్దిగానే.
3. పియర్ ఫ్రూట్ : పియర్ ఫ్రూట్లో ఫైబర్ ఉంటుంది. ఖాళీ పొట్టతో ఈ పండును తింటే మూత్రనాళం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
4. లిచి: లిచి పండ్లు తినేటప్పుడు పెద్దగా తియ్యగా ఉన్నట్లు అనిపించవు. కానీ పొట్టలోకి వెళ్లాక మాత్రం షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెంచేస్తాయి. కడుపు నొప్పి వచ్చేలా కూడా చేస్తాయి.
5. మామిడి పండు: మామిడిని ఉదయాన్నే తినకపోవడం మేలు. ఇందులో షుగర్ చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరగడం, బాగా తగ్గడం లాంటి సమస్యలు తెస్తాయి.
6. నల్లటి ఖర్జురా: నల్లటి ఖర్జూరాల్లో పెక్టిన్, టాన్నిక్ అనే యాసిడ్లు ఉంటాయి. అవి గ్యాస్ట్రిక్ యాసిడ్తో కలుస్తాయి. పొట్టంతా ఉబ్బేలా చేస్తాయి. అందువల్ల ఖాళీ కడుపుతో ఎట్టి పరిస్థితుల్లో వీటిని తినకూడదు. దీర్ఘ కాలికంగా గ్యాస్ సమస్యలతో బాధపడేవారు వీటిని తినకూడదు.
7. టమాటా: టమాటాల్లో కూడా టాన్నిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది పొట్టలో యాసీడీటీ (acidity)ని పెంచుతుంది. దీర్ఘకాలంలో గ్యాస్ట్రిక్ అల్సర్లకు కూడా కారణమవుతుంది.
8. దోసకాయ: దోసకాయల్లో అమైనో యాసిడ్లు ఎక్కువ. వీటిని ఖాళీ కడుపుతో తింటే కడుపు నొప్పి వచ్చేలా, గుండె మంట కలిగేలా చేస్తాయి.
చూశారు కదా .. ఇకనుండైనా ఖాళీ కడుపుతో ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్త వహిస్తే మంచిది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!