YS Jagan: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వర్గాలు రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందంటూ చేస్తున్న ప్రకటనలు వాస్తవానికి దూరమని విమర్శించారు. తప్పుడు లెక్కలను చూపించి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడిపై జగన్ ఫైర్ అయ్యారు. జనం మోసపోవద్దన్న ఉద్దేశంతో అసలు లెక్కలను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం తయారు చేసుకున్న లెక్కలకు కాగ్ నివేదికలకు ఎలాంటి సంబంధం ఉండదని, కాగ్ మాత్రం నిజాలను మాత్రమే బయటపెడుతుందని స్పష్టం చేశారు.
Also Read
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
- NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
జనరల్ ఆడిట్ రిపోర్టులు (CAG Reports) ప్రభుత్వ నిజమైన ఆదాయాలు, ఖర్చులు, అప్పులు, పెట్టుబడులను స్పష్టంగా తెలియజేస్తాయని జగన్ గుర్తుచేశారు. వాటి ప్రకారం రాష్ట్ర అప్పులు అధికంగా పెరిగిపోయాయని, ఆదాయాలు గణనీయంగా పడిపోయాయని వెల్లడించారు. మూలధన వ్యయం ఆందోళనకర స్థాయికి చేరిందని, భారీ అవినీతి కారణంగా ప్రభుత్వ ఆదాయాలు పక్కదారి పడుతున్నాయని అన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలను కొందరు దోచుకుంటున్నారని ఆరోపించారు.
అభివృద్ధి జరుగుతోందనుకునే పరిస్థితి ఉంటే, ప్రభుత్వం ఎందుకు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుందో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2014–19 మధ్య తెలుగుదేశం పాలనలో రాష్ట్ర GSDP వృద్ధి గొప్పదనమే ఉంటే, ఎలా 2019–24 కాలంలోని జాతీయ జీడీపీలో రాష్ట్రం వాటా 4.78% కాగా, 2014–19 కాలంలో అది కేవలం 4.45% మాత్రమే ఉందని ప్రశ్నించారు. తలసరి ఆదాయంలో కూడా రాష్ట్రం ఒక్క మెట్టు కూడా ఎక్కలేదని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొందరిని కొన్ని రోజుల పాటు మోసం చేయగలిగినా, అందరినీ ఎప్పటికీ మోసం చేయలేరని మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలిసేలా చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రచారమేనని ఆయన విమర్శించారు.
𝗧𝗗𝗣 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁’𝘀 𝗰𝗼𝗼𝗸𝗲𝗱 𝗳𝗶𝗴𝘂𝗿𝗲𝘀 𝗲𝘅𝗽𝗼𝘀𝗲𝗱!
Yesterday, Mr. Chandrababu Naidu released the advance estimates for the GSDP during the first half of this financial year 2025-26. As correctly pointed out by @ncbn Garu, the Government prepared the… pic.twitter.com/pG3V1H8lgY
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 9, 2025
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!