Iran-Israel: ఇరాన్కు మరో ఎదురుదెబ్బ.. నేవీ చీఫ్ అలిరెజా హతం
- ఇరాన్కు మరో ఎదురుదెబ్బ
- కీలక నేవీ చీఫ్ హతం!
- వెల్లడించిన ఇజ్రాయెల్ మీడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలంతా ఒక్కొక్కరిగా నేలరాలిపోతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దగ్గర నుంచి ఆయన కుడి భుజం, ఇరాన్ భద్రతా అధిపతి అలీ లారిజానీ వరకు టాప్ మోస్ట్ లీడర్లంతా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ పక్కా ప్రణాళికతో టాప్ లీడర్లందరినీ హతమార్చుతోంది. తాజాగా మరో కీలక నేతను అంతమొందించినట్లుగా ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.
ఇరాన్లోని బందర్ అబ్బాస్పై ఇజ్రాయెల్ భారీ దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ నేవీ చీఫ్ అలిరెజా తంగ్సిరి ప్రాణాలు తీసింది. ప్రస్తుతం హార్ముజ్ దిగ్బంధనాన్ని అలిరెజా తంగ్సిరినే పర్యవేక్షిస్తున్నాడు. హార్ముజ్ జలసంధి మూసివేతకు అలీరెజానే కారణమని నివేదికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలిరెజాను ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుని చంపేసింది. అలిరెజా హతం అయినట్లుగా ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది.
Also Read
- Indonesia Earthquake: ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Italy: ఇటలీలో భారీ ప్రమాదం.. డెలివరీ చేసిన 4 రోజులకే మునిగిన లగ్జరీ నౌక
- August 15 Independence Day: భారత్తో పాటు, ఆగస్టు 15న ఈ నాలుగు దేశాలకు స్వాతంత్య్రం..
- Modi-Rahman: బ్రిక్స్కు ముందే ఢిల్లీకి రెహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
బందర్ అబ్బాస్లో జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నావికాదళ అధిపతి అలీరెజా తంగ్సిరి మరణించినట్లు ఒక ఇజ్రాయెల్ అధికారి పేర్కొన్నట్లుగా ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం.. హార్ముజ్ జలసంధి మూసివేతకు తంగ్సిరియే బాధ్యుడని పేర్కొంది. అయితే ఈ దాడిపై ఇరాన్ గానీ.. ఇజ్రాయెల్ సైన్యం గానీ ఇంకా అధికారింగా వెల్లడించలేదు.
అలీరెజా తంగ్సిరి..
అలీరెజా తంగ్సిరి.. 2018 నుంచి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నావికాదళ అధిపతిగా పని చేస్తున్నారు. అలీరెజా తంగ్సిరికి ఆ పదవిలో మంచి అనుభవం ఉంది. ఇజ్రాయెల్, అమెరికా దాడి చేయగానే హార్ముజ్ జలసంధిని మూసేయాలని అలీరెజా ఆదేశాలు ఇచ్చాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సమస్యలు వచ్చాయి. వాస్తవంగా హార్ముజు నుంచి ప్రతిరోజు 120 నౌకలు ప్రయాణం చేస్తాయి. కానీ యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కేవలం 155 నౌకలు మాత్రం ప్రయాణించాయి. దాదాపు 95 శాతం తగ్గిపోయింది. దీనింతటికి అలీరెజానే కారణంగా ఇజ్రాయెల్ భావించింది. ఈ నేపథ్యంలోనే అతడిని చంపేసినట్లుగా ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అయతుల్లా ఖమేనీ, లారిజానీ తర్వాత కీలక నేతల్లో అలీరెజా తంగ్సిరి కూడా ఒక ముఖ్యమైన నేత.
తాజావార్తలు
-
Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
-
PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. ‘అర్బన్ నక్సల్స్’ను సమాజం దూరం పెట్టాలి..
-
Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష.. ఫ్రంట్ రోలో కూర్చుని సెల్యూట్
-
IND vs SL: మరోమారు సర్ఫరాజ్ ఖాన్కు మొండిచేయి.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..!
-
Awarapan 2: ‘అవారపన్ 2’ బాక్సాఫీస్ దుమ్మురేపింది.. తొలి రోజే ‘బట్వారా1947’ను మూడింతలు దాటేసిన ఇమ్రాన్ హష్మీ
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!