Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్గా చేసుకొనే హెల్దీ పాయసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chana Dal Payasam: మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి ట్రెడిషనల్ స్వీట్ అంటే మొదట గుర్తొచ్చేది ‘శెనగబేడల పాయసం’. పప్పులు, బియ్యం రవ్వ, కమ్మని బెల్లం కలయికతో చేసే ఈ పాయసం కేవలం ఒక వంటకం మాత్రమే కాదు.. అది ఒక ఎమోషన్.. పండగ ఏదైనా, ఈ పాయసం ఉంటే ఆ విందు పూర్తి అయినట్లే. మరి ఆ పాతకాలపు రుచిని నేటి తరానికి నచ్చేలా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Tragedy : హైదరాబాద్లో షాకింగ్ ఘటన.. ప్రేమోన్మాది దాడి.. యువతి మృతి..!
Also Read
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్తో రోజంతా సాఫ్ట్గా!
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
శెనగబేడల పాయసానికి కావాల్సిన పదార్థాలు ఇవే..
పచ్చి శెనగపప్పు – 1 చిన్న బౌల్
బియ్యం – పావు బౌల్
సగ్గుబియ్యం – పావు బౌల్
బెల్లం – 1.5 నుండి 2 బౌల్స్
నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి
పచ్చ కర్పూరం, కుంకుమపువ్వు (ఆప్షనల్)
తయారీ విధానం..
శెనగపప్పు, బియ్యంను విడివిడిగా ఒక గంట పాటు నానబెట్టాలి. సగ్గుబియ్యాన్ని 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. నానబెట్టిన బియ్యాన్ని మిక్సీలో వేసి రవ్వలా (కొంచెం బరకగా) గ్రైండ్ చేసుకోవాలి. కడాయిలో 8 కప్పుల నీళ్లు పోసి, నానబెట్టిన శెనగపప్పు, సగ్గుబియ్యం వేసి మెత్తగా ఉడికించాలి. పప్పు ఉడికాక, గ్రైండ్ చేసిన బియ్యం రవ్వను కొద్దిగా నీళ్లలో కలిపి (ఉండలు కట్టకుండా) పాయసంలో వేసి ఉడికించాలి. రవ్వ ఉడికిన తర్వాత బెల్లం తురుము వేసి బాగా కలపాలి. చివరగా నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్, ముఖ్యంగా ఎండు కొబ్బరి ముక్కలను వేయించి పాయసంలో కలిపితే అద్భుతమైన రుచి వస్తుంది.
ప్రయోజనాలు ఇవే..
* పచ్చి శెనగపప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కండరాల పెరుగుదలకు, కణాల మరమ్మతుకు, శరీరానికి అవసరమైన బలాన్ని ఇవ్వడానికి తోడ్పడుతుంది.
* ఈ పాయసంలో పంచదారకు బదులు మనం బెల్లాన్ని వాడుతున్నాం. బెల్లం ఒక అద్భుతమైన ఐరన్ (ఇనుము) వనరు. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, రక్తహీనత వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
* శెనగపప్పు, సగ్గుబియ్యం రెండింటిలోనూ కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచడానికి, కీళ్ల నొప్పులను నివారించడానికి సహాయపడతాయి.
* బియ్యం రవ్వ, సగ్గుబియ్యం తేలికగా జీర్ణమవుతాయి. ఇవి కడుపులో మంటను తగ్గించి, జీర్ణవ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతాయి. ముఖ్యంగా వేసవిలో శరీరానికి చలువ చేయడానికి ఇది ఒక మంచి ఆహారం.
* శెనగపప్పులో పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉంటుంది, ఇది మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే బియ్యం రవ్వలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణమే పని చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.
* పచ్చి శెనగపప్పులో పొటాషియం ఉండటం వల్ల ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే నెయ్యిలో వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు శరీరానికి అవసరమైన మంచి కొవ్వులను అందిస్తాయి.
ఆరోగ్యంతో పాటు అమ్మమ్మల కాలం నాటి ఆ రుచిని ఆస్వాదించాలంటే, తప్పకుండా మీకు సమయం ఉన్నప్పుడు ఈ శెనగబేడల పాయసాన్ని ఒకసారి మీ ఇంట్లో ప్రయత్నించండి.. కచ్చితంగా ఇది మీ ఇంటిల్లిపాదికి నచ్చుతుంది.
READ ALSO: Saggubiyyam Payasam: పంచదార అక్కర్లేదు.. ఎండలకి చలవ చేసే ‘హెల్దీ’ పాయసం ఇలా సింపుల్గా చేసుకోండి!
తాజావార్తలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!