NTPC: ఎన్టీపీసీలో ఇంజనీరింగ్ జాబ్స్.. రాత పరీక్ష లేదు.. నెలకు 1.4 లక్షల జీతం
- ఎన్టీపీసీలో ఇంజనీరింగ్ జాబ్స్
- నెలకు 1.4 లక్షల జీతం
- రాత పరీక్ష లేదు
- అప్లికేషన్ కు చివరి తేదీ ఫిబ్రవరి 13
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. అది కూడా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈజీగా జాబ్ కొట్టొచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నట్లైతే మీకు ఇదే మంచి ఛాన్స్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 475 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. భర్తీ కానున్న పోస్టుల్లో ఎలక్ట్రికల్ 135, మెకానికల్ 180, ఎలక్ట్రానిక్స్/ఇన్ స్ట్రుమెంటేషన్ 85, సివిల్ 50, మైనింగ్ 25 పోస్టులున్నాయి.
ఈ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. SC/ST/PwBD అభ్యర్థులు 55 శాతం.. ఇతరులు కనీసం 65 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా గేట్(GATE 2024) పరీక్షకు హాజరై ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC/PWD/EBC అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థులు వారి గేట్-2024 స్కోరు ఆధారంగా షార్ట్లిస్ట్ చేయబడతారు.
Also Read
- IBPS PO Recruitment 2026: బ్యాంకింగ్ కెరీర్కు గోల్డెన్ ఛాన్స్.. వేల సంఖ్యలో PO పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్..
- Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
- RRB Technician Recruitment 2026: రైల్వేలో 6,557 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవే
షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఎంపికైన వారు నెలకు రూ.40వేల నుంచి 1.4 లక్షల వేతనం పొందుతారు. దరఖాస్తు ఫీజు జనరల్/ EWS/ ఓబీసీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. SC/ST/PwBD/Ex Servicemen/ మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 13 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!