Pakistan: పాకిస్తాన్లో మహిళల పరిస్థితి ఇది.. మహిళా దినోత్సవం రోజున ర్యాలీకి అనుమతి నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s Day March Banned In Lahore: తెల్లారిలేస్తే భారత్ లోని కాశ్మీర్ ప్రజల హక్కుల గురించి గగ్గోలు పెడుతుంది దాయాది దేశం పాకిస్తాన్. భారత్ మైనారిటీలను అణిచివేస్తోందంటూ పలు అంతర్జాతీయ వేదికపైనే మొసలి కన్నీరు కారుస్తుంటుంది. కానీ తన సొంత దేశంలోని మైనారిటీల పరిస్థితులను పట్టించుకోదు. ప్రతీ ఏటా హిందూ, సిక్కు అమ్మాయిలను మతం మార్చి, కిడ్నాపులు చేసి ముస్లింలు పెళ్లి చేసుకుంటున్నారు. దైవదూషణ పేరుతో అమాయకులను చంపేస్తున్నారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఏటా కొన్ని వందల మందిని పాక్ సైన్యం ఊచకోత కోస్తుంది. అయినా కూడా వీటి గురించి పాశ్చాత్య దేశాలు పెద్దగా పట్టించుకోవు. ఎప్పుడూ ఇండియాను దోషిగా నిలబెట్టేందుకే అభివృద్ధి చెందాం అని చెప్పుకునే వెస్ట్రన్ దేశాలు భారత్ పై అసత్య ఆరోపణలు చేస్తుంటాయి.
Read Also: Vada pav: “వడాపావ్”కు అరుదైన గుర్తింపు.. బెస్ట్ శాండ్విచ్ల జాబితాలో చోటు..
Also Read
ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో స్వేచ్ఛ అనే పదానికి పెద్దగా అర్థం లేదు. అక్కడ పేరుకే ప్రజాస్వామ్యం నడిచేదంతా సైన్యం పాలన. ఇక మహిళల హక్కులు, స్వేచ్ఛకు అక్కడ అవకాశమే లేదు. చివరకు అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజు కూడా మహిళల ర్యాలీపై నిషేధం విధిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్ లో మార్చి8న నిర్వహించ తలపెట్టిన ‘ఔరత్ ర్యాలీ’(మహిళా ర్యాలీ)కి అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. భద్రతాపరమైన సమస్యలు, వివాదాస్పద బ్యానర్లు, పోస్టర్లను చూపి అనుమతి ఇవ్వడం లేదని చెప్పింది.
ఇదిలా ఉంటే ఇస్లామిక్ విలువల పరిరక్షణ కోసం పిలుపునిచ్చే ‘‘హయా ర్యాలీ’’కి మాత్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో మహిళలు ఇది తమ హక్కులనను ఉల్లంఘించడమే అని ర్యాలీ నిర్వహకురాలు హిబా అక్బర్ అంటున్నారు. ఔరత్ మార్చ్ ను నిషేధించిన ప్రభుత్వం, హయా ర్యాలీకి ఎలా అనుమతి ఇస్తుందని ప్రశ్నించారు. విడాకులు, లైంగిక వేధింపులు, రుతుక్రమం వంటి అంశాలపై బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించిన కారణంగా ఔరత్ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. నిర్వాహకులు పాశ్చాత్చ, ఉదారవాద విలువను ప్రోత్సహిస్తున్నారని, మతం, సంస్కృతి గౌరవించడం లేదని ఆరోపించారు. హక్కుల సంఘం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాహోర్ నిర్ణయాన్ని ఖండించింది. మరోవైపు ఇస్లామాబాద్ లో జరిగే ఔరత్ మార్చ్ ను ఓ పార్క్ ప్రాంతంలోకి మార్చారు. ఫిబ్రవరిలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ర్యాలీని సిటీ పార్కుకు మార్చింది అక్కడి ప్రభుత్వం.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?