Trump: సుంకాలపై ట్రంప్ పక్షపాతం.. చైనాకు ఏం చేశారంటే..!
- సుంకాలపై ట్రంప్ పక్షపాతం
- చైనా విషయంలో యూటర్న్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యాతో సంబంధాలు పెట్టుకున్న దేశాలకు భారీ జరిమానాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఇందులో భాగంగానే భారత్పై అదనంగా 25 శాతం సుంకం విధించారు. ఇదే కోవలో చైనా కూడా ఉంది. రష్యా దగ్గర చైనా కూడా చమురు కొనుగోలు చేస్తోంది. కానీ చైనా విషయంలో మాత్రం పక్షపాతం చూపించారు. చైనాకు విధించిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేశారు. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ సోమవారం కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపినట్లు కథనం వెలువడింది.
పరస్పర సుంకాలపై గత నెలలో స్టాక్హోమ్లో అమెరికా-చైనా అధికారుల మధ్య వాణిజ్య చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో చైనాపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేసినట్లు నివేదికలు అందుతున్నాయి.
Also Read
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
- France Heatwave: ఫ్రాన్స్ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
- China: జిన్పింగ్కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
ఇది కూడా చదవండి: Bilawal Bhutto: సింధు నదిపై ఆనకట్ట నిర్మిస్తే భారత్ తో యుద్ధమే..
అయితే చైనాతో అమెరికా మంచి సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనాకు విధించిన సుంకాల విషయంలో అగ్ర రాజ్యం వెనక్కి తగ్గినట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. ఇక ఇదే విషయంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ మాట్లాడుతూ.. చైనాపై ప్రతీకార సుంకాలు విధించాలా? వద్దా? అన్న అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. సుంకాల విషయంలో చైనా సమస్య కొంచెం సంక్లిష్టంగా ఉంటుందని తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలుతో ముడి పెట్టలేని అనేక ఇతర అంశాలు అమెరికా-చైనా సంబంధాలను ప్రభావితం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్కు విధించినట్టుగా చైనాకు కూడా జరిమానా విధిస్తారా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు జేడీవాన్స్ పైవిధంగా స్పందించారు.
ఇది కూడా చదవండి: Sridevi : ‘కోర్టు’ హీరోయిన్ సీక్రెట్గా పెళ్లి..! వీడియో వైరల్
తొలుత భారతదేశంపై ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానా కింద అదనంగా మరో 25 శాతం సుంకం విధిస్తు్న్నట్లు బాంబ్ పేల్చారు. ఇప్పుడు భారత్ 50 శాతం సుంకం చెల్లించాల్సి వస్తుంది. కొత్తగా విధించింది ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుంది. అయితే భారత్ కొనుగోలు చేస్తున్నట్లుగా చైనా కూడా రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తోంది. కానీ చైనాకు మాత్రం జరిమానా విధించలేదు. దీంతో ఇదేం పక్షపాతం అంటూ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు.
తాజావార్తలు
-
Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
-
Telangana : IFS అధికారుల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.!
-
EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్లపై కంప్లీట్ బ్యాన్!
-
Nabha Natesh : శాకాహారులుగా మారిపోయాం!.. నభా నటేష్ సెన్సేషనల్ కామెంట్స్!
-
Arrears Release: బకాయిల క్లియరెన్స్.. తెలంగాణ ఉద్యోగులకు ఊరట!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!