Ukraine War: ఉక్రెయిన్ లో కుప్పకూలిన హెలికాప్టర్..హోంమంత్రి సహా 18 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine Chopper Crash: ఉక్రెయిన్ లో ఘోరం జరిగింది. రాజధాని కీవ్ కు సమీపంలో ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఉక్రెయిన్ హోంమంత్రి, డిప్యూటీ హోంమంత్రితో సహా మొత్తం 18 మంది మరణించారు. ఉక్రెయిన్ అధికారులు బుధవారం ఈ ప్రమాదం గురించి తెలిపారు. చనిపోయిన వారిలో హోం మంత్రి డెనిస్ డెనిస్ మొనాస్టైర్స్కీ మరియు అతని మొదటి డిప్యూటీ మినిస్టర్ యెవ్జెనీ యెనిన్తో సహా అంతర్గత మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. మరణించిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా, ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఓ స్కూల్ పై హెలికాప్టర్ కూలడం వల్ల చిన్నారులు చాలా మంది గాయాల పాలయ్యారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
Read Also: Kanti Velugu: రెండో విడత కంటి వెలుగు ప్రారంభం.. ప్రారంభించిన జాతీయ నేతలు
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
42 ఏళ్ల మొనాస్టైర్స్కీ 2021లో హోంమంత్రిగా నియమితులయ్యారు. ఈ ప్రమాదంలో సమీపంలోని 10 మంది పిల్లలతో పాటు 22 మందికి గాయాలు అయ్యాయి. రాజధాని కీవ్ కు ఈశాన్యంగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రోవరీ పట్టణంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఘటన జరిగిన వెంటనే అత్యవసర సేవలు సంఘటన స్థలానికి చేరుకున్నాయని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. హెలికాప్టర్ కూలిపోవడంపై రష్యా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆదే సమయంలో రష్యా నుంచి దాడి ఎదుర్కొన్నట్లు కీవ్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదిలా ఉంటే గత వారం నుంచి రష్యా తీవ్ర స్థాయిలో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. అమెరికా, బ్రిటన్ నుంచి సైనిక సాయం పొందిన ఉక్రెయిన్ పై వరసగా దాడులు చేస్తోంది రష్యా. ఇటీవల రష్యా దాడులను తట్టుకోవడానికి, ఉక్రెయిన్ ఇటీవలి వారాల్లో పాశ్చాత్య మద్దతుదారులను అధునాతన ట్యాంకులు పొందుతోంది. బ్రిటన్, ఉక్రెయిన్కు 14 ఛాలెంజర్ ట్యాంకులను ఇస్తున్నట్లు ప్రకటించింది. వారాంతంలో తూర్పు నగరమైన డ్నిప్రోలోని నివాస భవనాన్ని రష్యా క్షిపణి ఢీకొనడంతో ఆరుగురు పిల్లలతో సహా 45 మంది మరణించిన విషాదం నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది.
#Brovary. It is impossible to believe. 17 dead, including 2 children. The Minister of Internal Affairs, the First Deputy Minister and the Secretary of State died. My deepest condolences😞
📹 Brovary's auditor pic.twitter.com/djAU1v3ya6
— Kira Rudik (@kiraincongress) January 18, 2023
తాజావార్తలు
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!