Swiggy: దేశంలో ప్రతీ సెకన్కి 2.5 బిర్యానీ ఆర్డర్లు.. తగ్గేది లేదంటున్న హైదరాబాదీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swiggy: బిర్యానీ అంటే ఒక్క హైదరాబాద్ లోనే కాదు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉందని స్విగ్గీ తన వార్షిక అమ్మకాల నివేదికలో తెలిపింది. 2023లో దేశవ్యాప్తంగా ప్రతీ సెకనుకు 2.5 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. ప్రతీ 5.5 చికెన్ బిర్యానీలకు ఒక వెజ్ బిర్యానీ ఉందని తెలిపింది. ఇక హైదరాబాదీలు బిర్యానీ ఆర్డర్లలో తగ్గేదే లేదంటున్నారు. భాగ్యనగరంతో పాటు చెన్నై, ఢిల్లీల్లో ఎక్కువగా చికెన్ బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. ఈ మూడు నగరాల్లో 10,000 కంటే ఎక్కువ ఆర్డర్లు చేసిన వినియోగదారులు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. మొత్తంగా 2023లో ఎక్కువగా వచ్చిన ఆర్డర్లలో బిర్యానీనే టాప్ ప్లేసులో ఉన్నట్లు చెప్పింది.
ప్రతీ 6 ఆర్డర్లలో ఒక ఆర్డర్ హైదరాబాద్ నుంచే వచ్చినట్లు తెలిపింది. హైదరాబాద్కి చెందిన ఓ వ్యక్తి ఏడాది పొడవున 1633 బిర్యానీలు ఆర్డర్ చేసి ‘బిర్యానీ బ్రిగేడ్’ విజేతగా నిలిచారని చెప్పింది. ఈ లెక్కన రోజుకు అతను 4 బిర్యానీలను ఆర్డర్ చేశాడు. దీంతో పాటు ముంబైకి చెందిన ఓ వ్యక్తి రూ. 42.3 లక్షల విలువైన ఆర్డర్స్ చేశారని వెల్లడించింది. ప్రతీ ఏడాది జనవరి-నవంబర్ మధ్య అమ్మకాల స్విగ్గీ ప్లాట్ఫారమ్లో ఫుడ్ ఆర్డర్లు డేటా ఆధారంగా ఈ నివేదికను విడుదల చేసింది. జనవరి 1 ఒక్క రోజునే ఏకంగా 4,30,000 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. వరసగా 8వ సంవత్సరం కూడా బిర్యానీనే ఆర్డర్లలో తొలిస్థానంలో నిలిచింది.
Also Read
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
- Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
Read Also: China: లడఖ్పై చైనా వక్రబుద్ధి.. మా భూభాగమే అంటూ అవాకులు..
పండగ సమయాల్లో ఆర్డర్ల విషయానికి వస్తే.. దుర్గాపూజ సమయంలో ఎక్కువగా గులాబ్ జామూన్ ఆర్డర్లు వచ్చాయని, ఆ సమయంలో 7.7 మిలియన్ల ఆర్డర్లతో రసగుల్లాను మించిపోయాయని తెలిపింది. నవరాత్రి సమయంలోని తొమ్మిది రోజుల్లో వెజ్ ఆర్డర్లలో మసాలా దోశ అత్యధిక ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. బెంగళూర్ నగరాన్ని ‘‘కేక్ క్యాపిటల్’’ గా అభివర్ణించింది, ఈ నగరంలో నుంచి చాక్లెట్ కేక్ కోసం 8.5 మిలియన్ల ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది. 2023, వాలెంటైన్స్ డే సమయంలో భారతదేశంలో నిమిషానికి 271 కేకుల ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. నాగ్పూర్ కి చెందిన ఒక వినియోగదారుడు ఒకే రోజులో 92 కేకుల్ని ఆర్డర్ చేశాని తెలిపింది.
తాజావార్తలు
-
Diesel: డీజిల్ కొరత, ధరల పెరుగుదల వేళ శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన
-
Astrology: మే 22 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనూహ్య ఫలితాలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!