Health Tips : షుగర్ పేషంట్స్ పరగడుపున ఖాళీ పొట్టతో తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!
రాత్రికి ఉదయానికి చాలా సమయం ఉంటుంది.. అందుకే ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.. రోజంతా శరీరం ఉత్తేజంగా ఉండి, ఉత్సహంగా పని చేయాలంటే పరగడుపున తినే ఆహారం బ్రేక్ ఫాస్ట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.. ఇక షుగర్ పేషంట్స్ బ్రేక్ ఫాస్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.. కడుపునిండా తినడమే కాకుండా..రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో నెమ్మదిగా విడుదల చేసే ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్ వల్ల షుగర్ స్థాయిలను అధికంగా చేసే ఫుడ్ ను తింటే రోజంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మధుమేహం ఉన్నవారిలో ఉదయానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మన కాలేయం అదనపు గ్లూకోజ్ని ఉత్పత్తి చేస్తుంది… అందుకే జాగ్రత్తగా ఆహారాన్ని తీసుకోవాలి..
షుగర్ ఉన్నవారు ఖాళీ కడుపుతో ఒక స్పూను ఆవు నెయ్యిలో చిటికెడు పసుపు కలుపుకునే తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఆ రోజంతా మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా కాపాడుతుంది. అలాగే తీపి పదార్థాలు తినాలన్న కోరికలను కూడా నియంత్రిస్తుంది. నెయ్యి పొట్ట నిండిన భావనను పెంచుతుంది. పసుపు శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.. అలాగే మన వంటగదిలో ఉండే ఎన్నో మసాలా దినుసులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి..
Also Read
- Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
- Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
- Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
- Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
అందులో దాల్చిన చెక్క వల్ల మధుమేహలుకు ఎంతో ఉపయోగం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు దోహదం చేస్తుంది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.. దాల్చిన చెక్కతో తయారు చేసుకున్న టీ పరగడుపునే తాగితే మంచిది.. మెంతి నీరు మధుమేహలకు నిజంగానే సూపర్ ఫుడ్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పరగడుపునే మెంతి నీరు తాగినట్టయితే శరీరం కార్బోహైడ్రేట్లను శోషించుకోకుండా కాపాడుతుంది.
ఒక టీ స్పూన్ మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం లేచాక ఆ నీటిని తాగేయాలి. ఆ గింజలను కూడా నమిలి మింగేయాలి.. ఇలా చెయ్యడం వల్ల మీ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చెయ్యవచ్చు.. ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సిడర్ వెనిగర్ తాగిన కూడా మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ రెండు అందుబాటులో లేకుంటే.. గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి పరగడుపున తాగినా కూడా ఉత్తమం అంటున్నారు.. ఉదయం నానబెట్టిన బాదంను తీసుకోవడం కూడా మంచిదే అంటున్నారు నిపుణులు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో