United Nations: మహిళ కిడ్నాప్, అత్యాచారం.. చివరకు మనిషి మాంసాన్ని తినిపించారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కాంగో హక్కుల కార్యకర్త చెప్పిన ఓ మహిళ ధీనగాథ అందరి చేత కంటతడి పెట్టించింది. కాంగోలో మానవహక్కులు ఏ విధంగా ఉన్నాయో తెలిపేందుకు సదరు హక్కుల కార్యకర్త, ఓ మహిళ పడిన కష్టాన్ని 15 దేశాల సభ్యులు ఉండే భద్రతా మండలిలో వివరించింది. కాంగోలో అంతర్యుద్ధం కారణంగా ప్రజలు పడుతున్న బాధలను తెలిపేలా, మిలిటెంట్ల రాక్షసత్వాన్ని తెలిపేలా ఈ ఘటన ఉంది.
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మిలిటెంట్లు రెండు సార్లు కిడ్నాప్ చేసి, గ్రూపు సభ్యులంతా అత్యాచారం చేసి చివరకు మనిషి మాంసాన్ని తినేలా చేశారని కాంగో హక్కుల సంఘం బుధవారం యూఎన్ఓ సెక్యురిటీ కౌన్సిల్ కు తెలిపింది. మహిళా హక్కుల సంఘం మహిళా సాలిడారిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ పీస్ అండ్ డెవలప్మెంట్ (ఎస్ఓఎఫ్ఈపీఏడీఐ) ప్రెసిడెంట్ జులియెన్ లుసెంగే, కాంగో దేశంలోని తూర్పు ప్రాంతంలో జరుగుతున్న సంఘర్షణను తెలియజేసింది.
Also Read
- Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ 'అణు' బాంబ్.. 'సర్మాట్' క్షిపణితో సర్ప్రైజ్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. 'మాపై చేయి వేస్తే.. అణు విలయమే!'
- Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్గ్రౌండ్ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
కిడ్నాప్ కు గురైన తన కుటుంబ సభ్యుడిని విడిపించేందుకు ఉగ్రవాదులుకు డబ్బు ఇచ్చేందుకు వెళ్లిన ఓ మహిళను కోడెకో ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని లుసెంగే తెలిపారు. తరువాత ఆ మహిళను నిర్భధించి పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారని.. శారీరకంగా వేధింపులకు గురిచేశారని తెలిపింది. ఇంతటితో ఆగకుండా ఓ వ్యక్తి గొంతు కోసి చంపేసి, అతని పేగులను బయటకు తీసి వాటిని వండాలని మహిళను వేధించారని.. మిగిలిన భోజనాన్ని సిద్ధం చేయడానికి రెండు కంటైనర్ల నీటిని మహిళకు ఇచ్చి, వండిన మానవ మాంసాన్ని ఖైదీలతో తినిపించారని ఆ మహిళ కథను యూఎన్ఓకు తెలియజేసింది.
కొన్ని రోజుల తర్వాత మహిళను విడుదల చేశారని.. అయితే ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో మరో మిలిటెంట్ గ్రూప్ ఆమెను కిడ్నాప్ చేసి, మిలిటెంట్లు పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారని.. మానవ మాంసాన్ని ఉడికించి తినమని సదరు మహిళను అడిగారని, అక్కడ నుంచి మహిళ తప్పించుకుందని హక్కుల కార్యకర్త యూఎన్ కు తెలిపింది. కాంగోలో ఖనిజాలు అధికంగా ఉండే తూర్పు ప్రాంతంలో భూమి, వనరులపై చాలా కాలంగా పోరాటాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలోని మిలిటెంట్ గ్రూపులు గత దశాబ్ధకాలంలో వేలాది మంది ప్రజలను చంపారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!