Trump-China: హార్ముజ్ తెరుచుకోవడంపై జిన్పింగ్ చాలా సంతోషంగా ఉన్నారు.. త్వరలోనే చైనాకు వెళ్తానన్న ట్రంప్
- హార్ముజ్ తెరుచుకోవడంపై జిన్పింగ్ చాలా సంతోషంగా ఉన్నారు
- త్వరలోనే చైనాకు వెళ్తున్నట్లు ప్రకటన
- జిన్పింగ్ను కలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్న వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హార్ముజ్ జలసంధి తెరుచుకోవడంపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చాలా సంతోషంగా ఉన్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధి తెరుచుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరాన్ కూడా ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హార్ముజ్ జలసంధి తెరుచుకోవడం లేదా త్వరలో పూర్తిగా అందుబాటులోకి రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారని ట్రంప్ తెలిపారు. చైనాలో జరగబోయే తమ సమావేశం ప్రత్యేకంగా.. చారిత్రాత్మకంగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు. అధ్యక్షుడు జిన్పింగ్ను కలుసుకునేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని.. ఈ సమావేశంతో చాలా విషయాలు సాధ్యమవుతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
- US strikes on Iran: అమెరికా దూకుడు.. ఇరాన్లో పేలుళ్ల మోత!.. ట్రంప్ హెచ్చరికల తర్వాత ఉద్రిక్తత మరింత తీవ్రం
- Fake Condoms: "కండోమ్"లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
- Pakistan: టెంపోలో శవపేటికలు.. పాకిస్తాన్ పోలీసుల దుస్థితిపై తీవ్ర విమర్శలు
- Trump–Meloni: టర్కీలో ట్రంప్-మెలోనీ ఎడముఖం.. పెడముఖం.. వీడియో వైరల్
ఇది కూడా చదవండి: Mamata Banerjee: మమత ర్యాలీలో యువకుడు దుశ్చర్య.. హడలెత్తిపోయిన ముఖ్యమంత్రి
అధ్యక్షుడు ట్రంప్ మే నెలలో చైనాలో పర్యటించనున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక దక్షిణాసియాకు రావడం ఇదే తొలిసారి. చైనాతో పాటు పాకిస్థాన్లో కూడా పర్యటించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరితే సంతకాలు చేసేందుకు పాకిస్థాన్లో కూడా పర్యటిస్తానని ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Modi Cabinet: ఉ.11:30కి మోడీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
ఫిబ్రవరి 28న ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. ఖమేనీ సహా పలు కీలక నేతలంతా హతమయ్యారు. అనంతరం ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో చమురు, గ్యాస్ కష్టాలు తలెత్తాయి. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం సోమవారంతో ముగుస్తోంది.
ఇదిలా ఉంటే శాంతి ఒప్పందం కోసం గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరిగాయి. 21 గంటల తర్వాత చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతం మరోసారి చర్చల కోసం సోమవారం తిరిగి పాకిస్థాన్లో కలవనున్నారు. ఈ చర్చలైనా ఫలిస్తాయో లేదో చూడాలి.

తాజావార్తలు
-
Ramayana: భారత్ మండపంలో గ్రాండ్ ఈవెంట్.. ‘రామాయణం’ ట్రైలర్కు భారీ ప్లాన్!
-
Astrology: జూలై 9 గురువారం దినఫలాలు.. మీది ఈ రాశియా? అయితే జాగ్రత్త..
-
US strikes on Iran: అమెరికా దూకుడు.. ఇరాన్లో పేలుళ్ల మోత!.. ట్రంప్ హెచ్చరికల తర్వాత ఉద్రిక్తత మరింత తీవ్రం
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..