Pakistan: పాకిస్తాన్లో మహిళల పరిస్థితి ఇది.. మహిళా దినోత్సవం రోజున ర్యాలీకి అనుమతి నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s Day March Banned In Lahore: తెల్లారిలేస్తే భారత్ లోని కాశ్మీర్ ప్రజల హక్కుల గురించి గగ్గోలు పెడుతుంది దాయాది దేశం పాకిస్తాన్. భారత్ మైనారిటీలను అణిచివేస్తోందంటూ పలు అంతర్జాతీయ వేదికపైనే మొసలి కన్నీరు కారుస్తుంటుంది. కానీ తన సొంత దేశంలోని మైనారిటీల పరిస్థితులను పట్టించుకోదు. ప్రతీ ఏటా హిందూ, సిక్కు అమ్మాయిలను మతం మార్చి, కిడ్నాపులు చేసి ముస్లింలు పెళ్లి చేసుకుంటున్నారు. దైవదూషణ పేరుతో అమాయకులను చంపేస్తున్నారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఏటా కొన్ని వందల మందిని పాక్ సైన్యం ఊచకోత కోస్తుంది. అయినా కూడా వీటి గురించి పాశ్చాత్య దేశాలు పెద్దగా పట్టించుకోవు. ఎప్పుడూ ఇండియాను దోషిగా నిలబెట్టేందుకే అభివృద్ధి చెందాం అని చెప్పుకునే వెస్ట్రన్ దేశాలు భారత్ పై అసత్య ఆరోపణలు చేస్తుంటాయి.
Read Also: Vada pav: “వడాపావ్”కు అరుదైన గుర్తింపు.. బెస్ట్ శాండ్విచ్ల జాబితాలో చోటు..
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో స్వేచ్ఛ అనే పదానికి పెద్దగా అర్థం లేదు. అక్కడ పేరుకే ప్రజాస్వామ్యం నడిచేదంతా సైన్యం పాలన. ఇక మహిళల హక్కులు, స్వేచ్ఛకు అక్కడ అవకాశమే లేదు. చివరకు అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజు కూడా మహిళల ర్యాలీపై నిషేధం విధిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్ లో మార్చి8న నిర్వహించ తలపెట్టిన ‘ఔరత్ ర్యాలీ’(మహిళా ర్యాలీ)కి అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. భద్రతాపరమైన సమస్యలు, వివాదాస్పద బ్యానర్లు, పోస్టర్లను చూపి అనుమతి ఇవ్వడం లేదని చెప్పింది.
ఇదిలా ఉంటే ఇస్లామిక్ విలువల పరిరక్షణ కోసం పిలుపునిచ్చే ‘‘హయా ర్యాలీ’’కి మాత్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో మహిళలు ఇది తమ హక్కులనను ఉల్లంఘించడమే అని ర్యాలీ నిర్వహకురాలు హిబా అక్బర్ అంటున్నారు. ఔరత్ మార్చ్ ను నిషేధించిన ప్రభుత్వం, హయా ర్యాలీకి ఎలా అనుమతి ఇస్తుందని ప్రశ్నించారు. విడాకులు, లైంగిక వేధింపులు, రుతుక్రమం వంటి అంశాలపై బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించిన కారణంగా ఔరత్ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. నిర్వాహకులు పాశ్చాత్చ, ఉదారవాద విలువను ప్రోత్సహిస్తున్నారని, మతం, సంస్కృతి గౌరవించడం లేదని ఆరోపించారు. హక్కుల సంఘం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాహోర్ నిర్ణయాన్ని ఖండించింది. మరోవైపు ఇస్లామాబాద్ లో జరిగే ఔరత్ మార్చ్ ను ఓ పార్క్ ప్రాంతంలోకి మార్చారు. ఫిబ్రవరిలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ర్యాలీని సిటీ పార్కుకు మార్చింది అక్కడి ప్రభుత్వం.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!