Govt Jobs: ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఏటా నిరుద్యోగుల సమస్యలు పెరుగుతున్నాయి.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త ఉద్యోగాలను విడుదల చెయ్యడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తులను స్వీకరిస్తుంది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్ (గ్రూప్ A) పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది..అభ్యర్థులు QCI అధికారిక వెబ్సైట్ qcin.orgలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇందుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 14న ప్రారంభమై ఆగస్టు 4న ముగుస్తుంది.. ఈ పోస్టులకు అడ్మిట్ కార్డులను 14 ఆగస్టు న విడుదల చెయ్యనున్నారు..
ఈ పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ 3న జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ అక్టోబర్ 1న నిర్వహిస్తారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 553 ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది..పోస్టుల వివరాలు..
బయో-టెక్నాలజీలో 50,
బయో-కెమిస్ట్రీలో 20,
ఫుడ్ టెక్నాలజీలో 15,
కెమిస్ట్రీలో 56,
పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 9,
బయో-మెడికల్ ఇంజనీరింగ్లో 53,
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్లో 108,
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 29,
కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 63, ఫిజిక్స్లో 30,
సివిల్ ఇంజనీరింగ్లో 9,
మెకానికల్ ఇంజనీరింగ్లో 99,
మెటలర్జికల్ ఇంజనీరింగ్లో 4,
టెక్స్టైల్ ఇంజనీరింగ్లో 8 ఉన్నాయి..
అభ్యర్థులు కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ను సమర్పించే చివరి తేదీ నాటికి 35 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్, OBC వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.1,000 ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, PwD/ దివ్యాంగులు (PH), అలాగే అన్ని వర్గాల మహిళలు రూ.500 రూపాయలు చెల్లించాలి..
Also Read
- Railway Recruitment 2026: రైల్వేలో 1,644 ఉద్యోగాలు.. టెన్త్ పాస్ అయితే చాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- UGC Net: యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..
- Union Bank Recruitment 2026: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1865 పోస్టులు.. మంచి జీతం
ఇకపోతే అభ్యర్థులు మూడు ఫేజ్ల్లో నిర్వహించే టెస్టులు క్లియర్ చేయాల్సి ఉంటుంది. వాటిలో ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఉంటాయి. అభ్యర్థులు ముందు ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 30% మార్కులు సాధిస్తేనే ఈ ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతారు. OBC/EWS కేటగిరీ అభ్యర్థులు 25%, అన్ని ఇతర వర్గాల అభ్యర్థులు కనీసం 20% స్కోర్ చేయాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్ను ఇంగ్లిష్ లో మాత్రమే నిర్వహిస్తారు..ఎంపికైన అభ్యర్థులు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు జీతం పొందుతారు.. ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
-
Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్తో సెల్ఫీ
-
Health Tips : రాత్రి పిండి.. ఉదయం రొట్టె..? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
-
Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?