YS Jagan: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వర్గాలు రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందంటూ చేస్తున్న ప్రకటనలు వాస్తవానికి దూరమని విమర్శించారు. తప్పుడు లెక్కలను చూపించి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడిపై జగన్ ఫైర్ అయ్యారు. జనం మోసపోవద్దన్న ఉద్దేశంతో అసలు లెక్కలను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం తయారు చేసుకున్న లెక్కలకు కాగ్ నివేదికలకు ఎలాంటి సంబంధం ఉండదని, కాగ్ మాత్రం నిజాలను మాత్రమే బయటపెడుతుందని స్పష్టం చేశారు.
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
జనరల్ ఆడిట్ రిపోర్టులు (CAG Reports) ప్రభుత్వ నిజమైన ఆదాయాలు, ఖర్చులు, అప్పులు, పెట్టుబడులను స్పష్టంగా తెలియజేస్తాయని జగన్ గుర్తుచేశారు. వాటి ప్రకారం రాష్ట్ర అప్పులు అధికంగా పెరిగిపోయాయని, ఆదాయాలు గణనీయంగా పడిపోయాయని వెల్లడించారు. మూలధన వ్యయం ఆందోళనకర స్థాయికి చేరిందని, భారీ అవినీతి కారణంగా ప్రభుత్వ ఆదాయాలు పక్కదారి పడుతున్నాయని అన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలను కొందరు దోచుకుంటున్నారని ఆరోపించారు.
అభివృద్ధి జరుగుతోందనుకునే పరిస్థితి ఉంటే, ప్రభుత్వం ఎందుకు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుందో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2014–19 మధ్య తెలుగుదేశం పాలనలో రాష్ట్ర GSDP వృద్ధి గొప్పదనమే ఉంటే, ఎలా 2019–24 కాలంలోని జాతీయ జీడీపీలో రాష్ట్రం వాటా 4.78% కాగా, 2014–19 కాలంలో అది కేవలం 4.45% మాత్రమే ఉందని ప్రశ్నించారు. తలసరి ఆదాయంలో కూడా రాష్ట్రం ఒక్క మెట్టు కూడా ఎక్కలేదని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొందరిని కొన్ని రోజుల పాటు మోసం చేయగలిగినా, అందరినీ ఎప్పటికీ మోసం చేయలేరని మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలిసేలా చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రచారమేనని ఆయన విమర్శించారు.
𝗧𝗗𝗣 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁’𝘀 𝗰𝗼𝗼𝗸𝗲𝗱 𝗳𝗶𝗴𝘂𝗿𝗲𝘀 𝗲𝘅𝗽𝗼𝘀𝗲𝗱!
Yesterday, Mr. Chandrababu Naidu released the advance estimates for the GSDP during the first half of this financial year 2025-26. As correctly pointed out by @ncbn Garu, the Government prepared the… pic.twitter.com/pG3V1H8lgY
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 9, 2025
తాజావార్తలు
-
IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
-
Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
-
Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
-
Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!