Trump-Modi: మోడీపై మరోసారి ట్రంప్ ప్రశంసలు.. భారత్లో పర్యటనపై హింట్
- మోడీపై మరోసారి ట్రంప్ ప్రశంసలు
- భారత్లో పర్యటనపై కీలక హింట్
ప్రధాని మోడీపై మరోసారి ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోడీ గొప్ప వ్యక్తి అని.. అలాగే మంచి స్నేహితుడు అంటూ కొనియాడారు. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. బరువు తగ్గించే మందుల ధరలకు సంబంధించిన కొత్త ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మోడీతో చర్చలు బాగా జరుగుతున్నాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: Vande Mataram: నేడు “వందేమాతరం” 150 వ వార్షికోత్సవాలు.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ
Also Read
- Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
- Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
- Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
- Condom Prices: బెడ్రూమ్లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా వచ్చే ఏడాది భారత్లో పర్యటించే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం చాలా మట్టుకు భారత్ మానేసిందని తెలిపారు. మోడీ మంచి స్నేహితుడు.. మేము మాట్లాడుకుంటూ ఉంటామని చెప్పారు. భారత్కు రావాలని కోరుతున్నారని.. కచ్చితంగా భారత్కు వెళ్తానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది భారత్కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘అవును.. అలా కావచ్చు’’ అని ట్రంప్ బదులిచ్చారు.
ఇది కూడా చదవండి: Droupadi Murmu : ఈనెల 20న ఏపీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఈ ఏడాది చివరిలో భారత్లో క్వాడ్ సమ్మిట్ (Quad Summit) జరగనుంది. ఇందులో యునైటెడ్ స్టేట్స్, జపాన్, భారతదేశం, ఆస్ట్రేలియా సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే వాణిజ్య యుద్ధం కారణంగా భారత్లో జరిగే క్వాడ్ సమ్మిట్కు ట్రంప్ భారతదేశాన్ని సందర్శించే ఉద్దేశం లేదని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో ఆగస్టులో పేర్కొంది. కానీ ఇంతలోనే ట్రంప్లో మార్పు కనిపిస్తోంది. మోడీతో మంచి సంబంధాలు ఉన్నాయని.. కచ్చితంగా భారత్ను సందర్శిస్తానని గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ట్రంప్ క్లారిటీ ఇచ్చేశారు.
వాస్తవంగా ట్రంప్ మొదటి పాలన కాలంలో మోడీతో మంచి సంబంధాలు ఉన్నాయి. రెండోసారి ట్రంప్ అధికారంలోకి వచ్చాక.. సుంకాలు కారణంగా రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. తొలుత భారత్పై 25 శాతం సుంకం విధించగా.. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ బాంబ్ పేల్చారు. దీంతో భారత్పై 50 శాతం సుంకం విధించినట్లైంది. అన్ని దేశాల కంటే భారత్పైనే ఎక్కువగా ట్రంప్ సుంకం విధించారు. దీంతో రెండు దేశాల మధ్య ఉన్న స్నేహం పూర్తిగా దెబ్బతింది. ఇదిలా ఉంటే ఇటీవల ట్రంప్ దక్షిణ కొరియాలో పర్యటనలో ఉండగా మోడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
- Tags
- india
- PM Modi
- Trade
- Trump praises
- us
తాజావార్తలు
-
TGSRTC Strike: నేడు ఆర్టీసీ బస్సులు నడుస్తాయా? సమ్మెపై క్లారిటీ ఇచ్చిన జేఏసీ!
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?