Trump: ఇరాన్ యురేనియంపై ట్రంప్ సంచలన ప్రకటన
- ఇరాన్ యురేనియంపై ట్రంప్ సంచలన ప్రకటన
- వైట్హౌస్ వేదికగా బిగ్ అనౌన్సె
- ఇంకా అధికారికంగా ధృవీకరించని ఇరాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం మొత్తం అమెరికాకు అప్పగించేందుకు అంగీకరించిందని బిగ్ ప్రకటన చేశారు. వైట్హౌస్లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘వాళ్లు న్యూక్లియర్ డస్ట్ (సుసంపన్న యురేనియం నిల్వ) మాకు తిరిగి ఇవ్వడానికి అంగీకరించారు.’’ అని తెలిపారు. ఈ అంశంపై రెండు దేశాలు ఒక ఒప్పందానికి దగ్గరగా ఉన్నాయని స్పష్టం చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఒకవేళ ఒప్పందం కుదిరితే అనేక ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. అంతేకాదు.. ఒకవేళ ఒప్పందం ఇస్లామాబాద్లో జరిగితే పాకిస్థాన్కు కూడా వెళ్తానని ట్రంప్ సూచించారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
ఇది కూడా చదవండి: Fly Over: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి..
Also Read
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
- Modi-Trump: బెంగాల్లో విజయంపై మోడీని అభినందించిన ట్రంప్
గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య 21 గంటల పాటు చర్చ జరిగింది. అయితే చర్చలు ఫలించకపోవడంతో ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. యురేనియం శుద్ధిని 20 ఏళ్ల పాటు నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేయగా.. ఇరాన్ ఐదు సంవత్సరాల వరకు మాత్రమే అంగీకరిస్తామని తెగేసి చెప్పింది. ఈ విషయంలో రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. అమెరికా నిర్దేశించిన “రెడ్ లైన్స్” పాటిస్తే ఈ ఒప్పందం రెండు దేశాలకు లాభదాయకంగా ఉంటుందన్నారు. అయితే ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని.. అంతే తప్ప అణు ఆయుధాలు తయారు చేసే ఉద్దేశ్యం లేదని పేర్కొంది.
ఇది కూడా చదవండి: LIC: ఎల్ఐసీ కస్టమర్లకు గుడ్న్యూస్.. ఇక కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే..
అయితే రెండో విడత చర్చల కోసం వాషింగ్టన్ ఆదేశాల మేరకు ఇరాన్ ఒప్పించేందుకు పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ ఇరాన్లో పర్యటిస్తున్నారు. రెండు, మూడు రోజుల నుంచి టెహ్రాన్లో కీలక నేతలతో సమావేశమై చర్చిస్తున్నారు. గురువారం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిభాఫ్తో సమావేశమై శాంతి చర్చలపై చర్చించారు. ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ ప్రకారం.. అసిమ్ మునీర్.. రివల్యూషనరీ గార్డ్స్ కేంద్ర ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించి ఇరాన్ కమాండర్లతో కీలక అంశాలపై చర్చించారు. అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, ఇతర నాయకులతో కూడా సమావేశమయ్యారు. అయితే రెండో విడత చర్చలపై మాత్రం ఇరాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
తాజావార్తలు
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
-
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
-
Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
-
Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!