Govt Jobs: ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?
ప్రతి ఏటా నిరుద్యోగుల సమస్యలు పెరుగుతున్నాయి.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త ఉద్యోగాలను విడుదల చెయ్యడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తులను స్వీకరిస్తుంది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్ (గ్రూప్ A) పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది..అభ్యర్థులు QCI అధికారిక వెబ్సైట్ qcin.orgలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇందుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 14న ప్రారంభమై ఆగస్టు 4న ముగుస్తుంది.. ఈ పోస్టులకు అడ్మిట్ కార్డులను 14 ఆగస్టు న విడుదల చెయ్యనున్నారు..
ఈ పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ 3న జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ అక్టోబర్ 1న నిర్వహిస్తారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 553 ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది..పోస్టుల వివరాలు..
బయో-టెక్నాలజీలో 50,
బయో-కెమిస్ట్రీలో 20,
ఫుడ్ టెక్నాలజీలో 15,
కెమిస్ట్రీలో 56,
పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 9,
బయో-మెడికల్ ఇంజనీరింగ్లో 53,
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్లో 108,
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 29,
కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 63, ఫిజిక్స్లో 30,
సివిల్ ఇంజనీరింగ్లో 9,
మెకానికల్ ఇంజనీరింగ్లో 99,
మెటలర్జికల్ ఇంజనీరింగ్లో 4,
టెక్స్టైల్ ఇంజనీరింగ్లో 8 ఉన్నాయి..
అభ్యర్థులు కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ను సమర్పించే చివరి తేదీ నాటికి 35 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్, OBC వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.1,000 ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, PwD/ దివ్యాంగులు (PH), అలాగే అన్ని వర్గాల మహిళలు రూ.500 రూపాయలు చెల్లించాలి..
Also Read
- HIGH COURT OF ANDHRA PRADESH: ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాలు.. రెండ్రోజులే ఛాన్స్.. త్వరగా అప్లై చేసుకోండి
- LIC HFL 2026: గ్రాడ్యుయేట్లకు అద్భుత అవకాశం.. ఎల్ఐసీలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్.. ఎలిజిబిలిటీ, శాలరీ వివరాలు
- CRPF Constable Recruitment 2026: గెట్ రెడీ.. 9175 కానిస్టేబుల్ పోస్టులు.. అర్హులు వీరే
- SSC Selection Post Phase 14: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 3000+ జాబ్స్.. 10th, 12th, డిగ్రీ పాసైతే చాలు
ఇకపోతే అభ్యర్థులు మూడు ఫేజ్ల్లో నిర్వహించే టెస్టులు క్లియర్ చేయాల్సి ఉంటుంది. వాటిలో ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఉంటాయి. అభ్యర్థులు ముందు ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 30% మార్కులు సాధిస్తేనే ఈ ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతారు. OBC/EWS కేటగిరీ అభ్యర్థులు 25%, అన్ని ఇతర వర్గాల అభ్యర్థులు కనీసం 20% స్కోర్ చేయాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్ను ఇంగ్లిష్ లో మాత్రమే నిర్వహిస్తారు..ఎంపికైన అభ్యర్థులు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు జీతం పొందుతారు.. ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..
-
Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
-
West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
-
TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
-
Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!