UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- ముంబై, కోల్కతా నీట మునిగే ప్రమాదం
- 1.4 కోట్ల మందికి ముప్పు!
- హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై, కోల్కతా నగరాలను ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈ రెండు నగరాలకు సముద్ర మట్టాలతో పెను ముప్పు పొంచి ఉందని వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతుండటంతో ఈ ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. సముద్ర మట్టం పెరుగుదల కారణంగా లోతట్టు ప్రాంతాలు శాశ్వతంగా నీట మునిగే ప్రమాదం ఉందని.. దీంతో లక్షలాది కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయే పరిస్థితి తలెత్తవచ్చని పేర్కొంది. ముఖ్యంగా దక్షిణాసియాలోని లోతట్టు డెల్టా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపింది.

Also Read
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
- High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
- Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
- PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి సోమవారం విడుదల చేసిన ‘Challenges related to sea level rise and ways and approaches to address it’ నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. సముద్ర మట్టాల పెరుగుదల భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పు మాత్రమే కాదని.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, మౌలిక వసతులు, అత్యవసర సేవలపై ప్రభావం చూపుతోందని నివేదిక స్పష్టం చేసింది.
ముంబై, కోల్కతాకు పెరుగుతున్న ముప్పు
దక్షిణాసియాలోని లోతట్టు డెల్టా ప్రాంతాల్లో సముద్ర మట్టాల పెరుగుదల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి తెలిపింది. భారత్లోని ముంబై, కోల్కతా, బంగ్లాదేశ్లోని ఢాకా నగరాలు ప్రజల భారీ స్థాయి వలసలకు గురయ్యే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ఉన్నాయని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో 1.4 కోట్ల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను శాశ్వతంగా నీట మునిగిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని నివేదిక వెల్లడించింది.
ఆస్తుల కంటే మానవ నష్టమే పెద్ద సమస్య
సముద్ర మట్టాల పెరుగుదల ప్రభావం ప్రాంతాన్ని బట్టి మారుతుందని యూఎన్ తెలిపింది. అమెరికాలోని మియామి, న్యూయార్క్, చైనాలోని గ్వాంగ్జౌ వంటి సంపన్న తీర నగరాల్లో భారీగా ఆస్తులు, మౌలిక వసతులు ముప్పులో ఉన్నాయని పేర్కొంది. ఈ నగరాల్లో సుమారు 2 ట్రిలియన్ నుంచి 3.5 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు వరద ముప్పును ఎదుర్కొంటున్నట్లు అంచనా వేసింది. అయితే దక్షిణాసియాలో ప్రధాన ఆందోళన ఆర్థిక నష్టం కంటే మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులు కావడం అని యూఎన్ స్పష్టం చేసింది. సముద్ర మట్టం పెరుగుదలను అంచనా వేసేటప్పుడు ఆస్తుల నష్టంతో పాటు మానవ ప్రాణాలు, ఇళ్లను కోల్పోవడం, ప్రజల వలసలను కూడా సమాన ప్రాధాన్యంతో చూడాలని సూచించింది.
రోడ్లు, నీటి వ్యవస్థలపైనా ప్రభావం
సముద్ర మట్టాలు పెరగడం ఇప్పటికే రోడ్లు, భవనాలు, రవాణా వ్యవస్థలు, ఇంధన నెట్వర్క్లు, నీటి సరఫరా వ్యవస్థలు, భూగర్భ జల వనరులపై ప్రభావం చూపుతోందని నివేదిక పేర్కొంది. ఇది దీర్ఘకాలిక అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వంపైనా ఒత్తిడి పెంచుతోందని తెలిపింది. తీర ప్రాంతాల్లో సముద్ర మట్టం పెరగడంతో పాటు భూమి కుంగిపోవడం (Land Subsidence) కూడా చోటుచేసుకుంటే ముప్పు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని యూఎన్ హెచ్చరించింది.
