Health Tips: టైంకి తినకపోతే ఏమవుతుందో తెలుసా? ఓ లుక్ వేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Tips: టైంకి తింటున్నారా లేదా.. ఎందుకైనా మంచింది ఇప్పటి నుంచి టైంకి తినడం అలవాటు చేసుకోండి. ఈ మధ్య కాలంలో సిటీలో అర్ధరాత్రి పూట తినడం చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది. మీకు తెలుసా రాత్రిళ్లు వీలైనంత తక్కువగా, లైట్ ఫుడ్ తీసుకోవాలని చాలా మంది వైద్య నిపుణులు చెబుతున్నారు. అది కూడా ఏడు లోపే ముగించాలని మరీమరీ చెప్తున్నారు.
READ ALSO: Sony Liv : 2025లో అదిరిపోయే కంటెంట్ రెడీ చేసిన ‘సోనీ లివ్’
Also Read
- Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ 'పాలక్ పరోటా'.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో 'గోంగూర పులిహోర'.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
- Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!
- Ragi Bellam Ariselu: పిల్లల ఎముకల బలానికి ఈ ఒక్క స్వీట్ చాలు.. సింపుల్గా ఇలా చేసేయండి!
అన్నీ లేట్ అవుతాయ్ జాగ్రత్త..
రాత్రిళ్లు లేట్గా తినడం వల్ల నిద్ర లేట్ పడుతుంది. దీంతో పొద్దున్నే మెలకువ లేట్గా వస్తుంది. దాంతో లంచ్ టైంకు సరిగా ఆకలేయదు. అలా లంచ్ టైం కూడా ముందుకు జరుగుతుంది. ఈ మార్పులన్నీ తెలియకుండానే శరీరంలో జరిగిపోతాయి. చూశారా రాత్రి లేట్గా తినడం అనే ఒక్క అలవాటు ఎన్ని సమస్యలకు కారణం అవుతుందో. మీకు తెలుసా శరీరంలో కూడా అంతే… శరీరంలో ఒక కనిపించని క్లాక్ ఉంది. రోజూ తినే టైం, పడుకునే టైంను ఈ గడియం క్యాలిక్యులేట్ చేస్తూ.. దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతుంది. చిన్నప్పుడు అన్ని సరైన సమయానికి అవుతుండేవి.. కానీ పెద్దయ్యే కొద్దీ లైఫ్ స్టైల్లో మార్పులు రావడంతో శరీరంలోని టైం టేబుల్ కాక కన్ఫ్యూజ్ అవుతుంది. దీంతో బాడీ బ్యాలెన్స్ తప్పి అనేక సమస్యలు వస్తున్నాయి..
రాత్రి ఏడు గంటలలోపే తినడం వల్ల బరువు పెరగడం, గుండె సమస్యలు, నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఉదయం నిద్ర లేచిన గంట రెండు గంటల్లోపు అంటే 8, 9 గంటలకు బ్రేక్ ఫాస్ట్, రాత్రి ఏడు లోపు భోజనం తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ సమయాల్లో ఎన్ని క్యాలరీలు తీసుకున్నా అంతగా నష్టం ఉండదు. బరువు పెరగడం.. పొట్ట రావడం లాంటి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. రోజు మొత్తంలో చేసే భోజనంలో బ్రేక్ఫాస్టే ముఖ్యమైంది. రాత్రి భోజనం లైట్గా, తేలికగా జీర్ణయమ్యేలా ఉండాలంటున్నారు నిపుణులు. తిండి సరైన సమయంలో తీసుకుంటే పోషకాహార లోపం రాదని, రక్తహీనత, అజీర్తి, గుండెలో మంట, కడుపులో నొప్పి, ఎముకలు, కండరాల సమస్యల నుంచి కూడా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
READ ALSO: Tejas Mk-1A: అక్టోబర్లో నింగిలోకి తేజస్ మార్క్.. ఇక శత్రు దేశాలకు వణుకే..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
IPL Playoffs Scenarios: ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం.. ఆర్ఆర్ కంటే సీఎస్కేకు ఛాన్సెస్.. ఆ 3 జట్లకు మాత్రం!
-
Telangana Liquor Shop Scam: “పేరు దళితులది.. దందా సిండికేట్లది”.. లిక్కర్ షాపుల్లో బినామీల గుట్టురట్టు
-
S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
-
CM Revanth Reddy: “ఏ సమస్య వచ్చినా కలెక్టర్లదే బాధ్యత”.. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కీలక ఆదేశాలు..
-
Virat Kohli: కోహ్లీ విమర్శలను పట్టించుకోడనేది అబద్దం.. సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..