Iran-Israel: ఇరాన్కు మరో ఎదురుదెబ్బ.. నేవీ చీఫ్ అలిరెజా హతం
- ఇరాన్కు మరో ఎదురుదెబ్బ
- కీలక నేవీ చీఫ్ హతం!
- వెల్లడించిన ఇజ్రాయెల్ మీడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలంతా ఒక్కొక్కరిగా నేలరాలిపోతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దగ్గర నుంచి ఆయన కుడి భుజం, ఇరాన్ భద్రతా అధిపతి అలీ లారిజానీ వరకు టాప్ మోస్ట్ లీడర్లంతా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ పక్కా ప్రణాళికతో టాప్ లీడర్లందరినీ హతమార్చుతోంది. తాజాగా మరో కీలక నేతను అంతమొందించినట్లుగా ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.
ఇరాన్లోని బందర్ అబ్బాస్పై ఇజ్రాయెల్ భారీ దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ నేవీ చీఫ్ అలిరెజా తంగ్సిరి ప్రాణాలు తీసింది. ప్రస్తుతం హార్ముజ్ దిగ్బంధనాన్ని అలిరెజా తంగ్సిరినే పర్యవేక్షిస్తున్నాడు. హార్ముజ్ జలసంధి మూసివేతకు అలీరెజానే కారణమని నివేదికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలిరెజాను ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుని చంపేసింది. అలిరెజా హతం అయినట్లుగా ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
బందర్ అబ్బాస్లో జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నావికాదళ అధిపతి అలీరెజా తంగ్సిరి మరణించినట్లు ఒక ఇజ్రాయెల్ అధికారి పేర్కొన్నట్లుగా ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం.. హార్ముజ్ జలసంధి మూసివేతకు తంగ్సిరియే బాధ్యుడని పేర్కొంది. అయితే ఈ దాడిపై ఇరాన్ గానీ.. ఇజ్రాయెల్ సైన్యం గానీ ఇంకా అధికారింగా వెల్లడించలేదు.
అలీరెజా తంగ్సిరి..
అలీరెజా తంగ్సిరి.. 2018 నుంచి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నావికాదళ అధిపతిగా పని చేస్తున్నారు. అలీరెజా తంగ్సిరికి ఆ పదవిలో మంచి అనుభవం ఉంది. ఇజ్రాయెల్, అమెరికా దాడి చేయగానే హార్ముజ్ జలసంధిని మూసేయాలని అలీరెజా ఆదేశాలు ఇచ్చాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సమస్యలు వచ్చాయి. వాస్తవంగా హార్ముజు నుంచి ప్రతిరోజు 120 నౌకలు ప్రయాణం చేస్తాయి. కానీ యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కేవలం 155 నౌకలు మాత్రం ప్రయాణించాయి. దాదాపు 95 శాతం తగ్గిపోయింది. దీనింతటికి అలీరెజానే కారణంగా ఇజ్రాయెల్ భావించింది. ఈ నేపథ్యంలోనే అతడిని చంపేసినట్లుగా ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అయతుల్లా ఖమేనీ, లారిజానీ తర్వాత కీలక నేతల్లో అలీరెజా తంగ్సిరి కూడా ఒక ముఖ్యమైన నేత.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!