EMRS Recruitment: నిరుద్యోగులకు శుభవార్త..4,602 పోస్టులకు ఉద్యోగాలు..జీతం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. దీనిలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.. మొత్తం 4,062 ఖాళీలను నోటిఫికేషన్లో ప్రకటించారు. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ కూడా యాక్టివ్ లో ఉంది. వీటిల్లో కొన్ని పోస్టులను అప్లై చేయడానికి చివరి తేదీ జూలై 30 కాగా.. మరికొన్ని పోస్టులకు ఆగస్టు 18 వరకూ సమయం ఉంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్లు: 2266 పోస్టులు
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 759 పోస్టులు
ల్యాబ్ అటెండెంట్: 373 పోస్టులు
అకౌంటెంట్: 361 పోస్టులు
ప్రిన్సిపాల్: 303 పోస్టులు
Also Read
- IBPS PO Recruitment 2026: బ్యాంకింగ్ కెరీర్కు గోల్డెన్ ఛాన్స్.. వేల సంఖ్యలో PO పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్..
- Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
- RRB Technician Recruitment 2026: రైల్వేలో 6,557 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవే
అర్హతలు: పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్లు(పీజీటీ)లకు మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి.
ప్రిన్సిపల్ పోస్ట్కి గుర్తింపు కలిగిన సంస్థ నుంచి మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ డిగ్రీ ఉండాలి. ఏదైనా సంస్థలో వైస్ ప్రిన్సిపాల్ గా కనీసం 12 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.ఒకవేళ పీజీటీ లేదా టీజీటీ అయితే కనీసం 4 ఏళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. ఇకపోతే ప్రిన్సిపల్ పోస్టుకి అప్లికేషన్ ఫీజు రూ. 2000, అలాగే పీజీటీకి రూ. 1500, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు రుసుము రూ. 1000 ఉంటుంది. అయితే ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు పొందుతారు.
ఎలా దరఖాస్తూ చేసుకోవాలంటే?
అభ్యర్థులు ముందుగా ఈఎంఆర్ఎస్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.. దానిలోని హోమ్ పేజీలో కెరీర్/నోటిఫికేషన్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి. ఈఎంఆర్ఎస్ రిక్రూట్ మెంట్ 2023 అప్లికేషన్ ఫారం ను పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్లను పూరించాలి. ఒకసారి వివరాలు అన్ని సరిచూసుకొని, పేమెంట్ చేయాలి.
కేటగిరీ వైజ్ గా సూచించిన మొత్తాన్ని ఫీజుగా చెల్లించాలి. అనంతరం సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకొని భద్రపరచుకోవాలని అధికారులు చెబుతున్నారు.. అప్లై చేసిన తర్వాత ఈఎంఆర్ఎస్ వెబ్ సైట్, అలాగే అప్లికేషన్ ఫారంలో ఇచ్చిన ఈ-మెయిల్ ఇన్ బాక్స్ ను తరచూ తనిఖీ చేస్తూ ఉండాలి..
ఇకపోతే ఇక్కడ సెలెక్ట్ అయిన వెంటనే పోస్టింగ్ ఇస్తారు..ఒక్కో పోస్ట్ కు ఒక్కో రకంగా జీతం ఇస్తారు..
1. ప్రిన్సిపాల్-లెవల్ 12(రూ.78,800 నుంచి రూ.2,09200)..
2. పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్లు(పీజీటీ)- లెవెల్ 8( రూ. 47,600 నుంచి రూ.1,151100)..
3. అకౌంటెంట్-లెవల్ 6(రూ. 35,400 నుంచి రూ. 112400)
4. జేఎస్ఏ- లెవెల్2(రూ. 19,900 నుంచి రూ. 63,200)
ల్యాబ్ అటెండెంట్- లెవెల్ 1(రూ. 18,000 నుంచి 56,900)..
ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలను అధికార వెబ్ సైట్ లో చూసి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Senior Star Heros : దసరా నెలలో ముగ్గురు సీనియర్ స్టార్స్ సినిమాలు
-
Ayatollah Khamenei: చనిపోయిన 4 నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. ఇన్నాళ్లు ఎక్కడ ఉంచారు.?
-
Srinivasa Mangapuram: జూలై 30న ‘శ్రీనివాస మంగాపురం’
-
RC 17: సుకుమార్ – దేవిశ్రీ కాంబోకి బ్రేక్.. నిజమేనా?
ట్రెండింగ్
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!