Trump-China: హార్ముజ్ తెరుచుకోవడంపై జిన్పింగ్ చాలా సంతోషంగా ఉన్నారు.. త్వరలోనే చైనాకు వెళ్తానన్న ట్రంప్
- హార్ముజ్ తెరుచుకోవడంపై జిన్పింగ్ చాలా సంతోషంగా ఉన్నారు
- త్వరలోనే చైనాకు వెళ్తున్నట్లు ప్రకటన
- జిన్పింగ్ను కలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్న వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హార్ముజ్ జలసంధి తెరుచుకోవడంపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చాలా సంతోషంగా ఉన్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధి తెరుచుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరాన్ కూడా ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హార్ముజ్ జలసంధి తెరుచుకోవడం లేదా త్వరలో పూర్తిగా అందుబాటులోకి రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారని ట్రంప్ తెలిపారు. చైనాలో జరగబోయే తమ సమావేశం ప్రత్యేకంగా.. చారిత్రాత్మకంగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు. అధ్యక్షుడు జిన్పింగ్ను కలుసుకునేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని.. ఈ సమావేశంతో చాలా విషయాలు సాధ్యమవుతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
ఇది కూడా చదవండి: Mamata Banerjee: మమత ర్యాలీలో యువకుడు దుశ్చర్య.. హడలెత్తిపోయిన ముఖ్యమంత్రి
అధ్యక్షుడు ట్రంప్ మే నెలలో చైనాలో పర్యటించనున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక దక్షిణాసియాకు రావడం ఇదే తొలిసారి. చైనాతో పాటు పాకిస్థాన్లో కూడా పర్యటించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరితే సంతకాలు చేసేందుకు పాకిస్థాన్లో కూడా పర్యటిస్తానని ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Modi Cabinet: ఉ.11:30కి మోడీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
ఫిబ్రవరి 28న ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. ఖమేనీ సహా పలు కీలక నేతలంతా హతమయ్యారు. అనంతరం ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో చమురు, గ్యాస్ కష్టాలు తలెత్తాయి. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం సోమవారంతో ముగుస్తోంది.
ఇదిలా ఉంటే శాంతి ఒప్పందం కోసం గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరిగాయి. 21 గంటల తర్వాత చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతం మరోసారి చర్చల కోసం సోమవారం తిరిగి పాకిస్థాన్లో కలవనున్నారు. ఈ చర్చలైనా ఫలిస్తాయో లేదో చూడాలి.

తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!