YS Jagan: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన..
YS Jagan: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వర్గాలు రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందంటూ చేస్తున్న ప్రకటనలు వాస్తవానికి దూరమని విమర్శించారు. తప్పుడు లెక్కలను చూపించి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడిపై జగన్ ఫైర్ అయ్యారు. జనం మోసపోవద్దన్న ఉద్దేశంతో అసలు లెక్కలను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం తయారు చేసుకున్న లెక్కలకు కాగ్ నివేదికలకు ఎలాంటి సంబంధం ఉండదని, కాగ్ మాత్రం నిజాలను మాత్రమే బయటపెడుతుందని స్పష్టం చేశారు.
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
జనరల్ ఆడిట్ రిపోర్టులు (CAG Reports) ప్రభుత్వ నిజమైన ఆదాయాలు, ఖర్చులు, అప్పులు, పెట్టుబడులను స్పష్టంగా తెలియజేస్తాయని జగన్ గుర్తుచేశారు. వాటి ప్రకారం రాష్ట్ర అప్పులు అధికంగా పెరిగిపోయాయని, ఆదాయాలు గణనీయంగా పడిపోయాయని వెల్లడించారు. మూలధన వ్యయం ఆందోళనకర స్థాయికి చేరిందని, భారీ అవినీతి కారణంగా ప్రభుత్వ ఆదాయాలు పక్కదారి పడుతున్నాయని అన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలను కొందరు దోచుకుంటున్నారని ఆరోపించారు.
అభివృద్ధి జరుగుతోందనుకునే పరిస్థితి ఉంటే, ప్రభుత్వం ఎందుకు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుందో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2014–19 మధ్య తెలుగుదేశం పాలనలో రాష్ట్ర GSDP వృద్ధి గొప్పదనమే ఉంటే, ఎలా 2019–24 కాలంలోని జాతీయ జీడీపీలో రాష్ట్రం వాటా 4.78% కాగా, 2014–19 కాలంలో అది కేవలం 4.45% మాత్రమే ఉందని ప్రశ్నించారు. తలసరి ఆదాయంలో కూడా రాష్ట్రం ఒక్క మెట్టు కూడా ఎక్కలేదని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొందరిని కొన్ని రోజుల పాటు మోసం చేయగలిగినా, అందరినీ ఎప్పటికీ మోసం చేయలేరని మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలిసేలా చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రచారమేనని ఆయన విమర్శించారు.
𝗧𝗗𝗣 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁’𝘀 𝗰𝗼𝗼𝗸𝗲𝗱 𝗳𝗶𝗴𝘂𝗿𝗲𝘀 𝗲𝘅𝗽𝗼𝘀𝗲𝗱!
Yesterday, Mr. Chandrababu Naidu released the advance estimates for the GSDP during the first half of this financial year 2025-26. As correctly pointed out by @ncbn Garu, the Government prepared the… pic.twitter.com/pG3V1H8lgY
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 9, 2025
తాజావార్తలు
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
-
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
-
Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
-
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!
-
Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్పై నటి షాకింగ్ కామెంట్స్.. “రాత్రి 12 గంటలకు నా రూమ్లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!”
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో