NTPC: ఎన్టీపీసీలో ఇంజనీరింగ్ జాబ్స్.. రాత పరీక్ష లేదు.. నెలకు 1.4 లక్షల జీతం
- ఎన్టీపీసీలో ఇంజనీరింగ్ జాబ్స్
- నెలకు 1.4 లక్షల జీతం
- రాత పరీక్ష లేదు
- అప్లికేషన్ కు చివరి తేదీ ఫిబ్రవరి 13
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. అది కూడా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈజీగా జాబ్ కొట్టొచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నట్లైతే మీకు ఇదే మంచి ఛాన్స్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 475 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. భర్తీ కానున్న పోస్టుల్లో ఎలక్ట్రికల్ 135, మెకానికల్ 180, ఎలక్ట్రానిక్స్/ఇన్ స్ట్రుమెంటేషన్ 85, సివిల్ 50, మైనింగ్ 25 పోస్టులున్నాయి.
ఈ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. SC/ST/PwBD అభ్యర్థులు 55 శాతం.. ఇతరులు కనీసం 65 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా గేట్(GATE 2024) పరీక్షకు హాజరై ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC/PWD/EBC అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థులు వారి గేట్-2024 స్కోరు ఆధారంగా షార్ట్లిస్ట్ చేయబడతారు.
Also Read
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
- SBI Apprentice Recruitment 2026: ఎస్బీఐలో 7150 పోస్టులు.. మంచి జీతం.. అర్హతలు, ఎంపిక పూర్తి వివరాలు
- RRB Technician 2026: నిరుద్యోగులకు గోల్డెన్ చాన్స్.. రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టులు.. దరఖాస్తు, అర్హత పూర్తి వివరాలు
షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఎంపికైన వారు నెలకు రూ.40వేల నుంచి 1.4 లక్షల వేతనం పొందుతారు. దరఖాస్తు ఫీజు జనరల్/ EWS/ ఓబీసీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. SC/ST/PwBD/Ex Servicemen/ మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 13 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!