Health Tips: తిన్న వెంటనే ఈ పొరపాట్లు చేయకండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Tips: చాలా మంది తిన్న వెంటనే కొన్ని పనులు చేస్తుంటారు. అలా చేసే పనులు శరీరంపై ఎన్ని రకాల ప్రభావాలను చూపుతాయో తెలిస్తే షాక్ అవుతారు. బాబోయ్ వెంటనే మీరు తిన్న తర్వాత చేసే పనులు ఏంటో ఒక గుర్తు చేసుకోండి.. ఈ స్టోరీలో తిన్న తర్వాత ఏయే పనులు చేయకూడదో తెలుసుకుందాం. పొరపాటున ఈ స్టోరీలో చెప్పిన పనులు కనుక మీరు చేస్తుంటే వెంటనే ఆపి వేయడం చాలా ఉత్తమం.. ఇంతకీ ఏంటా పనులు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Suriya : వరుస ఫ్లాపులు.. రూట్ మార్చిన సూర్య
Also Read
- Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
- Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
- Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ 'జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
భోజనం చేసిన వెంటనే ఓ కప్పు కాఫీ/టీ తాగడం, నిద్ర పోవడం.. లాంటి అలవాట్లు చాలామందికి ఉంటాయి. ఆ చాలా మందిలో మీరూ కూడా ఉన్నారా బాస్.. వెంటనే ఆపేసేయండి. ఈ వ్యాపకాలను ఎంత త్వరగా మానుకుంటే మీ ఆరోగ్యానికి అంత మంచిదంటున్నారు వైద్య నిపుణులు. చాలామందికి తెలిసో, తెలియకో చేసే ఈ పొరపాట్ల వారి జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, తద్వారా లేనిపోని అనారోగ్యాలకు దారి తీస్తుందని అంటున్నారు.
పొరపాటున కూడా స్నానం చేయకూడదు..
కొందరు తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు. వెంటనే ఈ అలవాటును మానుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి తగిన శక్తి, పొట్టకు సరైన రక్తప్రసరణ అవసరం. తెలిసో తెలియకో చాలా మంది అయితే తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు. దీని కారణంగా రక్తప్రసరణపై ప్రభావం పడి శరీర ఉష్ణోగ్రతలు అదుపు తప్పుతాయని చెబుతున్నారు. ఫలితంగా ఆహారం జీర్ణం కావడానికి మరింత ఎక్కువ సమయం పడుతుందని, దీని కారణంగా అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయంటున్నారు. అందుకే భోంచేశాక 30 లేదా 40 నిమిషాల తర్వాతే స్నానం చేయమంటున్నారు.
ఏదో ఒక పండను తినడం ఉత్తమం..
ఏదో ఒక పండును తిన్న వెంటనే తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు చెబుతున్నారు. కొందరు వైద్యులు మాట్లాడుతూ.. ఇది నిజమే అయినా భోంచేశాక పండ్లు తీసుకునే కంటే అల్పాహార సమయంలో తీసుకున్నట్లయితే వాటిలోని పోషకాలను శరీరం మరింత సమర్థంగా గ్రహిస్తుందని చెబుతున్నారు. ఒకవేళ భోజనం తర్వాత తీసుకుంటే ఇతర పదార్థాలతో అది కలిసిపోయి వాటిలోని సంపూర్ణ పోషకాలు శరీరానికి అందవన్నది వారి అభిప్రాయం. ఇప్పుడు వాళ్లు చెప్పేది ఏంటంటే పండు తినాలనుకుంటే బ్రేక్ఫాస్ట్గా, మిడ్మీల్గా (అల్పాహారం, లంచ్కి మధ్యలో), అదీ కాదంటే సాయంత్రం స్నాక్గా తీసుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
కచ్చితంగా గంట తర్వాతనే..
పలువురు నిపుణులు మాట్లాడుతూ.. భోజనం చేసిన వెంటనే కొంతమందికి టీ/కాఫీ తాగే అలవాటుంటుంది. అయితే వీటివల్ల మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు, ఐరన్.. వంటివి శరీరం గ్రహించే శక్తి క్షీణిస్తుందని చెబుతున్నారు. ఇందుకు టీ/కాఫీలో ఉండే ఫినోలిక్ సమ్మేళనాలే కారణమట. అందుకే తిన్న వెంటనే కాకుండా గంటయ్యాక అదీ తక్కువ మోతాదులో వీటిని తాగితే ఎలాంటి సమస్యా ఉండదట.
చాలా మంది తిన్న వెంటనే గడగడా నీళ్లు తాగేస్తుంటారు. ఇది చాలా డెంజర్ అంటున్నారు డాక్టర్లు.. ఇలా చేస్తే తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి సహకరించే ఎంజైమ్స్, జీర్ణ రసాలు.. వంటివి పొట్టలో తక్కువగా ఉత్పత్తవుతాయట. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదని, భోజనం చేసిన వెంటనే కాకుండా గంటయ్యాక ఓ గ్లాసు నీళ్లు తాగమంటున్నారు నిపుణులు.
READ ALSO: Tollywood : ప్లాప్ సినిమాకు అవార్డు.. అమ్మడి ఆశలన్నీ ఆ సినిమాపైనే
తాజావార్తలు
-
Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్కే నేరుగా హెచ్చరిక..
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!