Diabetes: కోవిడ్ తర్వాత దేశంలో భారీగా పెరుగుతున్న షుగర్ వ్యాధి..
- NFHS-6 నివేదికలో డయాబెటిస్, ఊబకాయం కేసులు భారీగా పెరిగినట్లు వెల్లడి.
- పురుషుల్లో మధుమేహం 15.6% నుంచి 20.9%కు పెరుగుదల.
- మహిళల్లో డయాబెటిస్ రేటు 13.5% నుంచి 17.8%కు చేరిక.
- పట్టణ ప్రాంతాల్లో ఊబకాయం సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నట్లు సర్వే గుర్తింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diabetes: కోవిడ్-19 మహమ్మారి తర్వాత భారతీయుల్లో ‘‘మెటాబాలిజం’’ వల్ల వచ్చే వ్యాధులు పెరుగుతున్నాయి. ఇంట్లో ఎక్కువ సమయం గడపడం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు పెరగడం సమస్యను పెంచుతున్నాయి. ఊబకాయం, మధుమేహం(డయాబెటిస్) వంటి జీవనశైలి ఆరోగ్య సమస్యలు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6 (NFHS-6) నివేదిక వెల్లడించింది. 2023-24 కాలంలో నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా సుమారు 6.79 లక్షల కుటుంబాలు పాల్గొన్నాయి. మణిపూర్ మినహా దేశవ్యాప్తంగా 715 జిల్లాలను సర్వే కవర్ చేసింది.
పురుషుల్లో పెరిగిన షుగర్ వ్యాధి:
15 ఏళ్లకు పైబడిన పురుషుల్లో డయాబెటిస్ కేసులు గణనీయంగా పెరిగాయి. రక్తంలో చక్కెర స్థాయిలు 141mg/dl కంటే ఎక్కువగా ఉన్నవారిని లేదా డయాబెటిస్ మందులు తీసుకుంటున్నవారిని ఈ గణాంకాల్లో పరిగణించారు. 2019-20 నివేదికలో పురుషుల్లో డయాబెటిస్ 15.6 శాతంగా ఉండగా, NFHS-6లో అది 20.9 శాతానికి పెరిగింది. దేశంలో 15 ఏళ్లకు పూబడిన పురుషులు 56 కోట్ల మంది ఉంటే వీరిలో 11.7 కోట్ల మంది డయాబెటిస్తో బాధపడుతున్నారని వెల్లడైంది. 2021లో ఇది 8.7 కోట్లుగా ఉండేది.
Also Read
- Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
- Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా 'కారపన్నం' చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Weight Loss Side Effects: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..?.. ఈ 7 తప్పులను మాత్రం చేయొద్దు
- Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
మహిళల్లో కూడా మధుమేహం సమస్య పెరుగుతోంది. NFHS-5లో 13.5 శాతం ఉన్న మధుమేహం, ప్రస్తుతం 17.8 శాతానికి చేరుకుంది. మూడేళ్ల క్రితం 5.4 కోట్ల మంది మహిళలు డయాబెటిస్తో బాధపడుతుండగా, ఇప్పుడు ఆసంఖ్య 7.12 కోట్లకు పెరిగింది.
ఊబకాయం మరో సమస్య:
మధుమేహంతో పాటు మధుమేహానికి ప్రారంభ కారణాల్లో ఒకటైన ఊబకాయం కూడా వేగంగా పెరుగుతోంది. 15-49 ఏళ్ల మహిళల్లో అధిక బరువు, ఊబకాయం సమస్య 24 శాతం నుంచి 30.7 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. పట్టణాల్లో 42.8 శాతం మహిళలు అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 25.5 శాతంగా నమోదైంది. పురుషుల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. 2019-20లో 22.9 శాతం ఉన్న అధిక బరువు, ఊబకాయం రేటు 2023-24లో 27.3 శాతానికి చేరుకుంది. పట్టణాల్లో 36.3 శాతం మంది పురుషులు, గ్రామీణ ప్రాంతాల్లో 23 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు సర్వే తెలిపింది.
తాజావార్తలు
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
-
Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?