Twitter: ట్విట్టర్ యూజర్లకు ఎలాన్ మస్క్ మరో షాక్.. ఈ 3 ఫీచర్ల కోసం ఛార్జీలు చెల్లించాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Twitter’s Elon Musk plans to charge you for 3 major and basic features: ట్విట్టర్ని హస్తగతం చేసుకున్న తర్వాత షాకుల మీద షాక్లు ఇస్తున్నాడు కొత్త బాస్ ఎలాన్ మస్క్. 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో ట్విట్టర్ని సొంతం చేసుకున్న తర్వాత పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు సిద్ధం అయ్యారు. టేకోవర్ చేసుకున్న గంటల వ్యవధిలో కీలకమైన నలుగురు ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. ఇందులో సీఈఓ పరాగ్ అగర్వాల్, పాలసీ చీఫ్ విజయగద్దెలలో పాటు పలువురిని తొలగించారు. మొత్తం ట్విట్టర్ బోర్డును రద్దు చేశారు. ఇదిలా ఉంటే 50 శాతం మంది ట్విట్టర్ ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో ఉన్నాడు ఎలాన్ మస్క్. ఇప్పటికే శుక్రవారం నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభం అయింది. దాదాపుగా 3800 మంది ట్విట్టర్ నుంచి తొలగించనున్నారు.
Read Also: Twitter: నా ఉద్యోగం పోయింది.. భారతీయుడి ట్వీట్ వైరల్
Also Read
- Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ట్విట్టర్ నుంచి ఉచితంగా పొందిన కొన్ని ఫీచర్లకు ఛార్జీలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 3 రకాల సేవలకు ఛార్జీలు విధించే అవకాశం ఉందని సమాచారం. 1) హై ప్రొఫైల్ యూజర్లకు ప్రైవేట్ మెసేజులు పంపించాలంటే ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. 2) కొన్ని వీడియోలను చూడాలంటే యూజర్ల నుంచి ఛార్జీలు వసూలు చేయనున్నారు. 3) బ్లూ టిక్ మార్క్ కోసం నెలకు 8 డాలర్ల చెల్లించాల్సిందే అని ఇప్పటికే మస్క్ స్పష్టం చేశాడు.
ట్విట్టర్ లో హై ప్రొఫైల్ వినియోగదారులకు ప్రైవేట్ మెసేజ్ లు పంపాలనుకుంటే డబ్బు చెల్లించాల్సిందే అని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అయితే హై ప్రొఫైల్ యూజర్ల కిందికి ఎవరెవరు వస్తారనే దానిపై స్పష్టత లేదు. బ్లూ టిక్ మార్క్ కోసం ఇకపై నెలకు 8 డాలర్లు(సుమారుగా రూ. 600) వసూలు చేస్తామని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. అయితే ఇతర దేశాలకు ఎంతెంత సబ్స్క్రిప్షన్ ధర ఉంటుందో వెల్లడించలేదు. వినియోగదారులు నిర్ధిష్టమైన వీడియోలను చూడాలంటే డబ్బులు చెల్లించేలా ప్లాన్ చేస్తున్నారు. వీడియోలను అప్ లోడ్ చేయడానికి, సెర్చ్ చేయాలంటే ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!