Trump: సుంకాలపై ట్రంప్ పక్షపాతం.. చైనాకు ఏం చేశారంటే..!
- సుంకాలపై ట్రంప్ పక్షపాతం
- చైనా విషయంలో యూటర్న్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యాతో సంబంధాలు పెట్టుకున్న దేశాలకు భారీ జరిమానాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఇందులో భాగంగానే భారత్పై అదనంగా 25 శాతం సుంకం విధించారు. ఇదే కోవలో చైనా కూడా ఉంది. రష్యా దగ్గర చైనా కూడా చమురు కొనుగోలు చేస్తోంది. కానీ చైనా విషయంలో మాత్రం పక్షపాతం చూపించారు. చైనాకు విధించిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేశారు. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ సోమవారం కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపినట్లు కథనం వెలువడింది.
పరస్పర సుంకాలపై గత నెలలో స్టాక్హోమ్లో అమెరికా-చైనా అధికారుల మధ్య వాణిజ్య చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో చైనాపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేసినట్లు నివేదికలు అందుతున్నాయి.
Also Read
- Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Strait of Hormuz: హోర్ముజ్పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
ఇది కూడా చదవండి: Bilawal Bhutto: సింధు నదిపై ఆనకట్ట నిర్మిస్తే భారత్ తో యుద్ధమే..
అయితే చైనాతో అమెరికా మంచి సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనాకు విధించిన సుంకాల విషయంలో అగ్ర రాజ్యం వెనక్కి తగ్గినట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. ఇక ఇదే విషయంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ మాట్లాడుతూ.. చైనాపై ప్రతీకార సుంకాలు విధించాలా? వద్దా? అన్న అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. సుంకాల విషయంలో చైనా సమస్య కొంచెం సంక్లిష్టంగా ఉంటుందని తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలుతో ముడి పెట్టలేని అనేక ఇతర అంశాలు అమెరికా-చైనా సంబంధాలను ప్రభావితం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్కు విధించినట్టుగా చైనాకు కూడా జరిమానా విధిస్తారా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు జేడీవాన్స్ పైవిధంగా స్పందించారు.
ఇది కూడా చదవండి: Sridevi : ‘కోర్టు’ హీరోయిన్ సీక్రెట్గా పెళ్లి..! వీడియో వైరల్
తొలుత భారతదేశంపై ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానా కింద అదనంగా మరో 25 శాతం సుంకం విధిస్తు్న్నట్లు బాంబ్ పేల్చారు. ఇప్పుడు భారత్ 50 శాతం సుంకం చెల్లించాల్సి వస్తుంది. కొత్తగా విధించింది ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుంది. అయితే భారత్ కొనుగోలు చేస్తున్నట్లుగా చైనా కూడా రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తోంది. కానీ చైనాకు మాత్రం జరిమానా విధించలేదు. దీంతో ఇదేం పక్షపాతం అంటూ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు.
తాజావార్తలు
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
-
Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
The Paradise : అనిరుధ్ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. ‘ది పారడైజ్’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..