Pakistan: పాకిస్తాన్లో మహిళల పరిస్థితి ఇది.. మహిళా దినోత్సవం రోజున ర్యాలీకి అనుమతి నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s Day March Banned In Lahore: తెల్లారిలేస్తే భారత్ లోని కాశ్మీర్ ప్రజల హక్కుల గురించి గగ్గోలు పెడుతుంది దాయాది దేశం పాకిస్తాన్. భారత్ మైనారిటీలను అణిచివేస్తోందంటూ పలు అంతర్జాతీయ వేదికపైనే మొసలి కన్నీరు కారుస్తుంటుంది. కానీ తన సొంత దేశంలోని మైనారిటీల పరిస్థితులను పట్టించుకోదు. ప్రతీ ఏటా హిందూ, సిక్కు అమ్మాయిలను మతం మార్చి, కిడ్నాపులు చేసి ముస్లింలు పెళ్లి చేసుకుంటున్నారు. దైవదూషణ పేరుతో అమాయకులను చంపేస్తున్నారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఏటా కొన్ని వందల మందిని పాక్ సైన్యం ఊచకోత కోస్తుంది. అయినా కూడా వీటి గురించి పాశ్చాత్య దేశాలు పెద్దగా పట్టించుకోవు. ఎప్పుడూ ఇండియాను దోషిగా నిలబెట్టేందుకే అభివృద్ధి చెందాం అని చెప్పుకునే వెస్ట్రన్ దేశాలు భారత్ పై అసత్య ఆరోపణలు చేస్తుంటాయి.
Read Also: Vada pav: “వడాపావ్”కు అరుదైన గుర్తింపు.. బెస్ట్ శాండ్విచ్ల జాబితాలో చోటు..
Also Read
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో స్వేచ్ఛ అనే పదానికి పెద్దగా అర్థం లేదు. అక్కడ పేరుకే ప్రజాస్వామ్యం నడిచేదంతా సైన్యం పాలన. ఇక మహిళల హక్కులు, స్వేచ్ఛకు అక్కడ అవకాశమే లేదు. చివరకు అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజు కూడా మహిళల ర్యాలీపై నిషేధం విధిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్ లో మార్చి8న నిర్వహించ తలపెట్టిన ‘ఔరత్ ర్యాలీ’(మహిళా ర్యాలీ)కి అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. భద్రతాపరమైన సమస్యలు, వివాదాస్పద బ్యానర్లు, పోస్టర్లను చూపి అనుమతి ఇవ్వడం లేదని చెప్పింది.
ఇదిలా ఉంటే ఇస్లామిక్ విలువల పరిరక్షణ కోసం పిలుపునిచ్చే ‘‘హయా ర్యాలీ’’కి మాత్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో మహిళలు ఇది తమ హక్కులనను ఉల్లంఘించడమే అని ర్యాలీ నిర్వహకురాలు హిబా అక్బర్ అంటున్నారు. ఔరత్ మార్చ్ ను నిషేధించిన ప్రభుత్వం, హయా ర్యాలీకి ఎలా అనుమతి ఇస్తుందని ప్రశ్నించారు. విడాకులు, లైంగిక వేధింపులు, రుతుక్రమం వంటి అంశాలపై బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించిన కారణంగా ఔరత్ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. నిర్వాహకులు పాశ్చాత్చ, ఉదారవాద విలువను ప్రోత్సహిస్తున్నారని, మతం, సంస్కృతి గౌరవించడం లేదని ఆరోపించారు. హక్కుల సంఘం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాహోర్ నిర్ణయాన్ని ఖండించింది. మరోవైపు ఇస్లామాబాద్ లో జరిగే ఔరత్ మార్చ్ ను ఓ పార్క్ ప్రాంతంలోకి మార్చారు. ఫిబ్రవరిలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ర్యాలీని సిటీ పార్కుకు మార్చింది అక్కడి ప్రభుత్వం.
తాజావార్తలు
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
-
Tollywood: ఫేక్ హౌస్ఫుల్స్… డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త “మైండ్ గేమ్”!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!