Govt Jobs: ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఏటా నిరుద్యోగుల సమస్యలు పెరుగుతున్నాయి.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త ఉద్యోగాలను విడుదల చెయ్యడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తులను స్వీకరిస్తుంది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్ (గ్రూప్ A) పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది..అభ్యర్థులు QCI అధికారిక వెబ్సైట్ qcin.orgలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇందుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 14న ప్రారంభమై ఆగస్టు 4న ముగుస్తుంది.. ఈ పోస్టులకు అడ్మిట్ కార్డులను 14 ఆగస్టు న విడుదల చెయ్యనున్నారు..
ఈ పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ 3న జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ అక్టోబర్ 1న నిర్వహిస్తారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 553 ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది..పోస్టుల వివరాలు..
బయో-టెక్నాలజీలో 50,
బయో-కెమిస్ట్రీలో 20,
ఫుడ్ టెక్నాలజీలో 15,
కెమిస్ట్రీలో 56,
పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 9,
బయో-మెడికల్ ఇంజనీరింగ్లో 53,
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్లో 108,
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 29,
కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 63, ఫిజిక్స్లో 30,
సివిల్ ఇంజనీరింగ్లో 9,
మెకానికల్ ఇంజనీరింగ్లో 99,
మెటలర్జికల్ ఇంజనీరింగ్లో 4,
టెక్స్టైల్ ఇంజనీరింగ్లో 8 ఉన్నాయి..
అభ్యర్థులు కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ను సమర్పించే చివరి తేదీ నాటికి 35 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్, OBC వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.1,000 ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, PwD/ దివ్యాంగులు (PH), అలాగే అన్ని వర్గాల మహిళలు రూ.500 రూపాయలు చెల్లించాలి..
Also Read
- Infosys Recruitment: ఇన్ఫోసిస్లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
- CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన 'అవ్ని కేజ్రీవాల్'.!
- Neet Re Exam: పేపర్ లీక్ చేస్తే 'క్షమాపణ'.. గేటు దాటకపోతే 'బలిపశువా'..?
- SSC CGL 2026: ఎస్ఎస్సీ సీజీఎల్ 12,256 పోస్టులు.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి
ఇకపోతే అభ్యర్థులు మూడు ఫేజ్ల్లో నిర్వహించే టెస్టులు క్లియర్ చేయాల్సి ఉంటుంది. వాటిలో ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఉంటాయి. అభ్యర్థులు ముందు ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 30% మార్కులు సాధిస్తేనే ఈ ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతారు. OBC/EWS కేటగిరీ అభ్యర్థులు 25%, అన్ని ఇతర వర్గాల అభ్యర్థులు కనీసం 20% స్కోర్ చేయాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్ను ఇంగ్లిష్ లో మాత్రమే నిర్వహిస్తారు..ఎంపికైన అభ్యర్థులు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు జీతం పొందుతారు.. ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
Vivo X Fold 6: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 6 విడుదల.. ఫోల్డబుల్ ఫోన్లలో కొత్త బెంచ్మార్క్
-
TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
-
CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
-
Maa Inti Bangaram: వైజాగ్ సక్సెస్ మీట్లో బిగ్ సర్ప్రైజ్.. ‘మా ఇంటి బంగారం 2’ అధికారికంగా ప్రకటించిన రాజ్
-
US Airstrikes on Iran: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!