Flights Safe Land: గాల్లో అంతరాయం.. రెండు విమానాలకు తప్పిన ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two Flights Escaped From Danger: రెండు విమానాలు గాల్లో ఉన్నప్పుడు ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ రెండు ఫ్లైట్స్ అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నాయి. అయితే.. అదృష్టవశాత్తూ అవి ప్రమాదం నుంచి బయటపడ్డాయి. సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నాయి. తొలుత ఒక విమానం నేపాల్ రాజధాని కాఠ్మాండూ నుంచి 150 మంది ప్రయాణికులతో దుబాయ్కి బయలుదేరింది. దుబాయ్కు చెందిన ఫ్లైదుబాయ్ విమానం కాఠ్మాండూలోని త్రిభువన్దాస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే.. దాని రెండు ఇంజిన్లలో మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొట్టాయి. ఈ ప్రమాదాన్ని వెంటనే పసిగట్టిన అధికారులు.. విమానాన్ని తక్షణమే ల్యాండ్ చేసే విధంగా చర్యలు చేపట్టారు. అయితే.. ఇండికేటర్లన్నీ సాధారణంగా ఉండటంతో పైలట్లు విమానాన్ని గమ్యస్థానానికి తీసుకెళ్లారు. ఈ సమాచారాన్ని కంట్రోల్ టవర్కు సమాచారం అందించగా.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. ఈ విమానంలో ఉన్న మొత్తం 150 మంది ప్రయాణికుల్లో సుమారు 50 మంది నేపాల్ ప్రయాణికులు కాగా, మిగతావారు ఇతర దేశాలకు చెందినవారు.
Virupaksha: కాంతార స్టైల్ లో విరుపాక్ష… మే ఫస్ట్ వీక్ లో పాన్ ఇండియా రిలీజ్
Also Read
- Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
ఇక మరో ఘటన గురించి మాట్లాడుకుంటే.. అమెరికాలో ఒక విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాల్లో, దాని ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఒక పక్షి ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం 7:45 గంటలకు అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం కొలంబస్లోని జాన్ గ్లెన్ కొలంబస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయింది. కొద్దిసేపటికే పక్షి ఢీకొనడంతో.. ఇంజిను నుంచి మంటలు రావడం ప్రారంభమైంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. విమానాన్ని వెనక్కి తిప్పి, కొలంబస్లోనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరూ గాయపడలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికుల్ని మరో ఫ్లైట్లో ఎక్కించి, వారిని గమ్యస్థానానికి చేర్చారు. కాగా.. పక్షలు లేదా ఇతర జంతువుల వల్ల కలిగే ప్రమాదాలను ఎయిర్లైన్స్ వాళ్లు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఇలాంటి ప్రమాదాల కారణంగా ఆయా ఎయిర్లైన్స్కి ఏటా మిలియన్ డాలర్లలో నష్టం వాటిల్లుతోంది. 2019 ఆగస్టులో ఉరల్ ఎయిర్లైన్స్కి చెందిన ఒక విమానాన్ని సీగల్ల మంద ఢీకొట్టడంతో.. అది ఒక కార్న్ ఫీల్డ్లో క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. ఈ ఘటనలో 74 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
Akhil Akkineni: ‘ఏజెంట్’కు ‘పఠాన్’కు పోలిక లేదు: డినో మోరియా
తాజావార్తలు
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!