Iran-Israel: ఇరాన్కు మరో ఎదురుదెబ్బ.. నేవీ చీఫ్ అలిరెజా హతం
- ఇరాన్కు మరో ఎదురుదెబ్బ
- కీలక నేవీ చీఫ్ హతం!
- వెల్లడించిన ఇజ్రాయెల్ మీడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలంతా ఒక్కొక్కరిగా నేలరాలిపోతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దగ్గర నుంచి ఆయన కుడి భుజం, ఇరాన్ భద్రతా అధిపతి అలీ లారిజానీ వరకు టాప్ మోస్ట్ లీడర్లంతా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ పక్కా ప్రణాళికతో టాప్ లీడర్లందరినీ హతమార్చుతోంది. తాజాగా మరో కీలక నేతను అంతమొందించినట్లుగా ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.
ఇరాన్లోని బందర్ అబ్బాస్పై ఇజ్రాయెల్ భారీ దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ నేవీ చీఫ్ అలిరెజా తంగ్సిరి ప్రాణాలు తీసింది. ప్రస్తుతం హార్ముజ్ దిగ్బంధనాన్ని అలిరెజా తంగ్సిరినే పర్యవేక్షిస్తున్నాడు. హార్ముజ్ జలసంధి మూసివేతకు అలీరెజానే కారణమని నివేదికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలిరెజాను ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుని చంపేసింది. అలిరెజా హతం అయినట్లుగా ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది.
Also Read
- Explainer: పాక్తో వేగలేం! పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు భారత్ సాయాన్ని ఎందుకు కోరుతున్నారు?
- POK Protests: పీవోకేలో నిరసనల వేళ కాశ్మీర్ కార్డు.. పాక్ ఆర్మీ చీఫ్ తాజా వ్యాఖ్యలు
- Ethnic Unity Law: ముస్లింలే టార్గెట్.. కమ్యూనిస్టు దేశంలో మైనార్టిలపై అణచివేత చట్టాలు!
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
బందర్ అబ్బాస్లో జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నావికాదళ అధిపతి అలీరెజా తంగ్సిరి మరణించినట్లు ఒక ఇజ్రాయెల్ అధికారి పేర్కొన్నట్లుగా ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం.. హార్ముజ్ జలసంధి మూసివేతకు తంగ్సిరియే బాధ్యుడని పేర్కొంది. అయితే ఈ దాడిపై ఇరాన్ గానీ.. ఇజ్రాయెల్ సైన్యం గానీ ఇంకా అధికారింగా వెల్లడించలేదు.
అలీరెజా తంగ్సిరి..
అలీరెజా తంగ్సిరి.. 2018 నుంచి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నావికాదళ అధిపతిగా పని చేస్తున్నారు. అలీరెజా తంగ్సిరికి ఆ పదవిలో మంచి అనుభవం ఉంది. ఇజ్రాయెల్, అమెరికా దాడి చేయగానే హార్ముజ్ జలసంధిని మూసేయాలని అలీరెజా ఆదేశాలు ఇచ్చాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సమస్యలు వచ్చాయి. వాస్తవంగా హార్ముజు నుంచి ప్రతిరోజు 120 నౌకలు ప్రయాణం చేస్తాయి. కానీ యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కేవలం 155 నౌకలు మాత్రం ప్రయాణించాయి. దాదాపు 95 శాతం తగ్గిపోయింది. దీనింతటికి అలీరెజానే కారణంగా ఇజ్రాయెల్ భావించింది. ఈ నేపథ్యంలోనే అతడిని చంపేసినట్లుగా ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అయతుల్లా ఖమేనీ, లారిజానీ తర్వాత కీలక నేతల్లో అలీరెజా తంగ్సిరి కూడా ఒక ముఖ్యమైన నేత.
తాజావార్తలు
-
Ahmedabad Serial Blasts Case: వరుస బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు.. 38 మందికి ఉరిశిక్ష ఖరారు
-
Chiru158: మెగాస్టార్ మాస్ మోడ్.. హైదరాబాద్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Women Financial Assistance: మహిళలకు గుడ్ న్యూస్.. ఇక, నెలకు రూ.2,500.. అర్హతలు ఇవే..
-
Ramayana: హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ దిశగా ‘రామాయణం’.. ప్రపంచవ్యాప్త విడుదలపై ఊహాగానాలు
ట్రెండింగ్
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!