Trump: ఇరాన్ యురేనియంపై ట్రంప్ సంచలన ప్రకటన
- ఇరాన్ యురేనియంపై ట్రంప్ సంచలన ప్రకటన
- వైట్హౌస్ వేదికగా బిగ్ అనౌన్సె
- ఇంకా అధికారికంగా ధృవీకరించని ఇరాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం మొత్తం అమెరికాకు అప్పగించేందుకు అంగీకరించిందని బిగ్ ప్రకటన చేశారు. వైట్హౌస్లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘వాళ్లు న్యూక్లియర్ డస్ట్ (సుసంపన్న యురేనియం నిల్వ) మాకు తిరిగి ఇవ్వడానికి అంగీకరించారు.’’ అని తెలిపారు. ఈ అంశంపై రెండు దేశాలు ఒక ఒప్పందానికి దగ్గరగా ఉన్నాయని స్పష్టం చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఒకవేళ ఒప్పందం కుదిరితే అనేక ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. అంతేకాదు.. ఒకవేళ ఒప్పందం ఇస్లామాబాద్లో జరిగితే పాకిస్థాన్కు కూడా వెళ్తానని ట్రంప్ సూచించారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
ఇది కూడా చదవండి: Fly Over: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి..
Also Read
- Iran-US: అమెరికాకు బిగ్ షాక్.. శాంతి చర్చల వేళ ఇరాన్ ఝలక్.. ఉద్రిక్తతలు తప్పవా?
- Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
- Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
- Kyiv Air Strike: దద్దరిల్లిన ఉక్రెయిన్ రాజధాని.. యుద్ధ రంగంలోకి ‘ఒరేశ్నిక్’ హైపర్సోనిక్ మిస్సైల్!
గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య 21 గంటల పాటు చర్చ జరిగింది. అయితే చర్చలు ఫలించకపోవడంతో ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. యురేనియం శుద్ధిని 20 ఏళ్ల పాటు నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేయగా.. ఇరాన్ ఐదు సంవత్సరాల వరకు మాత్రమే అంగీకరిస్తామని తెగేసి చెప్పింది. ఈ విషయంలో రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. అమెరికా నిర్దేశించిన “రెడ్ లైన్స్” పాటిస్తే ఈ ఒప్పందం రెండు దేశాలకు లాభదాయకంగా ఉంటుందన్నారు. అయితే ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని.. అంతే తప్ప అణు ఆయుధాలు తయారు చేసే ఉద్దేశ్యం లేదని పేర్కొంది.
ఇది కూడా చదవండి: LIC: ఎల్ఐసీ కస్టమర్లకు గుడ్న్యూస్.. ఇక కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే..
అయితే రెండో విడత చర్చల కోసం వాషింగ్టన్ ఆదేశాల మేరకు ఇరాన్ ఒప్పించేందుకు పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ ఇరాన్లో పర్యటిస్తున్నారు. రెండు, మూడు రోజుల నుంచి టెహ్రాన్లో కీలక నేతలతో సమావేశమై చర్చిస్తున్నారు. గురువారం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిభాఫ్తో సమావేశమై శాంతి చర్చలపై చర్చించారు. ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ ప్రకారం.. అసిమ్ మునీర్.. రివల్యూషనరీ గార్డ్స్ కేంద్ర ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించి ఇరాన్ కమాండర్లతో కీలక అంశాలపై చర్చించారు. అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, ఇతర నాయకులతో కూడా సమావేశమయ్యారు. అయితే రెండో విడత చర్చలపై మాత్రం ఇరాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?