Bank of Baroda Apprentice Recruitment 2025: డిగ్రీ పాసైతే చాలు.. 4000 బ్యాంక్ జాబ్స్ రెడీ.. మిస్ చేసుకోకండి
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో 4000 అప్రెంటిస్షిప్ పోస్టులు
- డిగ్రీ పాసైతే చాలు
- దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 11
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంకు ఉద్యోగాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. బ్యాంక్ జాబ్స్ కోసం ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతుంటారు. మరి మీరు కూడా బ్యాంక్ జాబ్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంకు ఉద్యోగం సంపాదించాలని కలలు కంటున్న యువతకు బ్యాంక్ ఆఫ్ బరోడా తీపికబురును అందించింది. అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 4000 పోస్టులను భర్తీచేయనున్నారు. మొత్తం పోస్టుల్లో తెలంగాణలో 193, ఆంధ్రప్రదేశ్ లో 59 పోస్టులు భర్తీకానున్నాయి. డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నవారికి ఇదే మంచి ఛాన్స్.
Also Read:Tesla Cars : నిరీక్షణకు తెర.. ఏప్రిల్ నుంచి భారత్ లో పరిగెత్తనున్న టెస్లా కార్లు.. ధర చాలా ఛీప్
Also Read
- Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి ఏదైనా స్ట్రీమ్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల కనీస వయస్సు 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు, గరిష్ట వయస్సు 28 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాష పరీక్ష తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Also Read:YS Jagan: ఓ ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తే.. కనీసం పోలీస్ భద్రత కూడా సీఎం ఇవ్వలేదు!
ఎంపికైన వారికి మెట్రో/అర్బన్ ఏరియాలో రూ. 15 వేలు, రూరల్/సెమీ అర్భన్ ఏరియలో రూ. 12 వేలు చెల్లిస్తారు. జనరల్, OBC, EWS కేటగిరీ అభ్యర్థులు రూ. 800 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.600, పిడబ్ల్యుబిడి కేటగిరీ అభ్యర్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఈరోజు అంటే ఫిబ్రవరి 19న ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు మార్చి 11 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!