China Covid: భగ్గుమన్న షింజియాంగ్.. భారీ స్థాయిలో నిరసనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xinjiang People Protest Against Covid Restrictions: చైనాలో కరోనా కేసులు మళ్లీ విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. అక్కడి ప్రభుత్వం జీరో కొవిడ్ చర్యలను కఠినంగా పాటిస్తున్న విషయం తెలిసిందే! షింజియాంగ్లో లాక్డౌన్ విధించడంతో పాటు కఠిన ఆంక్షలు అమలు చేశారు. అయితే.. ఈ ఆంక్షలపై ఆ ప్రాంతం ఒక్కసారిగా భగ్గుమంది. కొవిడ్ లాక్డౌన్ ఎత్తివేయాలంటూ.. షింజియాంగ్ రాజధాని ఉర్ముచీలో పౌరులు భారీ నిరసనలకు దిగారు. గురువారం రాత్రి స్థానికంగా ఓ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగి.. దాదాపు 10 మంది మృతి చెందడం వల్లే, కరోనా ఆంక్షలకు వ్యతిరేకంగా పౌరులు నిరసనలు చేపట్టారు.
దానికితోడు.. కరోనా కఠిన ఆంక్షల వల్లే వాళ్లు బయటకు రాలేక, అగ్నికి ఆహుతి అయ్యారని ఆరోపణలు రావడంతో, పౌరులు మరింత ఆగ్రహానికి గురై ప్రదర్శనలకు దిగారు. పెద్దఎత్తున స్థానికులంతా గుమికూడి.. బారికేడ్లను దాటుకొని వీధుల్లో, ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసనలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే.. స్థానిక అధికారులు మాత్రం కరోనా ఆంక్షల వల్లే ఆ పది మంది అగ్నికి ఆహుతయ్యారన్న ఆరోపణల్ని ఖండిస్తున్నారు. ఆ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్న ఆయన.. ఇదే సమయంలో కరోనా ఆంక్షలపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో.. దశలవారీగా ఆంక్షలను ఎత్తేస్తామని హామీ ఇచ్చారు.
Also Read
- IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
- Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
- US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
- SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
కాగా.. ఉర్ముచీ నగరంలో దాదాపు 40 లక్షల జనాభా ఉన్నారు. ఆగస్టు నుంచే ఈ నగరం కొవిడ్ ఆంక్షల గుప్పెట్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆంక్షలను సడలిస్తున్నప్పటికీ.. చైనాలో మాత్రం జీరో కొవిడ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కఠిన లాక్డౌన్లు, క్వారంటైన్ నిబంధనలు అక్కడ అమలవుతన్నాయి. కొవిడ్ ఆంక్షల కారణంగా ఇటీవల ఇద్దరు చిన్నారులకు సకాలంలో వైద్యం అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కూడా చైనీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
-
UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి