Chernobyl disaster: చెర్నోబిల్ రేడియేషన్ తట్టుకుని క్యాన్సర్ని జయించిన తోడేళ్లు.. కీలక స్టడీలో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chernobyl disaster: చెర్నోబిల్ డిజాస్టర్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అణు విద్యుత్ కర్మాగారంలో పేలుడుతో సోవియట్ యూనియన్లోని(ప్రస్తుతం ఉక్రెయిన్) ఈ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. 1986లో జరిగిన ఈ విపత్తు కారణంగా ఇప్పటికీ చెర్నోబిల్ నగరాన్ని ప్రజలు విడిచి వెళ్లారు. అణు విధ్వంసం తర్వాత ఇక్కడి వాతావరణంలో ఇప్పటికీ రేడియేషన్ ప్రభావం ఉంది. రేడియేషన్ బారిన పడితే ప్రజలు క్యాన్సర్లకు గురవుతారని ఈ ప్రాంతానికి అనుమతించడం లేదు. విపత్తు జరిగిన ప్రాంతం నుంచి 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఒక నిషేధిత ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. ఇది మొత్తం 2634 చదరపు కి.మీ విస్తరించి చెర్నోబిల్ మినహాయింపు జోన్ (CEZ)గా ఉంది.
అయితే, మనుషులు ఇక్కడి నుంచి దూరంగా ఉన్నప్పటికీ తోడేళ్ల వంటి వన్యప్రాణాలు అక్కడ నివసిస్తున్నాయి. తాజాగా ఓ అధ్యయనంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న తోడేళ్ల రోగనిరోధక వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నట్లుగా, క్యాన్సర్తో పోరాడేలా వాటి రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేసుకున్నట్లు తేలింది. రానున్న కాలంలో వాటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తే, మానవుడు ప్రాణాంతక వ్యాధితో పోరాడేందుకు సాయం చేయవచ్చని అధ్యయనం తెలిపింది.
Also Read
- Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్లు.. నెట్టింట తీవ్ర వివాదం
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..

Read Also: CM Revanth: మీరెప్పుడు రైతుబంధు ఇచ్చారు..? మేము వచ్చి 60 రోజులు కూడా కాలేదు
చెర్నోబిల్ ప్రాంతంలో తిరుగుతున్న తోడేళ్లు, దీర్ఘకాలికంగా గురైనప్పటికీ.. అవి ప్రభావితం కానట్లు కనిపిస్తోందని, గత నెలలో యూఎస్ లోని సొసైటీ ఆఫ్ ఇంటిగ్రేటివ్ అండ్ కంపారిటివ్ బయాలజీ వార్షిక సమావేశంలో సమర్పించిన అధ్యయనం పేర్కొంది. దీనికి ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలోని షేన్ కాంప్బెల్-స్టాటన్ ల్యాబ్లో పరిణామ జీవశాస్త్రవేత్త మరియు ఎకోటాక్సికాలజిస్ట్ కారా లవ్ నాయకత్వం వహించారు. ఆమె తొమ్మిదేళ్లుగా CEZ వద్ద తోడేళ్ళను అధ్యయనం చేస్తోంది.
అధ్యయనం ప్రకారం.. ప్రతీరోజూ తోడేళ్లు 11.28 మిల్లీమీటర్ల రేడియేషన్కి గురవుతున్నాయి. ఇది మానవుడి భరించే రేడియేషన్ కన్నా 6 రెట్లు ఎక్కువ. చెర్నోబిల్ లోని తోడేళ్లలో రోగనిరోధక వ్యవస్థ ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని తోడేళ్ల కన్నా భిన్నంగా ఉందని, వాటి జన్యువులు క్యాన్సర్ని తట్టుకోగలదని పరిశోధన బృందం కనుగొంది. వాటి జన్యువులోని నిర్దిష్ట ప్రాంతాలను వారు గుర్తించారు, ఇది క్యాన్సర్ని అడ్డుకున్నట్లుగా తేలింది. మానవుల్లో ఇలాంటి జన్యు ఉత్పరివర్తన క్యాన్సర్ నుంచి మనుగడ సాగించేందుకు సాయం చేస్తాయనే విషయాన్ని పరిశోధకులు పరిశీలించనున్నారు. ఈ ప్రాంతంలో నివసించే కుక్కలపై కూడా ఇలాంటి ప్రభావాలే కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
-
CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!