Trump-China: హార్ముజ్ తెరుచుకోవడంపై జిన్పింగ్ చాలా సంతోషంగా ఉన్నారు.. త్వరలోనే చైనాకు వెళ్తానన్న ట్రంప్
- హార్ముజ్ తెరుచుకోవడంపై జిన్పింగ్ చాలా సంతోషంగా ఉన్నారు
- త్వరలోనే చైనాకు వెళ్తున్నట్లు ప్రకటన
- జిన్పింగ్ను కలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్న వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హార్ముజ్ జలసంధి తెరుచుకోవడంపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చాలా సంతోషంగా ఉన్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధి తెరుచుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరాన్ కూడా ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హార్ముజ్ జలసంధి తెరుచుకోవడం లేదా త్వరలో పూర్తిగా అందుబాటులోకి రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారని ట్రంప్ తెలిపారు. చైనాలో జరగబోయే తమ సమావేశం ప్రత్యేకంగా.. చారిత్రాత్మకంగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు. అధ్యక్షుడు జిన్పింగ్ను కలుసుకునేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని.. ఈ సమావేశంతో చాలా విషయాలు సాధ్యమవుతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
- Iran Commander: ఇరాన్ కమాండర్ సంచలన ప్రకటన.. అమెరికా సైనికులను పట్టుకున్నా లేదా చంపినా 30,000 డాలర్ల బహుమతి
- Donald Trump: కిమ్ జోంగ్ ఉన్తో మంచి సంబంధాలు.. అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు తగ్గించాలని ట్రంప్ ఆదేశం
- Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
- Bangladesh: షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్ వస్తాడంట.. బంగ్లాదేశ్ ప్రధాని షరతు..
ఇది కూడా చదవండి: Mamata Banerjee: మమత ర్యాలీలో యువకుడు దుశ్చర్య.. హడలెత్తిపోయిన ముఖ్యమంత్రి
అధ్యక్షుడు ట్రంప్ మే నెలలో చైనాలో పర్యటించనున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక దక్షిణాసియాకు రావడం ఇదే తొలిసారి. చైనాతో పాటు పాకిస్థాన్లో కూడా పర్యటించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరితే సంతకాలు చేసేందుకు పాకిస్థాన్లో కూడా పర్యటిస్తానని ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Modi Cabinet: ఉ.11:30కి మోడీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
ఫిబ్రవరి 28న ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. ఖమేనీ సహా పలు కీలక నేతలంతా హతమయ్యారు. అనంతరం ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో చమురు, గ్యాస్ కష్టాలు తలెత్తాయి. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం సోమవారంతో ముగుస్తోంది.
ఇదిలా ఉంటే శాంతి ఒప్పందం కోసం గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరిగాయి. 21 గంటల తర్వాత చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతం మరోసారి చర్చల కోసం సోమవారం తిరిగి పాకిస్థాన్లో కలవనున్నారు. ఈ చర్చలైనా ఫలిస్తాయో లేదో చూడాలి.

తాజావార్తలు
-
Rajahmundry Tragedy: రాజమహేంద్రవరంలో విషాదం.. గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం, ముగ్గురు గల్లంతు!
-
Alias Rukmini: నితిన్ కోసం రంగంలోకి దిగిన నాని.. ‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్కు రెడీ!
-
El Nino: నెమ్మదిగా వేడెక్కుతున్న పసిఫిక్ జలాలు.. ప్రమాదం ముంచుకొస్తోందా?
-
Prabhas : ‘ఫౌజీలో ఈ సీన్ ఎంత బాగా తీశాడంటే’.. హను వర్క్ పట్ల సన్నిహితులతో ప్రభాస్
-
Explainer: ఆంధ్రప్రదేశ్లో దారుణ పరిస్థితులు..వర్షపు నీరు లేక రైతుల కంట కన్నీరు.. దేశంలోనే టాప్!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?