Health Tips: తిన్న వెంటనే ఈ పొరపాట్లు చేయకండి..
Health Tips: చాలా మంది తిన్న వెంటనే కొన్ని పనులు చేస్తుంటారు. అలా చేసే పనులు శరీరంపై ఎన్ని రకాల ప్రభావాలను చూపుతాయో తెలిస్తే షాక్ అవుతారు. బాబోయ్ వెంటనే మీరు తిన్న తర్వాత చేసే పనులు ఏంటో ఒక గుర్తు చేసుకోండి.. ఈ స్టోరీలో తిన్న తర్వాత ఏయే పనులు చేయకూడదో తెలుసుకుందాం. పొరపాటున ఈ స్టోరీలో చెప్పిన పనులు కనుక మీరు చేస్తుంటే వెంటనే ఆపి వేయడం చాలా ఉత్తమం.. ఇంతకీ ఏంటా పనులు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Suriya : వరుస ఫ్లాపులు.. రూట్ మార్చిన సూర్య
Also Read
- Easy Laundry Tricks: కాలర్ మొండి మరకలను సింపుల్గా వదిలించే సూపర్ టిప్స్!
- Green Moong Dal Laddu: ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు బెల్లం లడ్డు.. పిల్లల కోసం అదిరిపోయే హెల్దీ స్నాక్.!
- Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
- Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
భోజనం చేసిన వెంటనే ఓ కప్పు కాఫీ/టీ తాగడం, నిద్ర పోవడం.. లాంటి అలవాట్లు చాలామందికి ఉంటాయి. ఆ చాలా మందిలో మీరూ కూడా ఉన్నారా బాస్.. వెంటనే ఆపేసేయండి. ఈ వ్యాపకాలను ఎంత త్వరగా మానుకుంటే మీ ఆరోగ్యానికి అంత మంచిదంటున్నారు వైద్య నిపుణులు. చాలామందికి తెలిసో, తెలియకో చేసే ఈ పొరపాట్ల వారి జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, తద్వారా లేనిపోని అనారోగ్యాలకు దారి తీస్తుందని అంటున్నారు.
పొరపాటున కూడా స్నానం చేయకూడదు..
కొందరు తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు. వెంటనే ఈ అలవాటును మానుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి తగిన శక్తి, పొట్టకు సరైన రక్తప్రసరణ అవసరం. తెలిసో తెలియకో చాలా మంది అయితే తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు. దీని కారణంగా రక్తప్రసరణపై ప్రభావం పడి శరీర ఉష్ణోగ్రతలు అదుపు తప్పుతాయని చెబుతున్నారు. ఫలితంగా ఆహారం జీర్ణం కావడానికి మరింత ఎక్కువ సమయం పడుతుందని, దీని కారణంగా అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయంటున్నారు. అందుకే భోంచేశాక 30 లేదా 40 నిమిషాల తర్వాతే స్నానం చేయమంటున్నారు.
ఏదో ఒక పండను తినడం ఉత్తమం..
ఏదో ఒక పండును తిన్న వెంటనే తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు చెబుతున్నారు. కొందరు వైద్యులు మాట్లాడుతూ.. ఇది నిజమే అయినా భోంచేశాక పండ్లు తీసుకునే కంటే అల్పాహార సమయంలో తీసుకున్నట్లయితే వాటిలోని పోషకాలను శరీరం మరింత సమర్థంగా గ్రహిస్తుందని చెబుతున్నారు. ఒకవేళ భోజనం తర్వాత తీసుకుంటే ఇతర పదార్థాలతో అది కలిసిపోయి వాటిలోని సంపూర్ణ పోషకాలు శరీరానికి అందవన్నది వారి అభిప్రాయం. ఇప్పుడు వాళ్లు చెప్పేది ఏంటంటే పండు తినాలనుకుంటే బ్రేక్ఫాస్ట్గా, మిడ్మీల్గా (అల్పాహారం, లంచ్కి మధ్యలో), అదీ కాదంటే సాయంత్రం స్నాక్గా తీసుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
కచ్చితంగా గంట తర్వాతనే..
పలువురు నిపుణులు మాట్లాడుతూ.. భోజనం చేసిన వెంటనే కొంతమందికి టీ/కాఫీ తాగే అలవాటుంటుంది. అయితే వీటివల్ల మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు, ఐరన్.. వంటివి శరీరం గ్రహించే శక్తి క్షీణిస్తుందని చెబుతున్నారు. ఇందుకు టీ/కాఫీలో ఉండే ఫినోలిక్ సమ్మేళనాలే కారణమట. అందుకే తిన్న వెంటనే కాకుండా గంటయ్యాక అదీ తక్కువ మోతాదులో వీటిని తాగితే ఎలాంటి సమస్యా ఉండదట.
చాలా మంది తిన్న వెంటనే గడగడా నీళ్లు తాగేస్తుంటారు. ఇది చాలా డెంజర్ అంటున్నారు డాక్టర్లు.. ఇలా చేస్తే తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి సహకరించే ఎంజైమ్స్, జీర్ణ రసాలు.. వంటివి పొట్టలో తక్కువగా ఉత్పత్తవుతాయట. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదని, భోజనం చేసిన వెంటనే కాకుండా గంటయ్యాక ఓ గ్లాసు నీళ్లు తాగమంటున్నారు నిపుణులు.
READ ALSO: Tollywood : ప్లాప్ సినిమాకు అవార్డు.. అమ్మడి ఆశలన్నీ ఆ సినిమాపైనే
తాజావార్తలు
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
-
Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
-
GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
-
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!