Chernobyl disaster: చెర్నోబిల్ రేడియేషన్ తట్టుకుని క్యాన్సర్ని జయించిన తోడేళ్లు.. కీలక స్టడీలో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chernobyl disaster: చెర్నోబిల్ డిజాస్టర్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అణు విద్యుత్ కర్మాగారంలో పేలుడుతో సోవియట్ యూనియన్లోని(ప్రస్తుతం ఉక్రెయిన్) ఈ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. 1986లో జరిగిన ఈ విపత్తు కారణంగా ఇప్పటికీ చెర్నోబిల్ నగరాన్ని ప్రజలు విడిచి వెళ్లారు. అణు విధ్వంసం తర్వాత ఇక్కడి వాతావరణంలో ఇప్పటికీ రేడియేషన్ ప్రభావం ఉంది. రేడియేషన్ బారిన పడితే ప్రజలు క్యాన్సర్లకు గురవుతారని ఈ ప్రాంతానికి అనుమతించడం లేదు. విపత్తు జరిగిన ప్రాంతం నుంచి 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఒక నిషేధిత ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. ఇది మొత్తం 2634 చదరపు కి.మీ విస్తరించి చెర్నోబిల్ మినహాయింపు జోన్ (CEZ)గా ఉంది.
అయితే, మనుషులు ఇక్కడి నుంచి దూరంగా ఉన్నప్పటికీ తోడేళ్ల వంటి వన్యప్రాణాలు అక్కడ నివసిస్తున్నాయి. తాజాగా ఓ అధ్యయనంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న తోడేళ్ల రోగనిరోధక వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నట్లుగా, క్యాన్సర్తో పోరాడేలా వాటి రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేసుకున్నట్లు తేలింది. రానున్న కాలంలో వాటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తే, మానవుడు ప్రాణాంతక వ్యాధితో పోరాడేందుకు సాయం చేయవచ్చని అధ్యయనం తెలిపింది.
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో

Read Also: CM Revanth: మీరెప్పుడు రైతుబంధు ఇచ్చారు..? మేము వచ్చి 60 రోజులు కూడా కాలేదు
చెర్నోబిల్ ప్రాంతంలో తిరుగుతున్న తోడేళ్లు, దీర్ఘకాలికంగా గురైనప్పటికీ.. అవి ప్రభావితం కానట్లు కనిపిస్తోందని, గత నెలలో యూఎస్ లోని సొసైటీ ఆఫ్ ఇంటిగ్రేటివ్ అండ్ కంపారిటివ్ బయాలజీ వార్షిక సమావేశంలో సమర్పించిన అధ్యయనం పేర్కొంది. దీనికి ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలోని షేన్ కాంప్బెల్-స్టాటన్ ల్యాబ్లో పరిణామ జీవశాస్త్రవేత్త మరియు ఎకోటాక్సికాలజిస్ట్ కారా లవ్ నాయకత్వం వహించారు. ఆమె తొమ్మిదేళ్లుగా CEZ వద్ద తోడేళ్ళను అధ్యయనం చేస్తోంది.
అధ్యయనం ప్రకారం.. ప్రతీరోజూ తోడేళ్లు 11.28 మిల్లీమీటర్ల రేడియేషన్కి గురవుతున్నాయి. ఇది మానవుడి భరించే రేడియేషన్ కన్నా 6 రెట్లు ఎక్కువ. చెర్నోబిల్ లోని తోడేళ్లలో రోగనిరోధక వ్యవస్థ ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని తోడేళ్ల కన్నా భిన్నంగా ఉందని, వాటి జన్యువులు క్యాన్సర్ని తట్టుకోగలదని పరిశోధన బృందం కనుగొంది. వాటి జన్యువులోని నిర్దిష్ట ప్రాంతాలను వారు గుర్తించారు, ఇది క్యాన్సర్ని అడ్డుకున్నట్లుగా తేలింది. మానవుల్లో ఇలాంటి జన్యు ఉత్పరివర్తన క్యాన్సర్ నుంచి మనుగడ సాగించేందుకు సాయం చేస్తాయనే విషయాన్ని పరిశోధకులు పరిశీలించనున్నారు. ఈ ప్రాంతంలో నివసించే కుక్కలపై కూడా ఇలాంటి ప్రభావాలే కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
-
Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
-
Summer Special: మామిడితో ఈ మ్యాజిక్ ట్రై చేశారా..? ఒక్క స్పూన్ తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు!
-
West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
-
KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!