సాధారణంగా బ్రెడ్ అంటే మైదా, ఈస్ట్ వంటి పదార్థాలతో చేస్తారని, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదని చాలామంది భావిస్తుంటారు. కానీ, పాల కంటే మూడు రెట్లు ఎక్కువ క్యాల్షియం కలిగిన రాగులతో, ఎటువంటి రసాయనాలు లేకుండా బ్రెడ్ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? రాగిలో ఫైబర్, ఐరన్, అమైనో యాసిడ్స్ , యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. గ్లూటెన్ లేని రాగి పిండితో బ్రెడ్ మెత్తగా రావడం కోసం ఇందులో మనం ‘ఇసబ్గోల్’ (Psyllium Husk) ఉపయోగిస్తాం. ఇది గ్లూటెన్ చేసే పనిని చేస్తూ బ్రెడ్కు మంచి ఆకృతిని ఇస్తుంది.
కావాల్సిన పదార్థాలు:
తయారీ విధానం:
1. ఇసబ్గోల్ జెల్ తయారీ:
ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఇసబ్గోల్ను అర కప్పు నీటిలో కలిపి 5-7 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇది కాసేపటికి జిగురులాంటి (Gel) పదార్థంగా మారుతుంది. ఇది బ్రెడ్ ముక్కలు విడిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది.
2. పిండి మిశ్రమం:
ఒక గిన్నెలో రాగి పిండి, ఓట్స్ పౌడర్, ఉప్పు , బెల్లం పొడి వేసి బాగా కలపాలి. అందులో పెరుగు, ముందుగా సిద్ధం చేసుకున్న ఇసబ్గోల్ జెల్ , మిగిలిన నీటిని పోసి మెత్తని బ్యాటర్లా (Loose batter) కలుపుకోవాలి. చివరగా నూనె వేసి మరోసారి కలపాలి.
3. బేకింగ్ కోసం సిద్ధం:
ఇప్పుడు ఈ మిశ్రమంలో ఈనో , నిమ్మరసం వేయాలి. ఇవి వేయగానే బ్యాటర్ ఉబ్బి తేలికగా మారుతుంది. వెంటనే ఈ మిశ్రమాన్ని నూనె రాసిన బ్రెడ్ టిన్ (Loaf tin) లోకి మార్చుకోవాలి.
4. బేకింగ్ సమయం:
ఓవెన్ను 180°C వద్ద ఉంచి, 30 నుండి 35 నిమిషాల పాటు బేక్ చేయాలి. బ్రెడ్ ఉడికిన తర్వాత బయటకు తీసి కనీసం 20 నిమిషాల పాటు పూర్తిగా చల్లారనివ్వాలి.
పూర్తిగా చల్లారిన తర్వాత బ్రెడ్ను స్లైస్లుగా కోసుకుంటే ఎంతో రుచికరమైన, పోషక విలువలున్న రాగి బ్రెడ్ సిద్ధం. దీనిని బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు. మైదా బ్రెడ్ ఇచ్చే అనారోగ్య భయం లేకుండా, ఇంటిల్లిపాదీ ఈ హెల్తీ రాగి బ్రెడ్ను ఎంజాయ్ చేయవచ్చు..