United Nations: మహిళ కిడ్నాప్, అత్యాచారం.. చివరకు మనిషి మాంసాన్ని తినిపించారు.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కాంగో హక్కుల కార్యకర్త చెప్పిన ఓ మహిళ ధీనగాథ అందరి చేత కంటతడి పెట్టించింది. కాంగోలో మానవహక్కులు ఏ విధంగా ఉన్నాయో తెలిపేందుకు సదరు హక్కుల కార్యకర్త, ఓ మహిళ పడిన కష్టాన్ని 15 దేశాల సభ్యులు ఉండే భద్రతా మండలిలో వివరించింది. కాంగోలో అంతర్యుద్ధం కారణంగా ప్రజలు పడుతున్న బాధలను తెలిపేలా, మిలిటెంట్ల రాక్షసత్వాన్ని తెలిపేలా ఈ ఘటన ఉంది.
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మిలిటెంట్లు రెండు సార్లు కిడ్నాప్ చేసి, గ్రూపు సభ్యులంతా అత్యాచారం చేసి చివరకు మనిషి మాంసాన్ని తినేలా చేశారని కాంగో హక్కుల సంఘం బుధవారం యూఎన్ఓ సెక్యురిటీ కౌన్సిల్ కు తెలిపింది. మహిళా హక్కుల సంఘం మహిళా సాలిడారిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ పీస్ అండ్ డెవలప్మెంట్ (ఎస్ఓఎఫ్ఈపీఏడీఐ) ప్రెసిడెంట్ జులియెన్ లుసెంగే, కాంగో దేశంలోని తూర్పు ప్రాంతంలో జరుగుతున్న సంఘర్షణను తెలియజేసింది.
Also Read
- North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
- Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
- Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
- Donald Trump: ‘‘బిడ్డను కనడానికే వస్తారు’’.. భారతీయులపై ట్రంప్ అక్కసు..
కిడ్నాప్ కు గురైన తన కుటుంబ సభ్యుడిని విడిపించేందుకు ఉగ్రవాదులుకు డబ్బు ఇచ్చేందుకు వెళ్లిన ఓ మహిళను కోడెకో ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని లుసెంగే తెలిపారు. తరువాత ఆ మహిళను నిర్భధించి పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారని.. శారీరకంగా వేధింపులకు గురిచేశారని తెలిపింది. ఇంతటితో ఆగకుండా ఓ వ్యక్తి గొంతు కోసి చంపేసి, అతని పేగులను బయటకు తీసి వాటిని వండాలని మహిళను వేధించారని.. మిగిలిన భోజనాన్ని సిద్ధం చేయడానికి రెండు కంటైనర్ల నీటిని మహిళకు ఇచ్చి, వండిన మానవ మాంసాన్ని ఖైదీలతో తినిపించారని ఆ మహిళ కథను యూఎన్ఓకు తెలియజేసింది.
కొన్ని రోజుల తర్వాత మహిళను విడుదల చేశారని.. అయితే ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో మరో మిలిటెంట్ గ్రూప్ ఆమెను కిడ్నాప్ చేసి, మిలిటెంట్లు పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారని.. మానవ మాంసాన్ని ఉడికించి తినమని సదరు మహిళను అడిగారని, అక్కడ నుంచి మహిళ తప్పించుకుందని హక్కుల కార్యకర్త యూఎన్ కు తెలిపింది. కాంగోలో ఖనిజాలు అధికంగా ఉండే తూర్పు ప్రాంతంలో భూమి, వనరులపై చాలా కాలంగా పోరాటాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలోని మిలిటెంట్ గ్రూపులు గత దశాబ్ధకాలంలో వేలాది మంది ప్రజలను చంపారు.
తాజావార్తలు
-
MI vs CSK: వాంఖెడేలో తిలక్ వర్మ – జేమీ ఓవర్టన్ మధ్య మాటల యుద్ధం.. వీడియో వైరల్.!
-
Friday Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశివారు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు.!
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!