Trump: బిన్ లాడెన్ను చంపినోళ్లను ఎవరు మరిచిపోరు.. నేవీ సీల్స్పై ట్రంప్ ప్రశంసలు
- బిన్ లాడెన్ను చంపినోళ్లను ఎవరు మరిచిపోరు
- నేవీ సీల్స్పై ట్రంప్ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒసామా బిన్ లాడెన్ను చంపిన వారిని ఎవరూ మరిచిపోరని ట్రంప్ పేర్కొన్నారు. ఆదివారం వర్జీనియాలోని నార్ఫోక్లో అమెరికా నావికాదళం 250వ ఉత్సవాలు సందర్భంగా జరిగిన ప్రత్యేక వేడుకలో ట్రంప్ ప్రసంగించారు. లాడెన్ తలలో బుల్లెట్లు దింపిన నేవీ సీల్స్ను చరిత్ర ఎప్పటికీ మరిచిపోదని.. ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని ట్రంప్ ప్రశంసించారు. 9/11 దాడికి ఒక సంవత్సరం ముందే లాడెన్ అంతు చూడాలని అధికారులకు సూచించినట్లు గుర్తుచేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదని.. సంవత్సరం తర్వాత అతడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ను పేల్చేశాడని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Bihar Elections: ఈరోజే బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. సా.4 గంటలకు ఈసీ ప్రెస్మీట్
Also Read
- Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
2001లో ఒసామా బిన్ లాడెన్ అమెరికా విమానాలను హైజాక్ చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్ను పేల్చేశాడు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. అనంతరం ఒబామా హయాంలో బిన్ లాడెన్ను అమెరికా దళాలు వెంటాడి చంపేశాయి. 2011, మే 2న యూఎస్ నేవీ సీల్స్ బిన్ లాడెన్ను చంపేందుకు ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ను నిర్వహించాయి. పాకిస్థాన్లోని అబోటాబాద్లోని రహస్య ఆపరేషన్ నిర్వహించాయి. నిఘా సంస్థలు కరుడు గట్టిన అల్-ఖైదా ఉగ్రవాది లాడెన్ జాడను గుర్తించి ఆపరేషన్ ప్రారంభించాయి. క్షణాల వ్యవధిలోనే లాడెన్ తలలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. అతనితో పాటు నలుగురు అక్కడికక్కడే హతమయ్యారు. అనంతరం లాడెన్ శవాన్ని సముద్రంలో పడేశారు. మొత్తానికి దశాబ్ద కాలం తర్వాత లాడెెన్ను అమెరికా దళాలు అంతుచూశాయి.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో మరో ట్విస్ట్! సింగపూర్లో మేనేజర్ ఏం చేశాడంటే..!
బిన్ లాడెన్ సౌదీలో జన్మించాడు. ఉన్నత విద్యను అభ్యసించి కరుడు గట్టిన ఉగ్రవాదిగా మారాడు. అల్ ఖైదాను స్థాపించి అనేక దేశాల్లో మారణహోమం సృష్టించాడు. 2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ టవర్స్ను పేల్చేశాడు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం డిసెంబర్ 2001లో పాకిస్థాన్కు పారిపోయాడు. ఇక అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా సూచన మేరకు 2011, మే నెలలో అమెరికా దళాలు ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ నిర్వహించి లాడెన్ హతమార్చాయి. పాకిస్థాన్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1 ఒంటి గంట ప్రాంతంలో హతమయ్యాడు. అనంతరం శవాన్ని ఆప్ఘనిస్థాన్కు తీసుకొచ్చి అరేబియా సముద్రంలో వదిలేశారు. ఈ ఆపరేషన్ను ఒబామా వైట్హౌస్ నుంచి వీక్షించారు. మే 6, 2011లో లాడెన్ మరణాన్ని అల్ ఖైదా ఉగ్రవాద సంస్థలు ధృవీకరించాయి.
తాజావార్తలు
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
-
Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!