భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనేక రకాల జబ్బులు పలకరిస్తుంటాయి. జ్వరం, దగ్గు, జలుబు మాత్రమే కాదు వర్షాకాలంలో కండ్ల కలక కూడా సమస్యగా మారింది.. ఐ ఫ్లూ కరోనాలా అంటువ్యాధిగా మారుతోంది. ఇంట్లో ఒకరికి సోకినప్పుడు మొత్తం కుటుంబంలో సంక్రమణ వ్యాప్తి చెందుతుంది. పాఠశాలలో పిల్లల నుండి ఒకరికొకరు సంక్రమణ వ్యాప్తి చెందుతుంది. తాజా లెక్కల ప్రకారం ఈ సారి రోగి నుంచి ఐదు నుంచి ఎనిమిది మందికి వ్యాధి సోకుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వ్యాధి నయం కావడానికి ఎనిమిది నుంచి 10 రోజులు పడుతోంది..
ఈ వ్యాధి లక్షణాలు..?
కళ్ళు ఎర్రగా వాపు, దురదతో పాటు నీళ్ళు కారడం జరుగుతుంది. కళ్ల నుంచి నీరు రావడంతో వ్యాధి ఇతరులకు వ్యాపిస్తోంది.
కరోనా కరోనా కన్నా వేగంగా ఈసారి ఐ ఫ్లూ కూడా ఎక్కువగా వ్యాపిస్తోందని వైడీలు చెప్తున్నారు. ఇంతకుముందు ఒక పేషెంట్ నుంచి ఇద్దరు నుంచి ముగ్గురికి సోకుతుండగా, ఈసారి ఐదు నుంచి ఎనిమిది మందికి సోకుతోంది. కంటి ఫ్లూ ఉన్న వ్యక్తిని ఒంటరిగా ఉంచాలని, అతనికి సంబందించిన వస్తువులను ముట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు..
ఈ వ్యాధి వస్తే ఏం చెయ్యాలో.. ఏం చెయ్యకూడదో తెలుసుకుందాం..
వ్యాధి వస్తే..
సొంతంగా వైద్యం చెయ్యకూడదు..
ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో చేతులు ఇవ్వరాదు..
మీరు వాడుకున్న టవల్స్, దుప్పట్లు వాడిన ఎ వస్తువులు ఇతరులకు ఇవ్వరాదు..
ఈ వ్యాధి సోకిన పిల్లలను అస్సలు స్కూల్ కు పంపించారదు..
వ్యాధి రాకుండా..
ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి..
కళ్ల అద్దాలు పెట్టుకోవాలి..
ఇతరులను అస్సలు తాకరాదు..
లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడును సంప్రదించాలి..