తాగునీరు, ఆరోగ్యం, జీవనోపాధికి ముప్పు
సముద్ర మట్టం పెరుగుదల ప్రజారోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని యూఎన్ నివేదిక హెచ్చరించింది. వరదల కారణంగా పారిశుద్ధ్య, వైద్య మౌలిక వసతులు దెబ్బతినవచ్చు. నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పు పెరగడంతో పాటు గాయాలు, మరణాల ప్రమాదం కూడా ఎక్కువ కావచ్చని తెలిపింది. తరచూ వరదలు రావడం, ఇళ్లను కోల్పోవడం, ప్రాంతాల నుంచి ప్రజలు తరలిపోవడం, జీవనోపాధి దెబ్బతినడం వంటి కారణాలతో మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు సముద్రపు ఉప్పునీరు భూభాగంలోకి మరింతగా చొచ్చుకురావడం వల్ల మంచినీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. బావుల్లోని నీరు, వ్యవసాయ భూముల్లో ఉప్పుతనం పెరిగితే తాగునీరు, వ్యవసాయం, సాగునీటి వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లవచ్చని యూఎన్ తెలిపింది.
తుఫానుల సమయంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. సముద్రపు నీరు నదులు, భూగర్భ జలాలు, ఇతర మంచినీటి వనరుల్లోకి చొచ్చుకెళ్లే అవకాశం ఉంది. దీంతో మత్స్యకారులు, పర్యాటకం, నౌకాశ్రయాలపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది.
వేగంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు
మానవ కార్యకలాపాల కారణంగా ఏర్పడుతున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమానీనదాలు కరగడం, సముద్రాలు వేడెక్కడం వంటి పరిణామాలు సముద్ర మట్టాల పెరుగుదలకు ప్రధాన కారణాలని యూఎన్ తెలిపింది. 2014 నుంచి 2023 మధ్య ప్రపంచ సముద్ర మట్టాలు సగటున ఏడాదికి 4.7 మిల్లీమీటర్ల చొప్పున పెరిగాయి. 2024లో ఈ పెరుగుదల 5.9 మిల్లీమీటర్లకు చేరుకుంది. అత్యంత వేడిగా ఉన్న సముద్రాల కారణంగా ఇది కొత్త రికార్డుగా నమోదైందని నివేదిక పేర్కొంది. ఇప్పటికే వాతావరణ వ్యవస్థలో పేరుకుపోయిన వేడి కారణంగా 2050 వరకు సముద్ర మట్టాలు పెరుగుతూనే ఉంటాయని యూఎన్ అంచనా వేసింది.
77 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రమాదంలో
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 77 కోట్ల మంది ప్రజలు… అంటే ప్రపంచ జనాభాలో సుమారు 10 శాతం మంది. అధిక ఆటుపోటు రేఖకు ఐదు మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న తీర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరు సముద్ర మట్టాల పెరుగుదలకు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని యూఎన్ తెలిపింది. సముద్ర మట్టం పెరుగుదల ప్రభావాలను పూర్తిగా ఆపడం సాధ్యం కాకపోవడంతో ముందస్తు చర్యలు అత్యంత కీలకమని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. ప్రభుత్వాలు దీర్ఘకాలిక అనుసరణ ప్రణాళికలు రూపొందించడం, నమ్మకమైన వాతావరణ డేటాను ఉపయోగించడం, మౌలిక వసతులను బలోపేతం చేయడం, తగిన నిధులను సమకూర్చుకోవాలని సూచించింది.
అలాగే నదీ పరీవాహక ప్రాంతాలు, మంచినీటి వ్యవస్థలు, తీర ప్రాంతాలు, సముద్రాల మధ్య సమన్వయంతో భూ వినియోగం, నియంత్రణ ప్రణాళికలు రూపొందించాలని సూచించింది. ముఖ్యంగా వాతావరణ మార్పులకు అత్యంత సున్నితంగా ఉన్న ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వాలు వేగంగా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది.
తాజావార్తలు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
-
High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!