ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ముందడుగు పడడం లేదు. ఇటీవల 28 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ ముందుకు తీసుకొచ్చారు. ఇక ట్రంప్ బృందం రంగంలోకి దిగి ఇరు దేశాలతో చర్చించారు. రష్యా పూర్తి అనుకూలంగా ఉంటే.. ఉక్రెయిన్ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రష్యా రూపొందించిన ప్రణాళిక అంటూ జెలెన్స్కీ తోసిపుచ్చారు.
ఇది కూడా చదవండి: IndiGo: ప్రయాణీకులను ఏడిపించినందుకు ఇండిగోకు భారీ శిక్ష!
ఇదిలా ఉంటే తాజాగా యూరోపియన్ దేశాలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరోపియన్ దేశాల తీరు కారణంగానే శాంతి ఒప్పందం ముందుకు సాగడం లేదని మిత్రదేశాలపై ట్రంప్ గుర్రుగా ఉన్నారు. అయితే తాజాగా జెలెన్స్కీకి ట్రంప్ డెడ్లైన్ విధించినట్లు తెలుస్తోంది. క్రిస్మస్ సమయానికి శాంతి ఒప్పందానికి ఒప్పుకోవాలని జెలెన్స్కీపై ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: YS Jagan: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన..
శనివారం రెండు గంటల పాటు జెలెన్స్కీతో ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, అధ్యక్షుడు అల్లుడు జారెడ్ కుష్నర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాంతి ఒప్పందంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. క్రిస్మస్ నాటికి ఒప్పందం కుదుర్చుకోవాలని ఒక డెడ్లైన్ విధించినట్లు సమాచారం. అయితే యూరోపియన్ దేశాలతో చర్చించేందుకు తనకు సమయం కావాలని అడిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి ట్రంప్ డైడ్లైన్ విషయాన్ని యూరోపియన్ దేశాధినేతలకు జెలెన్స్కీ తెలిపారు. అయితే శాంతి ఒప్పందానికి నాటో దేశాలు సానుకూలంగా లేనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.